మాటలతో సరి.. గాలికొదిలేశారు మరి
సర్వేపల్లి జలాశయంపై వైకాపా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది. సుమారు 40వేల ఎకరాలకు సాగునీరందించే ఈ కీలక నీటి వనరు ఆధునికీకరణ పూర్తిపై కనీస శ్రద్ధ పెట్టలేకపోయింది.
వైకాపా పాలనలో ‘సర్వేపల్లి’పై కొరవడిన శ్రద్ధ
దెబ్బతిన్న జలాశయం కట్ట
పేరు: సర్వేపల్లి జలాశయం
సామర్థ్యం: 1.74 టీఎంసీలు
ఆయకట్టు: సుమారు 40వేల ఎకరాలు
ఆధునికీకరణకు నిధులు: రూ. 11.11 కోట్లు
పూర్తయిన పనులు: 40 శాతం
పనుల స్థితి: అసంపూర్తి
న్యూస్టుడే, వెంకటాచలం: సర్వేపల్లి జలాశయంపై వైకాపా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది. సుమారు 40వేల ఎకరాలకు సాగునీరందించే ఈ కీలక నీటి వనరు ఆధునికీకరణ పూర్తిపై కనీస శ్రద్ధ పెట్టలేకపోయింది. ఫలితంగా మూడేళ్లలో కేవలం 40శాతం కూడా పూర్తికాకపోగా- చేసినవి కూడా దెబ్బతినే పరిస్థితి నెలకొంది.
వైకాపా ప్రభుత్వ హయాంలో రిజర్వాయరు ఆధునికీకరణకు రూ. 11.11 కోట్లు మంజూరు చేసినా.. అవి పేరుకే అన్నట్లు కాలం వెల్లదీశారు. టెండరు దక్కించుకున్న గుత్తేదారుడు మూడేళ్ల కిందట పనులు ప్రారంభించినా.. తర్వాత వాటిలో పురోగతి మాత్రం లేదు. రెండో పంటకు సాగునీరు పేరుతో నిలిపివేశారు. నిజానికి 2022 ఆగస్టులోనే పనులు పూర్తి చేయాల్సి ఉండగా- కాలేదు. తర్వాత వరుసగా రెండు సార్లు ఏడాది చొప్పున గడువు పెంచారు. అయినప్పటికీ మట్టి కట్ట పనులతో మమ అనిపించారు. 40శాతం పనులు కూడా పూర్తి కాలేదు. పనుల ఆలస్యంపై ఆందోళన నెలకొంది.
వర్షాలొస్తున్నాయంటే.. వణుకే..
రిజర్వాయరు ఆనకట్ట బలహీనంగా ఉండటం.. కట్ట పనులు పూర్తికాకపోవడంతో.. వర్షాలొస్తున్నాయంటే.. రైతులు, సమీప గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. గత ఏడాది వర్షాకాలంలో రిజర్వాయరులోకి భారీగా నీరు చేరింది. దాంతో కట్ట కొంత మేరకు కోసుకుపోయి ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు మరమ్మతులు చేయించడంతో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం కట్ట అదే పరిస్థితిలో ఉంది. పనుల్లో జాప్యం, నిలుపుదలతో ఇప్పటి వరకు చేసిన పనులు పాత స్థితికే చేరుకున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వచ్చే నెలలో ప్రారంభిస్తాం
ప్రసాద్, నీటిపారుదలశాఖ ఏఈ
రెండో పంటకు సాగునీటి విడుదలతో పనుల నిర్వహణకు ఆటంకం ఏర్పడింది. 40శాతానికిపైగా పూర్తయ్యాయి. కొంత మేరకు కట్ట పనులు, కట్ట కింద రోడ్డు నిర్మాణం, కి.మీ. మేర రివిట్మెంట్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం కూడా రిజర్వాయరులో నీరుంది. తగ్గిన తర్వాత ఆగస్టులో తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం.
