అనుమతి.. మాకెందుకది!
కాస్త పెట్టుబడి.. కొంత పరిచయాలు ఉంటే చాలు.. అనతికాలంలోనే రూ. కోట్లకు పడగలెత్తవచ్చనే ఆలోచనతో వైకాపా నాయకులు రెచ్చిపోయారు.
అయిదేళ్లలో వైకాపా నాయకుల భారీ భూ దందా
కాలువలు, కుంటలు, ప్రభుత్వ భూములు ఆక్రమించి లేఅవుట్లు
కాస్త పెట్టుబడి.. కొంత పరిచయాలు ఉంటే చాలు.. అనతికాలంలోనే రూ. కోట్లకు పడగలెత్తవచ్చనే ఆలోచనతో వైకాపా నాయకులు రెచ్చిపోయారు. గడచిన అయిదేళ్లలో ఇష్టానుసారం వేల ఎకరాల్లో లేఅవుట్లు వేశారు. కొన్నిచోట్ల ప్రభుత్వ, ప్రైవేటు భూములను ఆక్రమించడంతో పాటు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే విక్రయాలు చేశారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడంతో పాటు రిజర్వు స్థలాలనూ వదలకుండా దోచుకున్నారు. ప్రస్తుతం ఆయా లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసినవారు గగ్గోలు పెడుతుండగా- మంత్రి నారాయణ విచారణకు కమిటీ వేస్తుండటంతో అక్రమార్కుల్లో ఆందోళన మొదలైంది.
ఈనాడు, నెల్లూరు: పొదలకూరు, న్యూస్టుడే: నుడా పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో.. కార్పొరేషన్లో 1000 చ.మీటర్లు, మున్సిపాలిటీలు, పంచాయతీల్లో 300 చ.మీటర్లు పైబడిన భవనాలు, లేఅవుట్లు అభివృద్ధి చేయాలంటే.. అనుమతి అవసరం. కాగా, గత అయిదేళ్లలో కాసుల కక్కుర్తితో కొందరు స్థిరాస్తి వ్యాపారులు వైకాపా నాయకుల అండతో ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. వందల్లోనే అక్రమ లేఅవుట్లు వెలిశాయి. ప్రధానంగా నెల్లూరు రూరల్, సర్వేపల్లి, కోవూరు, కావలి నియోజకవర్గాల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. కొన్నిచోట్ల కాలువలు, పంట కుంటలను ఆక్రమించి మరీ లేఅవుట్లు వేశారు. వెనుక పొలాలకు నీరు వెళ్లేందుకూ వీలు లేకుండా ఏకంగా ప్రహరీలు నిర్మించారు. వాటిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే, ఇబ్బంది పెట్టడంతో పాటు అక్కడికి వెళ్లిన అధికారులపై ఒత్తిడి తీసుకురావడం గత ప్రభుత్వంలో పరిపాటి అయింది. దీంతో నుడాకు అనుమతుల జారీ ద్వారా వచ్చే రూ. కోట్ల ఆదాయానికి గండి పడింది.
వాటా.. ఎకరాకు రూ. అయిదు లక్షల పైమాటే
లేఅవుట్కు అనుమతి కోసం నుడాకు దరఖాస్తు చేసుకుంటే ఎకరాకు కార్పొరేషన్లో రూ. 1.75 లక్షలు, గ్రామీణంలో రూ. 65వేలు, మున్సిపాలిటీలో రూ. 1.27 లక్షలు చెల్లించాలి. లేఅవుట్ వేసే ప్రాంతాలను బట్టి.. చెల్లింపుల్లో కాస్త వ్యత్యాసం ఉంటుంది. దీంతో పాటు ఈడబ్ల్యూఎస్, అయిదు శాతం స్థలం వదలడం మామూలే. కాగా, లేఅవుట్ వేసే ముందు అక్కడి ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకుని.. ఈవేమీ లేకుండానే కొందరు విక్రయాలకు తెరదీశారు. దీనికి గాను.. గత అయిదేళ్లలో ఆయా ప్రాంతాలను బట్టి ఎకరాకు రూ. 5 లక్షల నుంచి రూ. పది లక్షల వరకు వారికి చెల్లించుకున్నట్లు సమాచారం. మొత్తంగా వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 2,500 ఎకరాలు మాత్రమే నుడా అనుమతి తీసుకోగా.. మరో పది వేల ఎకరాలు తీసుకోకుండానే విక్రయించినట్లు సమాచారం.
