ఆరు ఇళ్లల్లో చోరీ
సంగంలో సోమవారం అర్ధరాత్రి వేళ ఆరు ఇళ్లలో చోరీ జరిగింది. దాంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఆగంతుకులు పగలగొట్టిన బీరువా
సంగం, న్యూస్టుడే: సంగంలో సోమవారం అర్ధరాత్రి వేళ ఆరు ఇళ్లలో చోరీ జరిగింది. దాంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తన ఇంట్లో దొంగలు ప్రవేశించి తమను వెలుపలకు రానీయకుండా తలుపులకు గడియ పెట్టారని శివాజీ సెంటరులో నివాసం ఉండే ఎ.రామారావు మంగళవారం వేకువజామున మూడున్నర గంటలకు ఎస్సై కె.నాగార్జునరెడ్డికి చరవాణి ద్వారా సమాచారం అందించడంతో వెంటనే ఆయన అక్కడకు వెళ్లేసరికి ఆగంతుకులు పరారయ్యారు. రామారావు ఇంటికి దక్షిణం వైపున తలుపునకు వేసిన తాళం పగలగొట్టి, వంటింటి నుంచి లోపలకు ప్రవేశించిన దొంగలు అక్కడే ఉన్న రూ.2లక్షల విలువైన రెండు బంగారు గాజులు, రూ.4వేల నగదు అపహరించినట్లు తేలింది.
- మరో అయిదు ఇళ్లలో చోరీ జరిగినట్లు మంగళవారం తెల్లవారిన తర్వాత వెలుగులోకి వచ్చింది. బెంగళూరు బేకరి ఎదురుగా పి.వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి జొన్నవాడకు వెళ్లారు. వారి ఇంటిపై పోలీసు ఉద్యోగి ఒకరు నివాసముంటున్నారు. అయితే, ఆయన కూడా ఇంట్లో లేనందున ఆ రెండిళ్ల లోపలకు ప్రవేశించిన ఆగంతుకులు బీరువాలు, అల్మారాలు పగలగొట్టి వాటిలో దుస్తులను చెల్లాచెదురు చేశారు. అక్కడ రూ.50వేల నగదు, రెండు గ్రాముల బంగారు ఉంగరాలను అపహరించారు.
- రాళ్లచెలిక బీసీ కాలనీలో ప్రాథమిక పాఠశాల ఎదురుగా ఉన్న జి.హజరత్తయ్య ఇంటికి తాళం వేసి ఉండటంతో అందులో ప్రవేశించిన దొంగలు రెండు వెండి గొలుసులు, రూ.మూడు వేల నగదు తీసుకెళ్లారు.
- రాళ్ల చెలిక ఎస్టీకాలనీలో ఇండ్ల శీనయ్య ఇంటికి తాళం వేసి ఉండటంతో ఆ ఇంటికి వెళ్లిన దొంగలు అక్కడ రూ.50వేల నగదును అపహరించడంతోపాటు రూ.50వేల విలువైన టీవీ పగలగొట్టి వెళ్లారు. తాము ట్రాక్టరుకు చేసిన బకాయిలు చెల్లించేందుకు తీసుకొచ్చిన రూ.50వేల నగదు దొంగలు ఎత్తుకెళ్లారంటూ బాధితురాలు రాజేశ్వరమ్మ విలపించారు. ః కొత్తూరులో బాలచౌడేశ్వరి ఆలయ సమీపంలో పి.శ్రీనివాసులు అనే ఉపాధ్యాయుడు తన కుటుంబంతో కలసి తిరుమలకు వెళ్లడంతో వారింట్లో చోరీ జరిగింది.
పోలీసుల ఆరా: ఈ చోరీలు అర్ధరాత్రి ఒంటి గంట నుంచి మూడు గంటల లోపు జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పాత నేరస్థుల కదలికలను పరిశీలిస్తున్నారు. పలువురు సంగం వాసులు మాత్రం సన్నగా పొడవుగా ఉన్న ఓ వ్యక్తితోపాటు మరొకరు విద్యుత్తు ఉపకేంద్రం వద్ద అర్ధరాత్రి పూట అనుమానాస్పదంగా సంచరించడాన్ని గమనించారు. ఈ సంఘటనలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.నాగార్జునరెడ్డి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గురుకులంపై ఆశ.. సీట్లు లేక నిరాశ
[ 05-07-2024]
జిల్లాలోని గురుకులాల్లో చదువుకోవాలనే ఆసక్తితో పేద విద్యార్థులు వందల సంఖ్యలో సీట్ల కోసం ప్రయత్నిస్తున్నారు -
ప్రభుత్వ పాఠశాలలే లక్ష్యంగా దొంగతనాలు
[ 05-07-2024]
ప్రభుత్వ పాఠశాలలే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. -
యువత.. క్రీడల్లో ఘనత
[ 05-07-2024]
పట్టణంలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పీజీ కళాశాలలో చదువుతున్న వారు క్రీడల్లో ప్రతిభ చూపుతున్నారు. పేద కుటుంబాలకు చెందిన వారు. -
ఖాతాదారుల ఆర్డీ నగదు రూ.10 లక్షలు స్వాహా
[ 05-07-2024]
మండలంలోని పుల్లాయపల్లి బ్రాంచి ఫోస్టాఫీసులో ఖాతాదారులు దాచుకున్న సుమారు రూ. 10 లక్షల ఆర్డీ నగదు పోస్టుమాస్టర్ షేక్ నాయబ్ రసూల్ స్వాహా చేసి పరారయ్యారు. ఈవిషయం గురువారం వెలుగులోకి వచ్చింది -
అనుమతి.. మాకెందుకది!
[ 05-07-2024]
కాస్త పెట్టుబడి.. కొంత పరిచయాలు ఉంటే చాలు.. అనతికాలంలోనే రూ. కోట్లకు పడగలెత్తవచ్చనే ఆలోచనతో వైకాపా నాయకులు రెచ్చిపోయారు. -
ఇదిగో పులి.. కారిడార్ జాడేది?
[ 05-07-2024]
టైగర్ కారిడార్ ప్రతిపాదనలకే పరిమితమైంది. నంద్యాల జిల్లా శ్రీశైలం నుంచి తిరుమల కొండల ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా.. ఆశించిన మేరకు అడుగులు పడలేదు -
నిర్లక్ష్యానికి.. ఏదీ ‘మాత్ర’?
[ 05-07-2024]
సకాలంలో, సక్రమంగా వినియోగిస్తే రోగుల పాలిట సంజీవినులయ్యే పలు ఔషధాలు.. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఏళ్లుగా ఆసుపత్రుల గదుల్లోనే మగ్గి కాలం చెల్లిపోతుండగా- ఆ విషయం ఎక్కడ బయటపడుతుందోనని గుట్టుగా కాల్చేస్తున్నారనే విమర్శలు నెలకొన్నాయి -
భూములిస్తే.. పరిహాసమా!
[ 05-07-2024]
పరిహారం అందకపోవడంపై ఆవేదనజిల్లాల అశాస్త్రీయ పునర్విభజన సమస్య కందుకూరును వెంటాడుతూనే ఉంది. -
నీట్ ఫలితాలపై సమగ్ర విచారణ జరిపించాలి
[ 05-07-2024]
నీట్ ఫలితాలపై అనుమానాలు ఉన్నాయని, వాటిపై సమగ్ర విచారణ జరిపించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ మస్తాన్ షరీఫ్ డిమాండ్ చేశారు