‘2015లో వచ్చిన వర్షాలకు కట్ట పూర్తిగా బలహీనపడి.. ఒక వైపు తెగే పరిస్థితి వచ్చింది. కలుజులు ధ్వంసం చేసి.. నీటిని బయటకు పంపడంతో రైతులు, సమీప గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలో నాటి, నేటి ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు వచ్చి రిజర్వాయరును పరిశీలించారు. తర్వాత కట్టకు తాత్కాలిక మరమ్మతులు చేయించారు. అప్పట్లో కట్ట పటిష్ఠపరిచే పనులకు రూ. నాలుగు కోట్లు మంజూరు చేయగా.. టెండరు దశ దాటలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని.. రిజర్వాయరుకు కొత్త రూపు తీసుకువచ్చి రైతుల ప్రయోజనాలు కాపాడుతారన్న ఆకాంక్ష వ్యక్తమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ పట్టివేత
[ 05-07-2024]
ఇసుక మాఫియాపై కోవూరు పోలీసులు కొరడా ఝులిపించారు. వరుసగా రెండు రోజులు తనిఖీలు చేసిన ఇసుక ట్రాక్టర్, టిప్పర్ను స్వాధీనం చేసుకున్నారు. -
గురుకులంపై ఆశ.. సీట్లు లేక నిరాశ
[ 05-07-2024]
జిల్లాలోని గురుకులాల్లో చదువుకోవాలనే ఆసక్తితో పేద విద్యార్థులు వందల సంఖ్యలో సీట్ల కోసం ప్రయత్నిస్తున్నారు -
ప్రభుత్వ పాఠశాలలే లక్ష్యంగా దొంగతనాలు
[ 05-07-2024]
ప్రభుత్వ పాఠశాలలే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. -
యువత.. క్రీడల్లో ఘనత
[ 05-07-2024]
పట్టణంలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పీజీ కళాశాలలో చదువుతున్న వారు క్రీడల్లో ప్రతిభ చూపుతున్నారు. పేద కుటుంబాలకు చెందిన వారు. -
ఖాతాదారుల ఆర్డీ నగదు రూ.10 లక్షలు స్వాహా
[ 05-07-2024]
మండలంలోని పుల్లాయపల్లి బ్రాంచి ఫోస్టాఫీసులో ఖాతాదారులు దాచుకున్న సుమారు రూ. 10 లక్షల ఆర్డీ నగదు పోస్టుమాస్టర్ షేక్ నాయబ్ రసూల్ స్వాహా చేసి పరారయ్యారు. ఈవిషయం గురువారం వెలుగులోకి వచ్చింది -
అనుమతి.. మాకెందుకది!
[ 05-07-2024]
కాస్త పెట్టుబడి.. కొంత పరిచయాలు ఉంటే చాలు.. అనతికాలంలోనే రూ. కోట్లకు పడగలెత్తవచ్చనే ఆలోచనతో వైకాపా నాయకులు రెచ్చిపోయారు. -
ఇదిగో పులి.. కారిడార్ జాడేది?
[ 05-07-2024]
టైగర్ కారిడార్ ప్రతిపాదనలకే పరిమితమైంది. నంద్యాల జిల్లా శ్రీశైలం నుంచి తిరుమల కొండల ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా.. ఆశించిన మేరకు అడుగులు పడలేదు -
నిర్లక్ష్యానికి.. ఏదీ ‘మాత్ర’?
[ 05-07-2024]
సకాలంలో, సక్రమంగా వినియోగిస్తే రోగుల పాలిట సంజీవినులయ్యే పలు ఔషధాలు.. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఏళ్లుగా ఆసుపత్రుల గదుల్లోనే మగ్గి కాలం చెల్లిపోతుండగా- ఆ విషయం ఎక్కడ బయటపడుతుందోనని గుట్టుగా కాల్చేస్తున్నారనే విమర్శలు నెలకొన్నాయి -
భూములిస్తే.. పరిహాసమా!
[ 05-07-2024]
పరిహారం అందకపోవడంపై ఆవేదనజిల్లాల అశాస్త్రీయ పునర్విభజన సమస్య కందుకూరును వెంటాడుతూనే ఉంది. -
నీట్ ఫలితాలపై సమగ్ర విచారణ జరిపించాలి
[ 05-07-2024]
నీట్ ఫలితాలపై అనుమానాలు ఉన్నాయని, వాటిపై సమగ్ర విచారణ జరిపించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ మస్తాన్ షరీఫ్ డిమాండ్ చేశారు
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్లో చంద్రబాబుకు ఘనస్వాగతం.. భారీగా తరలివచ్చిన తెదేపా శ్రేణులు
-
నాపై నాకే నమ్మకం కుదరలేదు: కోహ్లీ
-
అదే నిజమైతే.. భోలే బాబా మా వారిని బతికించొచ్చు కదా..!
-
హైదరాబాద్లో పలు చోట్ల వర్షం.. స్తంభించిన ట్రాఫిక్
-
ఇప్పుడు 140+ కోట్ల మంది ఛాంపియన్లే: హార్దిక్ పాండ్య
-
బ్రిటన్ ఎన్నికల్లో భారత సంతతి హవా.. 26 మంది గెలుపు!