సంగం - చేజర్ల రహదారికి మహర్దశ
జిల్లా మధ్యలో ఉత్తర, దక్షిణ భాగాలను అనుసంధానం చేసే పెన్నానది వంతెన అనుబంధ రహదారి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చొరవతో రూపుమారనుంది.
అధ్వానంగా రహదారి
చేజర్ల, న్యూస్టుడే: జిల్లా మధ్యలో ఉత్తర, దక్షిణ భాగాలను అనుసంధానం చేసే పెన్నానది వంతెన అనుబంధ రహదారి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చొరవతో రూపుమారనుంది. సంగం చేజర్ల రహదారి పెరుమాళ్లపాడు మధ్య ఈ రహదారి గత కొన్నేళ్లుగా మరమ్మతులకు నోచుకోక అధ్వాన స్థితికి చేరింది. చేజర్ల కలువాయి, పొదలకూరు మండలాల నుంచి ఆత్మకూరు, ఉదయగిరికి, ఏఎస్పేట, ఆత్మకూరు వింజమూరు మండలాల నుంచి పెంచలకోన, గూడూరు, రాపూరు, వెంకటగిరి, తిరుపతి ప్రాంతాలకు వెళ్లే వాహనదారులకు పెరుమాళ్లపాడు వద్ద పెన్నా వంతెన అనుకూలంగా ఉంటుంది. నెల్లూరు, సోమశిల మార్గాల మీదుగా ప్రయాణించే కన్నా ఇటుగా వస్తే 35 కిలోమీటర్ల మేర దూరాన్ని తగ్గిస్తోంది. దగ్గరి మార్గం కావడంతో ప్రజలు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటారు. వంతెనకు దక్షిణం వైపున ఉన్న పెరుమాళ్లపాడు రహదారి అయిదారేళ్లుగా కనీస మరమ్మతులు లేక భారీ గోతులతో అధ్వానస్థితికి చేరింది. వాహనదారుల బాధలు చూడలేక రెండేళ్ల క్రితం స్థానికులు తాత్కాలిక మరమ్మతులు చేశారు. మళ్లీ గుంతలుపడి వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. ఆనం రామనారాయణరెడ్డి వెంకటగిరి శాసనసభ్యులుగా ఉన్న సమయంలోనూ ఈ మార్గం ప్రాధాన్యత వివరించి ర.భ.శాఖలోకి మార్చి పక్కా రహదారి వేయాలని ప్రభుత్వాన్ని, జడ్పీ సమావేశాల్లో కోరారు. అయినా, అయిదేళ్లు ఈ రహదారిని పట్టించుకొన్న వారే లేరు. ఈ క్రమంలో మంగళవారం ఆత్మకూరులో నిర్వహించిన తొలి సమీక్షలోనే పెన్నావంతెన అనుబంధ రహదారిని మూడు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో రహదారికి మహర్దశ వచ్చి ప్రయాణికుల కష్టాలు తీరుతాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మార్గంలో రాకపోకలు ఎలా?
మండలంలోని తిమ్మాపురం ప్రజలు రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షానికే దారుణంగా తయారవుతోంది. అడుగడుగునా గుంతలు ఉండడంతోపాటు వర్షపు నీరు నిలిచిపోయి రాకపోకలకు గ్రామస్థులు కష్టాలు పడుతున్నారు. ఈ విషయమై పీˆఆర్ ఏఈ రవీంద్రనాథ్ మాట్లాడుతూ రోడ్డు మరమ్మతుల విషయమై ఉన్నతాధికారులకు నివేదిక పంపించామన్నారు.
న్యూస్టుడే, దుత్తలూరు, ఉదయగిరి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గురుకులంపై ఆశ.. సీట్లు లేక నిరాశ గురుకులంపై ఆశ.. సీట్లు లేక నిరాశ
[ 05-07-2024]
జిల్లాలోని గురుకులాల్లో చదువుకోవాలనే ఆసక్తితో పేద విద్యార్థులు వందల సంఖ్యలో సీట్ల కోసం ప్రయత్నిస్తున్నారు -
ప్రభుత్వ పాఠశాలలే లక్ష్యంగా దొంగతనాలు
[ 05-07-2024]
ప్రభుత్వ పాఠశాలలే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. -
యువత.. క్రీడల్లో ఘనత
[ 05-07-2024]
పట్టణంలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పీజీ కళాశాలలో చదువుతున్న వారు క్రీడల్లో ప్రతిభ చూపుతున్నారు. పేద కుటుంబాలకు చెందిన వారు. -
ఖాతాదారుల ఆర్డీ నగదు రూ.10 లక్షలు స్వాహా
[ 05-07-2024]
మండలంలోని పుల్లాయపల్లి బ్రాంచి ఫోస్టాఫీసులో ఖాతాదారులు దాచుకున్న సుమారు రూ. 10 లక్షల ఆర్డీ నగదు పోస్టుమాస్టర్ షేక్ నాయబ్ రసూల్ స్వాహా చేసి పరారయ్యారు. ఈవిషయం గురువారం వెలుగులోకి వచ్చింది -
అనుమతి.. మాకెందుకది!
[ 05-07-2024]
కాస్త పెట్టుబడి.. కొంత పరిచయాలు ఉంటే చాలు.. అనతికాలంలోనే రూ. కోట్లకు పడగలెత్తవచ్చనే ఆలోచనతో వైకాపా నాయకులు రెచ్చిపోయారు. -
ఇదిగో పులి.. కారిడార్ జాడేది?
[ 05-07-2024]
టైగర్ కారిడార్ ప్రతిపాదనలకే పరిమితమైంది. నంద్యాల జిల్లా శ్రీశైలం నుంచి తిరుమల కొండల ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా.. ఆశించిన మేరకు అడుగులు పడలేదు -
నిర్లక్ష్యానికి.. ఏదీ ‘మాత్ర’?
[ 05-07-2024]
సకాలంలో, సక్రమంగా వినియోగిస్తే రోగుల పాలిట సంజీవినులయ్యే పలు ఔషధాలు.. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఏళ్లుగా ఆసుపత్రుల గదుల్లోనే మగ్గి కాలం చెల్లిపోతుండగా- ఆ విషయం ఎక్కడ బయటపడుతుందోనని గుట్టుగా కాల్చేస్తున్నారనే విమర్శలు నెలకొన్నాయి -
భూములిస్తే.. పరిహాసమా!
[ 05-07-2024]
పరిహారం అందకపోవడంపై ఆవేదనజిల్లాల అశాస్త్రీయ పునర్విభజన సమస్య కందుకూరును వెంటాడుతూనే ఉంది. -
నీట్ ఫలితాలపై సమగ్ర విచారణ జరిపించాలి
[ 05-07-2024]
నీట్ ఫలితాలపై అనుమానాలు ఉన్నాయని, వాటిపై సమగ్ర విచారణ జరిపించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ మస్తాన్ షరీఫ్ డిమాండ్ చేశారు
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రజా వేదిక శిథిలాలు అక్కడే
-
భారాసకు భారీ షాక్.. కాంగ్రెస్లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/07/24)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
రకుల్ప్రీత్ రెడ్ హాట్ లుక్.. మడోన్నా అలలతో ఆట.. మేకప్తో మాళవిక!
-
పాకిస్థాన్లో లీటరు పాల ధర రూ.370.. ఆ దేశాల కంటే అధికం!