జోరుగా బేరాలు.. పట్టాల అమ్మకాలు!
అయిదేళ్ల పాలనలో వైకాపా నాయకులు దోచుకోవడం.. దాచుకోవడమే పరమావధిగా రెచ్చిపోయారు. కన్నుపడిన స్థలాలు తక్షణం తమ అధీనంలోకి వెళ్లిపోవాలన్నట్లు వ్యవహరించారు. దేవాదాయశాఖ అధికారులు తమ భూమిగా పేర్కొంటూ..
వెంకటాచలం మండలంలో వైకాపా భూదందా
అయిదేళ్ల పాలనలో వైకాపా నాయకులు దోచుకోవడం.. దాచుకోవడమే పరమావధిగా రెచ్చిపోయారు. కన్నుపడిన స్థలాలు తక్షణం తమ అధీనంలోకి వెళ్లిపోవాలన్నట్లు వ్యవహరించారు. దేవాదాయశాఖ అధికారులు తమ భూమిగా పేర్కొంటూ.. పెట్టిన బోర్డులు సైతం పెకలించి మరీ ఆక్రమణలకు పాల్పడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వం మారినా.. వారి ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. జగనన్న కాలనీల పేరుతో గతంలో వేసిన లేఅవుట్లలోని ప్లాట్లనూ కాజేస్తున్నారు. ఓ వైపు ఇతర ప్రాంతాల వ్యక్తులకు విక్రయించడంతో పాటు సొంత పార్టీ నాయకులకు పంపిణీ చేస్తున్నారు. తాజాగా ఆ పత్రాలు చెల్లవని రెవెన్యూ అధికారులు చెప్పడంతో.. వాటిని ఇచ్చిన వారిని దూషిస్తూ.. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం గమనార్హం.
ఈనాడు, నెల్లూరు
వెంకటాచలం పరిధిలో.. జాతీయ రహదారి పక్కనున్న దేవాదాయ భూమిలో జగనన్న కాలనీ ఏర్పాటు చేయగా- వైకాపా నాయకులు దాంతో పాటు దాని పక్కనున్న ప్రాంతాలకు దొంగ పట్టాలు సృష్టించి.. ఎన్నికల తర్వాత పంపిణీ చేశారు. రెండు రోజుల కిందట ఓ ప్రధాన వైకాపా నాయకుడు పలువురికి పట్టాలు అందించగా.. అసలు విషయం తెలిసి.. ఇంటి స్థలాలు ఇస్తామని ఎన్నికల సమయంలో తమ వెంట తిప్పుకొని.. మోసం చేశారని వాపోతున్నారు. సదరు నాయకుడు ఇచ్చిన పట్టాలు తీసుకుని రెవెన్యూ అధికారులను కలిస్తే.. అసలు మీకు ప్లాట్లు ఎక్కడిచ్చారు? ఇందులో తహసీల్దారు సంతకం ఫోర్జరీ అని చెప్పడంతో నిర్ఘాంతపోయారు. ఆ క్రమంలోనే వెంకటాచలానికి చెందిన అంకయ్య అనే యువకుడు సదరు పట్టాను చించి వేయగా.. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
జగనన్న కాలనీని 2022లో ఏర్పాటు చేశారు. తొలుత 7.30 ఎకరాల విస్తీర్ణంలో వేసిన లేఅవుట్లో మంత్రి చేతుల మీదుగా స్థానికులకు 9 అంకణాల చొప్పున 185 మందికి పట్టాలు పంపిణీ చేశారు. కొన్ని రోజుల తర్వాత కాలనీకి పక్కనే ఉన్న అయిదెకరాల దేవాదాయ స్థలంలో వైకాపా నాయకులు మరో అనధికారిక లేఅవుట్ వేశారు. రెండు లేఅవుట్లలో మొత్తం 600 ప్లాట్లు ఉండగా- దాదాపు 300 విక్రయించారనే ఆరోపణలు ఉన్నాయి. మిగిలినవి వైకాపా సానుభూతిపరులు, నాయకుల బంధువులకు ఇచ్చారు. రెండు రోజుల కిందట కూడా వెంకటాచలంలోని కొందరి ఇళ్లకు ‘నివేశన స్థలం అప్పగింత పత్రం’ పేరుతో 2022లో అప్పటి తహసీల్దారు సంతకం చేసినట్లు ఇచ్చిన పట్టాలు పంపిణీ చేయడం సదరు నాయకుల బరితెగింపునకు నిదర్శనం కాగా.. విక్రయాలు జరిపిన, వైకాపా సానుభూతిపరులు, నాయకుల బంధువులకు ఇచ్చిన వాటిపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
దేవాదాయ భూమిలో దోపిడీ
సీతన్న చలివేంద్రం పేరుతో ఇక్కడ సుమారు 300 ఎకరాలకు పైగా భూములు ఉండగా- వాటిని అనాదిగా కొందరు సాగు చేసుకునేవారు. వారిలో కొందరు మరో అడుగు ముందుకేసి.. 1985-90 మధ్య లేఅవుట్లు వేసి.. విక్రయించారు. దానిపై కొందరు కోర్టుకు వెళ్లడంతో.. ఆ భూమి దేవాదాయశాఖకు చెందిందేనని 2008-09లో తీర్పు వచ్చింది. అధికారులు అక్రమ నిర్మాణాలు తొలగించారు. రికార్డుల్లో సాగుదారులుగా ఉన్న రైతుల పేర్లు తొలగించారు. వైకాపా అధికారంలోకి రాగానే.. దానిపై కన్నేశారు. అందులో జగనన్న కాలనీ ఏర్పాటు చేశారు. ఆక్రమణదారులు మళ్లీ భూముల్లోకి ప్రవేశించారు. కొద్దికొద్దిగా ఆక్రమిస్తూ.. నిర్మాణాలు ప్రారంభించారు. గతంలో పని చేసిన రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై రికార్డుల్లో అనుభవదారుడి పేర్లను మార్చుకున్నారు. పైగా తమకు వారసత్వంగా వచ్చినట్లు నమోదు చేయించుకున్నారు.
