యువత.. క్రీడల్లో ఘనత
పట్టణంలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పీజీ కళాశాలలో చదువుతున్న వారు క్రీడల్లో ప్రతిభ చూపుతున్నారు. పేద కుటుంబాలకు చెందిన వారు.
న్యూస్టుడే, కావలి: పట్టణంలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పీజీ కళాశాలలో చదువుతున్న వారు క్రీడల్లో ప్రతిభ చూపుతున్నారు. పేద కుటుంబాలకు చెందిన వారు. ఉన్నత లక్ష్యాలతో సాధన చేస్తున్నారు. తల్లిదండ్రుల ఆకాంక్షల మేరకు చదువుకుంటున్నారు. మరోవైపు ఇష్టమైన క్రీడల్లో సాధన చేస్తున్నారు. పోటీల్లో పాల్గొని సత్తా చాటుతున్నారు. వివిధ వేదికలపై విజేతలుగా నిలిచి బహుమతులు అందుకుంటున్నారు.
కబడ్డీలో ముని రత్నం సత్తా
కావలి పట్టణంలోని బుడంగుంట కాలనీకి చెందిన వేపగుంట మునిరత్నం ప్రస్తుతం ఎంకామ్ తొలి సంవత్సరం చదువుతున్నారు. కబడ్డీలో ప్రావీణ్యం సంపాదించారు. జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ చూపుతున్నారు. ఇతని తండ్రి శ్రీనివాసులు వంట పనిచేస్తున్నారు. తల్లి లక్ష్మి గృహిణి. పోలీస్ అధికారి ఉద్యోగం సాధించి ప్రజలకు సేవలందించాలనే లక్ష్యంతో శ్రమిస్తున్నారు. కబడ్డీతోపాటు బాల్బ్యాడ్మింటన్లోనూ శిక్షణ పొందుతున్నారు.
ఇదీ ప్రతిభ
2019లో జరిగిన విశ్వవిద్యాలయ స్థాయిలో జవహర్భారతి కళాశాల తరఫున ఆడి తన జట్టును ప్రథమస్థానంలో నిలిపారు. ః తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో 2021వలో జరిగిన 47వ జూనియర్ స్టేట్మీట్లో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ః 2023లో విశాఖపట్టణంలో జరిగిన దక్షిణ జోన్ పోటీల్లోనూ ప్రతిభాపాఠవాల్ని ప్రదర్శించారు.
క్రికెట్లో ఆల్రౌండర్ వెంకటేష్
వ్యవసాయ కుటుంబానికి చెందిన దేరంగుల వెంకటేష్ క్రికెట్లో మేటి ఆటగాడిగా రాణిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో సత్తా చూపి ఆల్రౌండర్గా గుర్తింపు పొందారు. దక్షిణ భారత క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు. స్థానిక టోర్నమెంట్లలో ఇప్పటి వరకు 50కి పైగా మ్యాచ్లు ఆడారు. వీటిలో రూ. 50 వేల వరకు నగదు బహుమతులు అందుకున్నారు. ఎమ్మెస్సీ జువాలజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. నంద్యాల జిల్లా డోన్కు చెందిన ఇతను భవిష్యత్తులో ప్రొఫెసర్గా స్థిరపడాలనే లక్ష్యంతో సాధన చేస్తున్నారు. భారత జట్టుకు ఎంపిక కావాలని ఆశిస్తున్నారు. తండ్రి చంద్రుడు, తల్లి వెంకటేశ్వరమ్మ ప్రోత్సాహంతో చదువుకుంటున్నానని తెలిపారు.
బాస్కెట్బాల్లో దిట్ట రేఖ
ఎమ్మెస్సీ జువాలజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మైలప్పగారి రేఖ బాస్కెట్బాల్లో ప్రతిభ చూపుతుంది. ఈమెది తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని అల్లికేశం గ్రామం. తండ్రి రమేష్, తల్లి మంజుల. వీరిద్దరూ వ్యవసాయ కూలీలు. చిన్నప్పటి నుంచి క్రీడలపై ఆసక్తి పెంచుకుంది. క్రీడా ఉపాధ్యాయుల సహకారంతో ఇష్టమైన వాటిలో నైపుణ్యం సాధించారు. భవిష్యత్తులో పోలీస్ అధికారి ఉద్యోగం సాధించి మహిళల సంరక్షణకు కృషి చేస్తానని ఈమె చెబుతుంది. గత ఏడాది బెంగళూరులో నిర్వహించిన దక్షిణ జోన్ బాస్కెట్బాల్ పోటీల్లో రన్నరప్ సాధించింది. విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో బాల్బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైఫల్యం చదువులకు అసౌకర్యం
[ 08-07-2024]
నాడు- నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలకు మహర్దశ కల్పిస్తున్నామంటూ వైకాపా ప్రభుత్వం గొప్పలకు పోయింది. నిధుల విడుదలలో తీవ్ర జాప్యం చేయడంతో గదుల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. తరగతులు ఎక్కడ నిర్వహించాలో తెలియని పరిస్థితి పలు బడుల్లో నెలకొంది. -
సర్వం సమస్యలే
[ 08-07-2024]
అధ్వాన పారిశుద్ధ్యం.. పనిచేయని ఏసీలు, సీసీ కెమెరాలు.. మరమ్మతులు చేయని లిఫ్టులు.. అందని నాణ్యమైన వైద్యం.. చెదలు నివారణకు ప్రతినెలా రూ.లక్షలు ఖర్చు చేస్తున్నా.. కలగని ప్రయోజనం.. ఇదీ జిల్లా సర్వజన ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితి. -
ఉచితం.. నిర్మాణ రంగానికి ఊతం
[ 08-07-2024]
తెదేపా ఎన్నికల హామీల అమల్లో భాగంగా ఉచిత ఇసుక విధానానికి పచ్చజెండా ఊపింది. సోమవారం నుంచి ఈ విధానం అమలు చేయనుంది. ఈ నిర్ణయంతో గత అయిదేళ్ల వైకాపా ఇసుకాసురులు చేసిన అడ్డగోలు దోపిడీకి అడ్డుకట్ట పడినట్లే. ఇసుక అందరికీ అందుబాటులో ఉండనుంది. -
పురపాలికలో అక్రమాలపై ఆరా!
