నిర్లక్ష్యానికి.. ఏదీ ‘మాత్ర’?
సకాలంలో, సక్రమంగా వినియోగిస్తే రోగుల పాలిట సంజీవినులయ్యే పలు ఔషధాలు.. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఏళ్లుగా ఆసుపత్రుల గదుల్లోనే మగ్గి కాలం చెల్లిపోతుండగా- ఆ విషయం ఎక్కడ బయటపడుతుందోనని గుట్టుగా కాల్చేస్తున్నారనే విమర్శలు నెలకొన్నాయి
డీఎంహెచ్వో కార్యాలయంలో చెదలుపట్టి కాలం చెల్లిన మందులు
సకాలంలో, సక్రమంగా వినియోగిస్తే రోగుల పాలిట సంజీవినులయ్యే పలు ఔషధాలు.. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఏళ్లుగా ఆసుపత్రుల గదుల్లోనే మగ్గి కాలం చెల్లిపోతుండగా- ఆ విషయం ఎక్కడ బయటపడుతుందోనని గుట్టుగా కాల్చేస్తున్నారనే విమర్శలు నెలకొన్నాయి. రూ. లక్షల విలువ చేసే మందులు ఇలా నిరుపయోగంగా మారుతుండటంపై రోగులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
న్యూస్టుడే, నెల్లూరు(స్టోన్హౌస్పేట): జిల్లాలో 61 పీహెచ్సీ, 28 యూపీహెచ్సీ, 497 హెల్త్ క్లినిక్లు ఉండగా- అక్కడికి వచ్చే వారి వ్యాధుల నివారణలో భాగంగా 172 రకాలు, హెల్త్ క్ల్లినిక్ల్లో 67 రకాల మందులు అందిస్తుంటారు. ఆరోగ్య కేంద్రాల్లో అవసరం మేరకు వైద్యాధికారుల సూచన మేరకు ఇతర మందులు తీసుకుంటూ ఉంటారు. రోగులకు అవసరమయ్యే మందులు, శస్త్రచికిత్సల్లో వినియోగించే వస్తువులు వైద్యాధికారుల ఇండెంట్ ప్రకారం సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి వస్తుంటాయి. ఒక్కో పీహెచ్సీకి.. మూడు నెలల చొప్పున నాలుగు విడతలుగా వస్తాయి.
వినియోగంపై దృష్టేదీ?
పీహెచ్సీ పరిధిలో జనాభా.. ఆసుపత్రిలో మందుల వాడకం.. వైద్యాధికారుల ఇండెంట్ ప్రకారం ఒక్కో ఆసుపత్రికి ఏటా రూ. 50 వేల నుంచి రూ. 3 లక్షల విలువ చేసే ఔషధాలు వస్తుంటాయి. ఇలా పీహెచ్సీలకే ఏటా రూ. కోటికిపైగా విలువైనవి వస్తాయి. జాతీయ కార్యక్రమాలు, హెల్త్ సెంటర్లకు వచ్చేవి కలిపితే మరో రూ. కోటి వరకు ఉంటుందని అంచనా. వీటిల్లో కొంత మేర వృథా అవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. పీహెచ్సీలో ఏదైనా రకం మందుల వాడకం తగ్గిపోతే.. వాటిని అవసరమైన మరో చోటికి తరలించాల్సి ఉంది. ఇలా సమన్వయంతో పూర్తిగా ఉపయోగపడేలా చూడాలి. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. వైద్య సేవలు మొక్కుబడిగా ఉండటం, ఆ కారణంగా వచ్చే రోగుల సంఖ్య తక్కువగా ఉండటంతో.. వినియోగం పెద్దగా ఉండటం లేదు. దీంతో పెద్ద సంఖ్యలోనే కాలం చెల్లి వృథాగా పోతున్నాయని సమాచారం. అలాంటి వాటిని వ్యర్థాలు, వృథా వస్తువులను కాల్చే వరల్లో వేసి గుట్టుచప్పుడు కాకుండా తగలబెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. అలాంటి వాటిలో వినియోగానికి పనికొచ్చేవి ఉంటుండటం గమనార్హం. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వెనుక బూడిదలో మందులు కనిపించగా.. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆసుపత్రి ప్రాంగణంలో కాలం చెల్లిన మందులు దర్శనమిచ్చాయి. సర్వేపల్లి నియోజకవర్గంలోనూ పలు ప్రాంతాల్లో కాల్చిన సంఘటనలు ఉన్నాయి. నెల్లూరు డీఎంహెచ్వో కార్యాలయంలో చెదలు పట్టి కాలం చెల్లినవి ఉన్నాయి. జిల్లాలోని సగానికిపైగా పీహెచ్సీల్లో ఇదే పరిస్థితి ఉండగా.. ఔషధాల వినియోగంపై ఉన్నతాధికారుల తనిఖీలు, చర్యలు ఉండటం లేదనే విమర్శలు ఉన్నాయి.
తనిఖీలు చేస్తాం
జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయం వెనుక అట్టపెట్టెలు పడి ఉన్నాయి. వాటిని దహనం చేస్తూ ఉంటారు. మందులు వినియోగించకున్నా, కాలం చెల్లిన పేరుతో కాల్చినా.. చర్యలు తప్పవు. ఔషధాల వినియోగంపై తనిఖీలు చేస్తాం.