అధికారులే విస్తుబోయేలా..
నకిలీ పట్టాల విషయం వెలుగు చూడటంతో రెవెన్యూ అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 2022లో పనిచేసిన తహసీల్దారు ప్రసాద్ సంతకం ఉన్న పత్రాలు.. ఇప్పుడెందుకు పంపిణీ చేస్తున్నారనే విషయం తెలియక తల పట్టుకుంటున్నారు. ఆ స్థలాలు కొనుగోలు చేసిన వారు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేయగా.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో రూ. కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దీనిపై తహసీల్దారు పూర్ణచంద్రరావు వివరణ కోరగా.. జగనన్న కాలనీలో స్థలాలను విక్రయించడంతో పాటు.. కొత్తగా పట్టాలు పంపిణీ చేయడంపై ఫిర్యాదు అందింది. దీనిపై విచారణ చేస్తున్నాం. విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి.. తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గురుకులంపై ఆశ.. సీట్లు లేక నిరాశ
[ 05-07-2024]
జిల్లాలోని గురుకులాల్లో చదువుకోవాలనే ఆసక్తితో పేద విద్యార్థులు వందల సంఖ్యలో సీట్ల కోసం ప్రయత్నిస్తున్నారు -
ప్రభుత్వ పాఠశాలలే లక్ష్యంగా దొంగతనాలు
[ 05-07-2024]
ప్రభుత్వ పాఠశాలలే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. -
యువత.. క్రీడల్లో ఘనత
[ 05-07-2024]
పట్టణంలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పీజీ కళాశాలలో చదువుతున్న వారు క్రీడల్లో ప్రతిభ చూపుతున్నారు. పేద కుటుంబాలకు చెందిన వారు. -
ఖాతాదారుల ఆర్డీ నగదు రూ.10 లక్షలు స్వాహా
[ 05-07-2024]
మండలంలోని పుల్లాయపల్లి బ్రాంచి ఫోస్టాఫీసులో ఖాతాదారులు దాచుకున్న సుమారు రూ. 10 లక్షల ఆర్డీ నగదు పోస్టుమాస్టర్ షేక్ నాయబ్ రసూల్ స్వాహా చేసి పరారయ్యారు. ఈవిషయం గురువారం వెలుగులోకి వచ్చింది -
అనుమతి.. మాకెందుకది!
[ 05-07-2024]
కాస్త పెట్టుబడి.. కొంత పరిచయాలు ఉంటే చాలు.. అనతికాలంలోనే రూ. కోట్లకు పడగలెత్తవచ్చనే ఆలోచనతో వైకాపా నాయకులు రెచ్చిపోయారు. -
ఇదిగో పులి.. కారిడార్ జాడేది?
[ 05-07-2024]
టైగర్ కారిడార్ ప్రతిపాదనలకే పరిమితమైంది. నంద్యాల జిల్లా శ్రీశైలం నుంచి తిరుమల కొండల ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా.. ఆశించిన మేరకు అడుగులు పడలేదు -
నిర్లక్ష్యానికి.. ఏదీ ‘మాత్ర’?
[ 05-07-2024]
సకాలంలో, సక్రమంగా వినియోగిస్తే రోగుల పాలిట సంజీవినులయ్యే పలు ఔషధాలు.. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఏళ్లుగా ఆసుపత్రుల గదుల్లోనే మగ్గి కాలం చెల్లిపోతుండగా- ఆ విషయం ఎక్కడ బయటపడుతుందోనని గుట్టుగా కాల్చేస్తున్నారనే విమర్శలు నెలకొన్నాయి -
భూములిస్తే.. పరిహాసమా!
[ 05-07-2024]
పరిహారం అందకపోవడంపై ఆవేదనజిల్లాల అశాస్త్రీయ పునర్విభజన సమస్య కందుకూరును వెంటాడుతూనే ఉంది. -
నీట్ ఫలితాలపై సమగ్ర విచారణ జరిపించాలి
[ 05-07-2024]
నీట్ ఫలితాలపై అనుమానాలు ఉన్నాయని, వాటిపై సమగ్ర విచారణ జరిపించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ మస్తాన్ షరీఫ్ డిమాండ్ చేశారు
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలు పుట్టలేదని వివాహిత ఆత్మహత్య
-
అసలు కథ ముందుంది.. ‘కల్కి’ సీక్వెల్పై స్పందించిన నాగ్ అశ్విన్
-
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు భంగపాటు.. అధికారం దిశగా లేబర్ పార్టీ
-
ద్వారంపూడి వారి కాలుష్య పరిశ్రమ
-
వైకాపా విధేయుల్లో వణుకు.. అంటకాగిన అధికారులపై కూటమి ప్రభుత్వం ఆరా
-
అనుమతి లేకున్నా ఉన్నట్లు చూపి ప్లాట్ల విక్రయం.. కాకాణి సొంతూరిలో భారీ మోసం