నీకింతా.. నాకెంత.. పద్ధతిలో!
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులేమీ లేకపోవడంతో.. నాయకులంతా గ్రావెల్, ఇసుక అక్రమ తరలింపుతో పాటు.. లేఅవుట్లపైనే దృష్టి పెట్టారు. నెల్లూరు నగరంలోని ఓ ప్రజాప్రతినిధికి లేఅవుట్ వేస్తే కప్పం కట్టక తప్పని పరిస్థితి కొనసాగింది. తర్వాత ఆ సంస్కృతి అన్ని నియోజకవర్గాలకు చేరింది. కావలిలో ఏకంగా వైకాపా ప్రజాప్రతినిధే భాగస్వామిగా వేసిన లేఅవుట్కు అనుమతి తీసుకోలేదు. పైగా అందులో ప్రభుత్వ భూమిని కలిపేసుకున్నారు. ఆ విషయాన్ని ఆయనే విలేకరుల సమావేశం పెట్టి చెప్పడం గమనార్హం. జగన్మోహన్రెడ్డి కావలిలో సిద్ధం సభ నిర్వహించిన లేఅవుట్కూ అనుమతి లేదు. దీన్ని గుర్తించిన నుడా అధికారులు.. కొనుగోలుదారులను అప్రమత్తం చేస్తూ హెచ్చరిక బోర్డు పెడితే.. నిమిషాల వ్యవధిలో పీకి పక్కనేయడం గమనార్హం.
ఇక్కడే 52 అక్రమ లేఅవుట్లు!
- తెదేపా నాయకుల ఆరోపణ
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి కనుసన్నల్లోనే అక్రమ లేఅవుట్లకు తెరలేపారని పొదలకూరు తెదేపా నాయకులు గురువారం ఆరోపించారు. పొదలకూరులోని ఓ అక్రమ లేఅవుట్పై విచారణ చేయాలని నుడా అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం.. మండల తెదేపా అధ్యక్షుడు మస్తాన్బాబు మాట్లాడుతూ.. మండలంలో కాకాణి కనుసన్నల్లోనే 52 అక్రమ లేఅవుట్లు వెలిశాయన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా బినామీలను పెట్టి రూ. కోట్లు దోచేశారన్నారు. పొదలకూరు పట్టణ సమీపంలో స్వర్ణ గార్డెన్స్ లేఅవుట్లో సుమారు రూ.200 కోట్ల విలువ చేసే వ్యవసాయ భూమిని ఏలాంటి కన్వర్షన్ లేకుండా, లేని దాన్ని ఉన్నట్లుగా ఒక డాక్యుమెంటు సృష్టించి డీటీసీపీ అప్రూవల్ ఉన్నట్లు సర్వే నంబర్లను మార్చి.. ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. డీటీసీపీతో ఏర్పడిన నంబరు పరిశీలించగా.. ఫోర్జరీ సంతకాలు అని తేలిందన్నారు. కార్యక్రమంలో పట్టణ తెదేపా అధ్యక్షుడు మల్లికార్జున్నాయుడు, శ్రీనివాసులురెడ్డి, గిరినాయుడు, శ్రీనివాసులురెడ్డి, వెంకటేశ్వర్లు, సుగుణమ్మ, జమీర్బాషా తదితరులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైఫల్యం చదువులకు అసౌకర్యం
[ 08-07-2024]
నాడు- నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలకు మహర్దశ కల్పిస్తున్నామంటూ వైకాపా ప్రభుత్వం గొప్పలకు పోయింది. నిధుల విడుదలలో తీవ్ర జాప్యం చేయడంతో గదుల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. తరగతులు ఎక్కడ నిర్వహించాలో తెలియని పరిస్థితి పలు బడుల్లో నెలకొంది. -
సర్వం సమస్యలే
[ 08-07-2024]
అధ్వాన పారిశుద్ధ్యం.. పనిచేయని ఏసీలు, సీసీ కెమెరాలు.. మరమ్మతులు చేయని లిఫ్టులు.. అందని నాణ్యమైన వైద్యం.. చెదలు నివారణకు ప్రతినెలా రూ.లక్షలు ఖర్చు చేస్తున్నా.. కలగని ప్రయోజనం.. ఇదీ జిల్లా సర్వజన ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితి. -
ఉచితం.. నిర్మాణ రంగానికి ఊతం
[ 08-07-2024]
తెదేపా ఎన్నికల హామీల అమల్లో భాగంగా ఉచిత ఇసుక విధానానికి పచ్చజెండా ఊపింది. సోమవారం నుంచి ఈ విధానం అమలు చేయనుంది. ఈ నిర్ణయంతో గత అయిదేళ్ల వైకాపా ఇసుకాసురులు చేసిన అడ్డగోలు దోపిడీకి అడ్డుకట్ట పడినట్లే. ఇసుక అందరికీ అందుబాటులో ఉండనుంది. -
పురపాలికలో అక్రమాలపై ఆరా!