- ఎం.పెంచలయ్య, డీఎంహెచ్వో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైఫల్యం చదువులకు అసౌకర్యం
[ 08-07-2024]
నాడు- నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలకు మహర్దశ కల్పిస్తున్నామంటూ వైకాపా ప్రభుత్వం గొప్పలకు పోయింది. నిధుల విడుదలలో తీవ్ర జాప్యం చేయడంతో గదుల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. తరగతులు ఎక్కడ నిర్వహించాలో తెలియని పరిస్థితి పలు బడుల్లో నెలకొంది. -
సర్వం సమస్యలే
[ 08-07-2024]
అధ్వాన పారిశుద్ధ్యం.. పనిచేయని ఏసీలు, సీసీ కెమెరాలు.. మరమ్మతులు చేయని లిఫ్టులు.. అందని నాణ్యమైన వైద్యం.. చెదలు నివారణకు ప్రతినెలా రూ.లక్షలు ఖర్చు చేస్తున్నా.. కలగని ప్రయోజనం.. ఇదీ జిల్లా సర్వజన ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితి. -
ఉచితం.. నిర్మాణ రంగానికి ఊతం
[ 08-07-2024]
తెదేపా ఎన్నికల హామీల అమల్లో భాగంగా ఉచిత ఇసుక విధానానికి పచ్చజెండా ఊపింది. సోమవారం నుంచి ఈ విధానం అమలు చేయనుంది. ఈ నిర్ణయంతో గత అయిదేళ్ల వైకాపా ఇసుకాసురులు చేసిన అడ్డగోలు దోపిడీకి అడ్డుకట్ట పడినట్లే. ఇసుక అందరికీ అందుబాటులో ఉండనుంది. -
పురపాలికలో అక్రమాలపై ఆరా!
[ 08-07-2024]
గత వైకాపా పాలనలో కావలి పురపాలక సంఘంలో పలు అక్రమాలు చోటుచేసుకున్నట్లు విమర్శలొచ్చాయి. రాష్ట్రంలో ఎన్నికలు జరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అక్రమాలు నిగ్గు తేల్చేందుకు తెదేపా నాయకులు ఆరా తీస్తున్నారు. -
వైకాపా నిర్లక్ష్యం.. ప్రజలకు శాపం
[ 08-07-2024]
వైకాపా ప్రభుత్వం కీలకమార్గాలపై నిర్లక్ష్యం చూపింది. అయిదేళ్లలో గుంతల్లో చారెడు మట్టిపోసిన దాఖలాలు లేవు. దీంతో అడుగుపెట్టేందుకు వీల్లేకుండా తయారయ్యాయి. పలు గ్రామాల ప్రజలు నిత్యం నరకయాతన పడుతున్నారు. -
చిరుతిండి.. రోగాలు దండి
[ 08-07-2024]
సర్వేపల్లి నియోజకవర్గంలోని ఒక సంక్షేమ వసతిగృహంలో విద్యార్థులు కలుషితమైన అహారం తీసుకోవడంతో అతిసారం బారిన పడ్డారు. సిబ్బంది అప్రమత్తమై నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యసేవలందించారు. -
అతివల జీవితాల్లో వెలుగులు
[ 08-07-2024]
మహిళా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు స్వయం సహాయక సంఘాలకు పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేసి ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా చర్యలు తీసుకుంటుంది. -
డీఎస్సీ అభ్యర్థుల సేవలో బీసీ స్టడీ సర్కిల్
[ 08-07-2024]
డీఎస్సీకి సన్నద్ధం అవుతున్న యువతకు శుభవార్త. ఇప్పటికే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు నాయుడు మొదటి సంతకం చేశారు. టెట్ నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. నెల్లూరులోని బీసీ స్టడీ సర్కిల్ ద్వారా డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. -
బంగినపల్లి అధరహో
[ 08-07-2024]
బంగినపల్లి మామిడి కాయల సీజన్ ముగిసిన తర్వాత కూడా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అక్కడక్కడ మిగిలిన కాయలను కొందరు వ్యాపారులు.. రైతుల వద్ద నుంచి దాదాపు కేజీ రూ.200 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. -
ఉద్యోగం కోసం వెళుతూ దుర్మరణం
[ 08-07-2024]
ఉద్యోగం కోసం వెళుతున్న వ్యక్తిని బస్సు రూపంలో మృత్యువు కబళించింది. ముందు వెళుతున్న స్కూటీని వేగంగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలైన ఘటన కొమ్మలపూడి అడ్డరోడ్డు సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది. -
సర్వేపల్లి జలాశయం పనుల్లో అక్రమాలు
[ 08-07-2024]
వెంకటాచలం, ముత్తుకూరు మండలాలకు సాగు, తాగునీరందించే సర్వేపల్లి జలాశయం ఆధునికీకరణ పనుల్లో భారీగా అక్రమాలు జరిగాయని జనసేన సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి నాయకులు సురేశ్ నాయుడు ఆరోపించారు.