logo

బస్సులో రూ.80 లక్షల చోరీ

బస్సులో ప్రయాణిస్తున్న వ్యాపారుల దగ్గర రూ.80 లక్షల నగదును దొంగలు అపహరించారు. సోమవారం రాత్రి మద్దూరుపాడు వద్దనున్న ఓ దాబా సమీపంలో ఆగి ఉన్న బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది.

Published : 03 Jul 2024 02:59 IST

కావలి : బస్సులో ప్రయాణిస్తున్న వ్యాపారుల దగ్గర రూ.80 లక్షల నగదును దొంగలు అపహరించారు. సోమవారం రాత్రి మద్దూరుపాడు వద్దనున్న ఓ దాబా సమీపంలో ఆగి ఉన్న బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. విజయవాడ నుంచి బెంగళూరు వైపు వెళుతున్న బస్సులో ఇద్దరు వ్యాపారులు ఉన్నారు. భోజనం చేసేందుకు మద్దూరుపాడులో ఆపారు. ఈ సమయంలో ఒకరు దాబాలో తిని సహచరుడికి పార్సిల్‌ తెచ్చేందుకు వెళ్లారు. బస్సులో వారితో వచ్చిన అగంతుకులు సదరు వ్యాపారికి మత్తు మందు పెట్టి స్పృహ కోల్పోయేలా చేశారు. అతని వద్ద ఉన్న సంచి తీసుకుని రహదారికి అవతల వైపు వెళ్లి మరో వాహనంలో పరారయ్యారు. పోలీసులకు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని