ఇదిగో పులి.. కారిడార్ జాడేది?
టైగర్ కారిడార్ ప్రతిపాదనలకే పరిమితమైంది. నంద్యాల జిల్లా శ్రీశైలం నుంచి తిరుమల కొండల ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా.. ఆశించిన మేరకు అడుగులు పడలేదు
మర్రిపాడు అటవీ ప్రాంతంలో కెమెరాకు చిక్కిన పెద్దపులి
టైగర్ కారిడార్ ప్రతిపాదనలకే పరిమితమైంది. నంద్యాల జిల్లా శ్రీశైలం నుంచి తిరుమల కొండల ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా.. ఆశించిన మేరకు అడుగులు పడలేదు. తాజాగా మర్రిపాడు సమీప అడవుల్లో పెద్దపులి, చిరుతపులి సంచారం వెలుగు చూసిన నేపథ్యంలో కారిడార్ విషయం మరోసారి చర్చనీయాంశమైంది. అందులో భాగంగా ఉన్న శ్రీపెనుశిల నృసింహ వన్యప్రాణుల అభయారణ్యం అభివృద్ధి ఆవశ్యకత తేటతెల్లమైంది.
ఆత్మకూరు, మర్రిపాడు, న్యూస్టుడే : పెనుశిల నృసింహ అభయారణ్యంలో వన్యప్రాణుల సంరక్షణకు గతంలో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. అది ఏమైందో గానీ.. నిర్వహణ చిన్న చిన్న పనులకే పరిమితమైంది. నీటి నిల్వ గుంతలు, నేల తొట్టెలు, వేసవిలో నీటి నిల్వకు గుంతలు, రక్షణ కంచె తదితరాలు చేపట్టినా.. అవి కూడా రాపూరు రేంజికే పరిమితమయ్యాయి. వన్యప్రాణులు అడవి దాటి.. జనావాసాల్లోకి వచ్చి ప్రమాదాలకు గురికాకుండా నీటిని, మేతను ఏడాది మొత్తం వాటికి అందుబాటులో ఉంచాలన్న లక్ష్యం.. ఆత్మకూరు రేంజి పరిధిలో పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ఫలితంగా తరచూ అవి జనావాసాల్లోకి వచ్చి రోడ్డు దాటే క్రమంలో మృత్యువాత పడుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటికే.. రెండు చిరుతలు, జింకలు ఇలా ప్రాణాలు వదిలాయి. మొన్నటికి మొన్న కారు పులిని ఢీకొందన్న సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
రెండేళ్ల కిందటే పాదముద్రలు
ఆత్మకూరు అటవీరేంజిలో రెండేళ్ల కిందటే పాదముద్రలు గుర్తించగా.. నాడే టైగర్ కారిడార్ ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. నేటికీ అక్కడే నిలిచాయి. అభయారణ్యం నిర్వహణకు ఏటా రూ. 30 లక్షలు, అదీ నిర్వహణకు తప్ప.. మిగిలిన వాటికి పైసా వచ్చిన పరిస్థితి లేదు. ఇప్పుడు రెండు పులుల సంచారం వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో టైగర్ కారిడార్ను ముందుకు తీసుకువెళ్లడంతో పాటు.. ఎర్రచందనం స్మగ్లర్లు, వేటగాళ్ల నుంచి వన్య ప్రాణులను కాపాడేందుకు నిర్దుష్ట చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
ప్రతిపాదన ఉంది
శ్రీశైలం నుంచి తిరుమల వరకు టైగర్ కారిడార్ ప్రతిపాదన ఉంది. అంతకు మినహా.. నిధుల కేటాయింపు లేదు. పెనుశిల నృసింహ వన్య ప్రాణుల అభయారణ్యంలో రక్షణ పనులకు ఏటా రూ. 30 లక్షల వరకు వ్యయం చేస్తున్నాం.
- చంద్రశేఖర్, డీఎఫ్వో
గత నెల 17న కదిరినాయుడుపల్లి సమీప అటవీ ప్రాంతంలో నెల్లూరు-ముంబయి జాతీయ రహదారిపై పెద్దపులిని కారు ఢీకొట్టిందన్న వార్త తెలిసిందే. నాటి నుంచి అధికారులు దాని జాడ కనిపెట్టేందుకు 30 మంది బృందాలుగా విడిపోయి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల జంతువుల పాదముద్రలు గుర్తించినా.. అవి స్పష్టంగా లేవు. దాంతో వివిధ ప్రాంతాల్లో నిఘా నేత్రాలు ఏర్పాటు చేయగా.. నానమ్మ చెరువు దగ్గర సెలయేరులో పెద్దపులి సంచారం, మరో ప్రాంతంలో చిరుతపులి చిత్రం నిఘా కెమెరాల్లో దొరికింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పక్కెళమ్మ దేవస్థానంలో చోరీ
[ 08-07-2024]
మండల పరిధిలోని గంగవరం గ్రామంలో గ్రామదేవత శ్రీపక్కెళమ్మ దేవస్థానంలో అర్థరాత్రి చోరీ జరిగింది. -
వైకాపా వైఫల్యం చదువులకు అసౌకర్యం
[ 08-07-2024]
నాడు- నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలకు మహర్దశ కల్పిస్తున్నామంటూ వైకాపా ప్రభుత్వం గొప్పలకు పోయింది. నిధుల విడుదలలో తీవ్ర జాప్యం చేయడంతో గదుల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. తరగతులు ఎక్కడ నిర్వహించాలో తెలియని పరిస్థితి పలు బడుల్లో నెలకొంది. -
సర్వం సమస్యలే
[ 08-07-2024]
అధ్వాన పారిశుద్ధ్యం.. పనిచేయని ఏసీలు, సీసీ కెమెరాలు.. మరమ్మతులు చేయని లిఫ్టులు.. అందని నాణ్యమైన వైద్యం.. చెదలు నివారణకు ప్రతినెలా రూ.లక్షలు ఖర్చు చేస్తున్నా.. కలగని ప్రయోజనం.. ఇదీ జిల్లా సర్వజన ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితి. -
ఉచితం.. నిర్మాణ రంగానికి ఊతం
[ 08-07-2024]
తెదేపా ఎన్నికల హామీల అమల్లో భాగంగా ఉచిత ఇసుక విధానానికి పచ్చజెండా ఊపింది. సోమవారం నుంచి ఈ విధానం అమలు చేయనుంది. ఈ నిర్ణయంతో గత అయిదేళ్ల వైకాపా ఇసుకాసురులు చేసిన అడ్డగోలు దోపిడీకి అడ్డుకట్ట పడినట్లే. ఇసుక అందరికీ అందుబాటులో ఉండనుంది. -
పురపాలికలో అక్రమాలపై ఆరా!
