అనర్హులకు మత్స్యకార భరోసా
వేట విరామ సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం ఇచ్చే మత్స్యకార భరోసాలో అనర్హులు పాగా వేశారు. దీని కింద ప్రభుత్వం రూ. పదివేలు ఇచ్చి ఆదుకుంటుండగా- సదరు జాబితాలో కొందరు వైకాపా నాయకులు మత్స్య వేట తెలియని వారి పేర్లు నమోదు చేయించారు.
వైకాపా నాయకుల నిర్వాకం
ఇందుకూరుపేట, న్యూస్టుడే: వేట విరామ సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం ఇచ్చే మత్స్యకార భరోసాలో అనర్హులు పాగా వేశారు. దీని కింద ప్రభుత్వం రూ. పదివేలు ఇచ్చి ఆదుకుంటుండగా- సదరు జాబితాలో కొందరు వైకాపా నాయకులు మత్స్య వేట తెలియని వారి పేర్లు నమోదు చేయించారు. మండలంలోని కుడితిపాళెంలో ఈ విషయం వెలుగు చూసింది. ఏప్రిల్ నెలలో వైఎస్సార్ మత్స్యకార భరోసాకు అర్హులైన వారి పేర్లు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అదే అదనుగా వైకాపా నాయకులు 221 మంది పేర్లతో జాబితా పంపించారు. అందులో అనేక మంది వేట తెలియని.. ఇతర సామాజికవర్గీయులు ఉన్నట్లు వెలుగు చూసింది. దీనిపై స్థానిక తెదేపా నాయకులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై గ్రామ సచివాలయ మత్స్యశాఖ సహాయకురాలు దీక్షితను వివరణ కోరగా.. అనర్హుల పేర్లు ఎలా నమోదు చేశారని ప్రశ్నించగా.. నాయకుల ఒత్తిళ్ల మేరకే చేశామని, వాటిని తొలగించాలని ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలిపారు. అనర్హులందరూ వైకాపా కార్యకర్తలే కావడం గమనార్హం. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి.. అర్హులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ పట్టివేత
[ 05-07-2024]
ఇసుక మాఫియాపై కోవూరు పోలీసులు కొరడా ఝులిపించారు. వరుసగా రెండు రోజులు తనిఖీలు చేసిన ఇసుక ట్రాక్టర్, టిప్పర్ను స్వాధీనం చేసుకున్నారు. -
గురుకులంపై ఆశ.. సీట్లు లేక నిరాశ
[ 05-07-2024]
జిల్లాలోని గురుకులాల్లో చదువుకోవాలనే ఆసక్తితో పేద విద్యార్థులు వందల సంఖ్యలో సీట్ల కోసం ప్రయత్నిస్తున్నారు -
ప్రభుత్వ పాఠశాలలే లక్ష్యంగా దొంగతనాలు
[ 05-07-2024]
ప్రభుత్వ పాఠశాలలే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. -
యువత.. క్రీడల్లో ఘనత
[ 05-07-2024]
పట్టణంలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పీజీ కళాశాలలో చదువుతున్న వారు క్రీడల్లో ప్రతిభ చూపుతున్నారు. పేద కుటుంబాలకు చెందిన వారు. -
ఖాతాదారుల ఆర్డీ నగదు రూ.10 లక్షలు స్వాహా
[ 05-07-2024]
మండలంలోని పుల్లాయపల్లి బ్రాంచి ఫోస్టాఫీసులో ఖాతాదారులు దాచుకున్న సుమారు రూ. 10 లక్షల ఆర్డీ నగదు పోస్టుమాస్టర్ షేక్ నాయబ్ రసూల్ స్వాహా చేసి పరారయ్యారు. ఈవిషయం గురువారం వెలుగులోకి వచ్చింది -
అనుమతి.. మాకెందుకది!
[ 05-07-2024]
కాస్త పెట్టుబడి.. కొంత పరిచయాలు ఉంటే చాలు.. అనతికాలంలోనే రూ. కోట్లకు పడగలెత్తవచ్చనే ఆలోచనతో వైకాపా నాయకులు రెచ్చిపోయారు. -
ఇదిగో పులి.. కారిడార్ జాడేది?
[ 05-07-2024]
టైగర్ కారిడార్ ప్రతిపాదనలకే పరిమితమైంది. నంద్యాల జిల్లా శ్రీశైలం నుంచి తిరుమల కొండల ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా.. ఆశించిన మేరకు అడుగులు పడలేదు -
నిర్లక్ష్యానికి.. ఏదీ ‘మాత్ర’?
[ 05-07-2024]
సకాలంలో, సక్రమంగా వినియోగిస్తే రోగుల పాలిట సంజీవినులయ్యే పలు ఔషధాలు.. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఏళ్లుగా ఆసుపత్రుల గదుల్లోనే మగ్గి కాలం చెల్లిపోతుండగా- ఆ విషయం ఎక్కడ బయటపడుతుందోనని గుట్టుగా కాల్చేస్తున్నారనే విమర్శలు నెలకొన్నాయి -
భూములిస్తే.. పరిహాసమా!
[ 05-07-2024]
పరిహారం అందకపోవడంపై ఆవేదనజిల్లాల అశాస్త్రీయ పునర్విభజన సమస్య కందుకూరును వెంటాడుతూనే ఉంది. -
నీట్ ఫలితాలపై సమగ్ర విచారణ జరిపించాలి
[ 05-07-2024]
నీట్ ఫలితాలపై అనుమానాలు ఉన్నాయని, వాటిపై సమగ్ర విచారణ జరిపించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ మస్తాన్ షరీఫ్ డిమాండ్ చేశారు
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘బింబిసార’కు ప్రీక్వెల్గా పార్ట్2.. డైరెక్టర్ ఎవరంటే!
-
ట్రయంఫ్ స్పీడ్, స్క్రాంబ్లర్ మోటార్ సైకిళ్లపై డిస్కౌంట్
-
‘ఉస్తాద్ భగత్ సింగ్’పై రూమర్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హరీశ్ శంకర్
-
కేసీఆర్పై విశ్వాసం లేకే కాంగ్రెస్లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
హార్దిక్కు మహిళా అభిమాని బహిరంగ క్షమాపణ.. ఎందుకంటే?