[ 08-07-2024]
గత వైకాపా పాలనలో కావలి పురపాలక సంఘంలో పలు అక్రమాలు చోటుచేసుకున్నట్లు విమర్శలొచ్చాయి. రాష్ట్రంలో ఎన్నికలు జరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అక్రమాలు నిగ్గు తేల్చేందుకు తెదేపా నాయకులు ఆరా తీస్తున్నారు. -
వైకాపా నిర్లక్ష్యం.. ప్రజలకు శాపం
[ 08-07-2024]
వైకాపా ప్రభుత్వం కీలకమార్గాలపై నిర్లక్ష్యం చూపింది. అయిదేళ్లలో గుంతల్లో చారెడు మట్టిపోసిన దాఖలాలు లేవు. దీంతో అడుగుపెట్టేందుకు వీల్లేకుండా తయారయ్యాయి. పలు గ్రామాల ప్రజలు నిత్యం నరకయాతన పడుతున్నారు. -
చిరుతిండి.. రోగాలు దండి
[ 08-07-2024]
సర్వేపల్లి నియోజకవర్గంలోని ఒక సంక్షేమ వసతిగృహంలో విద్యార్థులు కలుషితమైన అహారం తీసుకోవడంతో అతిసారం బారిన పడ్డారు. సిబ్బంది అప్రమత్తమై నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యసేవలందించారు. -
అతివల జీవితాల్లో వెలుగులు
[ 08-07-2024]
మహిళా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు స్వయం సహాయక సంఘాలకు పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేసి ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా చర్యలు తీసుకుంటుంది. -
డీఎస్సీ అభ్యర్థుల సేవలో బీసీ స్టడీ సర్కిల్
[ 08-07-2024]
డీఎస్సీకి సన్నద్ధం అవుతున్న యువతకు శుభవార్త. ఇప్పటికే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు నాయుడు మొదటి సంతకం చేశారు. టెట్ నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. నెల్లూరులోని బీసీ స్టడీ సర్కిల్ ద్వారా డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. -
బంగినపల్లి అధరహో
[ 08-07-2024]
బంగినపల్లి మామిడి కాయల సీజన్ ముగిసిన తర్వాత కూడా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అక్కడక్కడ మిగిలిన కాయలను కొందరు వ్యాపారులు.. రైతుల వద్ద నుంచి దాదాపు కేజీ రూ.200 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. -
ఉద్యోగం కోసం వెళుతూ దుర్మరణం
[ 08-07-2024]
ఉద్యోగం కోసం వెళుతున్న వ్యక్తిని బస్సు రూపంలో మృత్యువు కబళించింది. ముందు వెళుతున్న స్కూటీని వేగంగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలైన ఘటన కొమ్మలపూడి అడ్డరోడ్డు సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది. -
సర్వేపల్లి జలాశయం పనుల్లో అక్రమాలు
[ 08-07-2024]
వెంకటాచలం, ముత్తుకూరు మండలాలకు సాగు, తాగునీరందించే సర్వేపల్లి జలాశయం ఆధునికీకరణ పనుల్లో భారీగా అక్రమాలు జరిగాయని జనసేన సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి నాయకులు సురేశ్ నాయుడు ఆరోపించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
భారీ వర్షాల ఎఫెక్ట్.. 27 విమానాల దారి మళ్లింపు..!
-
కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు ఇస్తాం: సీఎం రేవంత్రెడ్డి
-
‘బడ్జెట్’లో సొంతిల్లు.. ప్రభుత్వ సహకారం అందేనా?
-
తెలంగాణలో వివిధ కార్పొరేషన్లకు నూతన ఛైర్మన్ల నియామకం
-
బంగారు గనిలో ప్రమాదం.. 11 మంది మృతి
-
మహిళపై కారుతో దూసుకెళ్లి.. గర్ల్ఫ్రెండ్ ఇంట్లో నక్కి: శివసేన యువనేతపై లుక్ఔట్ నోటీసు