[ 08-07-2024]
గత వైకాపా పాలనలో కావలి పురపాలక సంఘంలో పలు అక్రమాలు చోటుచేసుకున్నట్లు విమర్శలొచ్చాయి. రాష్ట్రంలో ఎన్నికలు జరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అక్రమాలు నిగ్గు తేల్చేందుకు తెదేపా నాయకులు ఆరా తీస్తున్నారు. -
వైకాపా నిర్లక్ష్యం.. ప్రజలకు శాపం
[ 08-07-2024]
వైకాపా ప్రభుత్వం కీలకమార్గాలపై నిర్లక్ష్యం చూపింది. అయిదేళ్లలో గుంతల్లో చారెడు మట్టిపోసిన దాఖలాలు లేవు. దీంతో అడుగుపెట్టేందుకు వీల్లేకుండా తయారయ్యాయి. పలు గ్రామాల ప్రజలు నిత్యం నరకయాతన పడుతున్నారు. -
చిరుతిండి.. రోగాలు దండి
[ 08-07-2024]
సర్వేపల్లి నియోజకవర్గంలోని ఒక సంక్షేమ వసతిగృహంలో విద్యార్థులు కలుషితమైన అహారం తీసుకోవడంతో అతిసారం బారిన పడ్డారు. సిబ్బంది అప్రమత్తమై నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యసేవలందించారు. -
అతివల జీవితాల్లో వెలుగులు
[ 08-07-2024]
మహిళా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు స్వయం సహాయక సంఘాలకు పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేసి ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా చర్యలు తీసుకుంటుంది. -
డీఎస్సీ అభ్యర్థుల సేవలో బీసీ స్టడీ సర్కిల్
[ 08-07-2024]
డీఎస్సీకి సన్నద్ధం అవుతున్న యువతకు శుభవార్త. ఇప్పటికే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు నాయుడు మొదటి సంతకం చేశారు. టెట్ నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. నెల్లూరులోని బీసీ స్టడీ సర్కిల్ ద్వారా డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. -
బంగినపల్లి అధరహో
[ 08-07-2024]
బంగినపల్లి మామిడి కాయల సీజన్ ముగిసిన తర్వాత కూడా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అక్కడక్కడ మిగిలిన కాయలను కొందరు వ్యాపారులు.. రైతుల వద్ద నుంచి దాదాపు కేజీ రూ.200 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. -
ఉద్యోగం కోసం వెళుతూ దుర్మరణం
[ 08-07-2024]
ఉద్యోగం కోసం వెళుతున్న వ్యక్తిని బస్సు రూపంలో మృత్యువు కబళించింది. ముందు వెళుతున్న స్కూటీని వేగంగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలైన ఘటన కొమ్మలపూడి అడ్డరోడ్డు సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది. -
సర్వేపల్లి జలాశయం పనుల్లో అక్రమాలు
[ 08-07-2024]
వెంకటాచలం, ముత్తుకూరు మండలాలకు సాగు, తాగునీరందించే సర్వేపల్లి జలాశయం ఆధునికీకరణ పనుల్లో భారీగా అక్రమాలు జరిగాయని జనసేన సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి నాయకులు సురేశ్ నాయుడు ఆరోపించారు.