[ 08-07-2024]
గత వైకాపా పాలనలో కావలి పురపాలక సంఘంలో పలు అక్రమాలు చోటుచేసుకున్నట్లు విమర్శలొచ్చాయి. రాష్ట్రంలో ఎన్నికలు జరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అక్రమాలు నిగ్గు తేల్చేందుకు తెదేపా నాయకులు ఆరా తీస్తున్నారు. -
వైకాపా నిర్లక్ష్యం.. ప్రజలకు శాపం
[ 08-07-2024]
వైకాపా ప్రభుత్వం కీలకమార్గాలపై నిర్లక్ష్యం చూపింది. అయిదేళ్లలో గుంతల్లో చారెడు మట్టిపోసిన దాఖలాలు లేవు. దీంతో అడుగుపెట్టేందుకు వీల్లేకుండా తయారయ్యాయి. పలు గ్రామాల ప్రజలు నిత్యం నరకయాతన పడుతున్నారు. -
చిరుతిండి.. రోగాలు దండి
[ 08-07-2024]
సర్వేపల్లి నియోజకవర్గంలోని ఒక సంక్షేమ వసతిగృహంలో విద్యార్థులు కలుషితమైన అహారం తీసుకోవడంతో అతిసారం బారిన పడ్డారు. సిబ్బంది అప్రమత్తమై నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యసేవలందించారు. -
అతివల జీవితాల్లో వెలుగులు
[ 08-07-2024]
మహిళా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు స్వయం సహాయక సంఘాలకు పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేసి ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా చర్యలు తీసుకుంటుంది. -
డీఎస్సీ అభ్యర్థుల సేవలో బీసీ స్టడీ సర్కిల్
[ 08-07-2024]
డీఎస్సీకి సన్నద్ధం అవుతున్న యువతకు శుభవార్త. ఇప్పటికే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు నాయుడు మొదటి సంతకం చేశారు. టెట్ నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. నెల్లూరులోని బీసీ స్టడీ సర్కిల్ ద్వారా డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. -
బంగినపల్లి అధరహో
[ 08-07-2024]
బంగినపల్లి మామిడి కాయల సీజన్ ముగిసిన తర్వాత కూడా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అక్కడక్కడ మిగిలిన కాయలను కొందరు వ్యాపారులు.. రైతుల వద్ద నుంచి దాదాపు కేజీ రూ.200 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. -
ఉద్యోగం కోసం వెళుతూ దుర్మరణం
[ 08-07-2024]
ఉద్యోగం కోసం వెళుతున్న వ్యక్తిని బస్సు రూపంలో మృత్యువు కబళించింది. ముందు వెళుతున్న స్కూటీని వేగంగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలైన ఘటన కొమ్మలపూడి అడ్డరోడ్డు సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది. -
సర్వేపల్లి జలాశయం పనుల్లో అక్రమాలు
[ 08-07-2024]
వెంకటాచలం, ముత్తుకూరు మండలాలకు సాగు, తాగునీరందించే సర్వేపల్లి జలాశయం ఆధునికీకరణ పనుల్లో భారీగా అక్రమాలు జరిగాయని జనసేన సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి నాయకులు సురేశ్ నాయుడు ఆరోపించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రష్యా చేరుకున్న ప్రధాని మోదీ.. మాస్కోలో సాదర స్వాగతం
-
ఎంపీ విందులో ఉచితంగా ‘మద్యం’.. ఎగబడిన జనం!
-
బాంబులతో దద్దరిల్లిన గాజా నగరం.. దేవుడా మాకు దిక్కెవరు?
-
‘గేమ్ ఛేంజర్’ ఈ ఏడాది విడుదలవుతుందా?
-
‘వాళ్లందరినీ తీసేయ్’.. స్టీవ్జాబ్స్ చెప్పిన సలహా ఇదే: స్టార్బక్స్ మాజీ సీఈఓ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM