నీట్ ఫలితాలపై సమగ్ర విచారణ జరిపించాలి
నీట్ ఫలితాలపై అనుమానాలు ఉన్నాయని, వాటిపై సమగ్ర విచారణ జరిపించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ మస్తాన్ షరీఫ్ డిమాండ్ చేశారు
వీఆర్సీ కూడలిలో రాస్తారోకో చేస్తున్న విద్యార్థి సంఘాల ఐక్యవేదిక నాయకులు
నెల్లూరు(విద్య), న్యూస్టుడే: నీట్ ఫలితాలపై అనుమానాలు ఉన్నాయని, వాటిపై సమగ్ర విచారణ జరిపించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ మస్తాన్ షరీఫ్ డిమాండ్ చేశారు. గురువారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుట్రతో పేపర్ లీక్ చేస్తే, విచారణ జరిపించాల్సిన కేంద్ర ప్రభుత్వం మిన్నకుండి పోవడం దారుణమన్నారు. ముందుగా ఆయా విద్యా సంస్థల వద్ద విద్యార్థి సంఘాల నాయకులు నిరసన తెలిపారు. అనంతరం వీఆర్సీ కూడలిలో రాస్తారోకో చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి హర్ష, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు సునీల్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వీవీఎస్ చైతన్య, నరేంద్ర, నగర అధ్యక్షుడు శివమ్వర్మ, పీడీఎస్యూ గ్రామీణ అధ్యక్షుడు షారుఖ్, అక్షయ్, ఆకాష్, శరణ్, సాయి, ప్రతాప్, అల్తాఫ్, అబ్దుల్, చరణ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైఫల్యం చదువులకు అసౌకర్యం
[ 08-07-2024]
నాడు- నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలకు మహర్దశ కల్పిస్తున్నామంటూ వైకాపా ప్రభుత్వం గొప్పలకు పోయింది. నిధుల విడుదలలో తీవ్ర జాప్యం చేయడంతో గదుల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. తరగతులు ఎక్కడ నిర్వహించాలో తెలియని పరిస్థితి పలు బడుల్లో నెలకొంది. -
సర్వం సమస్యలే
[ 08-07-2024]
అధ్వాన పారిశుద్ధ్యం.. పనిచేయని ఏసీలు, సీసీ కెమెరాలు.. మరమ్మతులు చేయని లిఫ్టులు.. అందని నాణ్యమైన వైద్యం.. చెదలు నివారణకు ప్రతినెలా రూ.లక్షలు ఖర్చు చేస్తున్నా.. కలగని ప్రయోజనం.. ఇదీ జిల్లా సర్వజన ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితి. -
ఉచితం.. నిర్మాణ రంగానికి ఊతం
[ 08-07-2024]
తెదేపా ఎన్నికల హామీల అమల్లో భాగంగా ఉచిత ఇసుక విధానానికి పచ్చజెండా ఊపింది. సోమవారం నుంచి ఈ విధానం అమలు చేయనుంది. ఈ నిర్ణయంతో గత అయిదేళ్ల వైకాపా ఇసుకాసురులు చేసిన అడ్డగోలు దోపిడీకి అడ్డుకట్ట పడినట్లే. ఇసుక అందరికీ అందుబాటులో ఉండనుంది. -
పురపాలికలో అక్రమాలపై ఆరా!
[ 08-07-2024]
గత వైకాపా పాలనలో కావలి పురపాలక సంఘంలో పలు అక్రమాలు చోటుచేసుకున్నట్లు విమర్శలొచ్చాయి. రాష్ట్రంలో ఎన్నికలు జరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అక్రమాలు నిగ్గు తేల్చేందుకు తెదేపా నాయకులు ఆరా తీస్తున్నారు. -
వైకాపా నిర్లక్ష్యం.. ప్రజలకు శాపం
[ 08-07-2024]
వైకాపా ప్రభుత్వం కీలకమార్గాలపై నిర్లక్ష్యం చూపింది. అయిదేళ్లలో గుంతల్లో చారెడు మట్టిపోసిన దాఖలాలు లేవు. దీంతో అడుగుపెట్టేందుకు వీల్లేకుండా తయారయ్యాయి. పలు గ్రామాల ప్రజలు నిత్యం నరకయాతన పడుతున్నారు. -
చిరుతిండి.. రోగాలు దండి
[ 08-07-2024]
సర్వేపల్లి నియోజకవర్గంలోని ఒక సంక్షేమ వసతిగృహంలో విద్యార్థులు కలుషితమైన అహారం తీసుకోవడంతో అతిసారం బారిన పడ్డారు. సిబ్బంది అప్రమత్తమై నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యసేవలందించారు. -
అతివల జీవితాల్లో వెలుగులు
[ 08-07-2024]
మహిళా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు స్వయం సహాయక సంఘాలకు పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేసి ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా చర్యలు తీసుకుంటుంది. -
డీఎస్సీ అభ్యర్థుల సేవలో బీసీ స్టడీ సర్కిల్
[ 08-07-2024]
డీఎస్సీకి సన్నద్ధం అవుతున్న యువతకు శుభవార్త. ఇప్పటికే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు నాయుడు మొదటి సంతకం చేశారు. టెట్ నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. నెల్లూరులోని బీసీ స్టడీ సర్కిల్ ద్వారా డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. -
బంగినపల్లి అధరహో
[ 08-07-2024]
బంగినపల్లి మామిడి కాయల సీజన్ ముగిసిన తర్వాత కూడా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అక్కడక్కడ మిగిలిన కాయలను కొందరు వ్యాపారులు.. రైతుల వద్ద నుంచి దాదాపు కేజీ రూ.200 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. -
ఉద్యోగం కోసం వెళుతూ దుర్మరణం
[ 08-07-2024]
ఉద్యోగం కోసం వెళుతున్న వ్యక్తిని బస్సు రూపంలో మృత్యువు కబళించింది. ముందు వెళుతున్న స్కూటీని వేగంగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలైన ఘటన కొమ్మలపూడి అడ్డరోడ్డు సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది. -
సర్వేపల్లి జలాశయం పనుల్లో అక్రమాలు
[ 08-07-2024]
వెంకటాచలం, ముత్తుకూరు మండలాలకు సాగు, తాగునీరందించే సర్వేపల్లి జలాశయం ఆధునికీకరణ పనుల్లో భారీగా అక్రమాలు జరిగాయని జనసేన సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి నాయకులు సురేశ్ నాయుడు ఆరోపించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,294
-
పొలాల్లో, బీడు భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు
-
బాలీవుడ్ నటితో పెళ్లి.. స్పందించిన కుల్దీప్ యాదవ్
-
కమల్ హాసన్ వాయిస్ను ఇమిటేట్ చేసిన బ్రహ్మానందం.. వీడియో వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ప్రీమియం ఎకానమీ సీట్లతో ఎయిరిండియా కొత్త విమానం