భవనంపై నుంచి దూకి వైద్యురాలి ఆత్మహత్య
వైద్య కళాశాల భవనం పైనుంచి దూకి వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్న దుర్ఘటన సోమవారం నెల్లూరు జీజీహెచ్లో చోటు చేసుకుంది.
వైద్యుల దినోత్సవం రోజే దుర్ఘటన
నెల్లూరు(నేర విభాగం), న్యూస్టుడే: వైద్య కళాశాల భవనం పైనుంచి దూకి వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్న దుర్ఘటన సోమవారం నెల్లూరు జీజీహెచ్లో చోటు చేసుకుంది. వైద్యుల దినోత్సవం రోజే ఈ ఘటన చోటు చేసుకోవడం అందరినీ కలచివేసింది. వైద్యుల వివరాల మేరకు.. నల్గొండకు చెందిన జ్యోతి (38), నెల్లూరుకు చెందిన రవికి 2014లో వివాహమైంది. జ్యోతి చేజర్ల మండలం చిత్తలూరు పీహెచ్సీలో వైద్యాధికారిణిగా, రవి జిల్లా ప్రభుత్వాసుపత్రి ఆర్థోపెడిక్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసరుగా పనిచేస్తున్నారు. వీరికి మూడేళ్ల పాప ఉంది. నారాయణ ఆసుపత్రి సమీపంలో నివాసం ఉంటున్నారు. డాక్టర్ జ్యోతి సోమవారం జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో క్యాన్సర్ స్క్రీనింగ్పై నిర్వహించిన శిక్షణకు హాజరయ్యారు. మధ్యాహ్నం వరకు బాగున్నారు. భోజనం అనంతరం ఫోను రాగానే, ఒకటో అంతస్తు నుంచి నాలుగో అంతస్తుకు వెళ్లి.. అక్కడి నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వైద్యాధికారులు తక్షణ చికిత్సతో పాటు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. దర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండ నుంచి మృతురాలి తల్లిదండ్రులు వచ్చిన తర్వాత ఆత్మహత్యకు గల కారణాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గురుకులంపై ఆశ.. సీట్లు లేక నిరాశ
[ 05-07-2024]
జిల్లాలోని గురుకులాల్లో చదువుకోవాలనే ఆసక్తితో పేద విద్యార్థులు వందల సంఖ్యలో సీట్ల కోసం ప్రయత్నిస్తున్నారు -
ప్రభుత్వ పాఠశాలలే లక్ష్యంగా దొంగతనాలు
[ 05-07-2024]
ప్రభుత్వ పాఠశాలలే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. -
యువత.. క్రీడల్లో ఘనత
[ 05-07-2024]
పట్టణంలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పీజీ కళాశాలలో చదువుతున్న వారు క్రీడల్లో ప్రతిభ చూపుతున్నారు. పేద కుటుంబాలకు చెందిన వారు. -
ఖాతాదారుల ఆర్డీ నగదు రూ.10 లక్షలు స్వాహా
[ 05-07-2024]
మండలంలోని పుల్లాయపల్లి బ్రాంచి ఫోస్టాఫీసులో ఖాతాదారులు దాచుకున్న సుమారు రూ. 10 లక్షల ఆర్డీ నగదు పోస్టుమాస్టర్ షేక్ నాయబ్ రసూల్ స్వాహా చేసి పరారయ్యారు. ఈవిషయం గురువారం వెలుగులోకి వచ్చింది -
అనుమతి.. మాకెందుకది!
[ 05-07-2024]
కాస్త పెట్టుబడి.. కొంత పరిచయాలు ఉంటే చాలు.. అనతికాలంలోనే రూ. కోట్లకు పడగలెత్తవచ్చనే ఆలోచనతో వైకాపా నాయకులు రెచ్చిపోయారు. -
ఇదిగో పులి.. కారిడార్ జాడేది?
[ 05-07-2024]
టైగర్ కారిడార్ ప్రతిపాదనలకే పరిమితమైంది. నంద్యాల జిల్లా శ్రీశైలం నుంచి తిరుమల కొండల ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా.. ఆశించిన మేరకు అడుగులు పడలేదు -
నిర్లక్ష్యానికి.. ఏదీ ‘మాత్ర’?
[ 05-07-2024]
సకాలంలో, సక్రమంగా వినియోగిస్తే రోగుల పాలిట సంజీవినులయ్యే పలు ఔషధాలు.. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఏళ్లుగా ఆసుపత్రుల గదుల్లోనే మగ్గి కాలం చెల్లిపోతుండగా- ఆ విషయం ఎక్కడ బయటపడుతుందోనని గుట్టుగా కాల్చేస్తున్నారనే విమర్శలు నెలకొన్నాయి -
భూములిస్తే.. పరిహాసమా!
[ 05-07-2024]
పరిహారం అందకపోవడంపై ఆవేదనజిల్లాల అశాస్త్రీయ పునర్విభజన సమస్య కందుకూరును వెంటాడుతూనే ఉంది. -
నీట్ ఫలితాలపై సమగ్ర విచారణ జరిపించాలి
[ 05-07-2024]
నీట్ ఫలితాలపై అనుమానాలు ఉన్నాయని, వాటిపై సమగ్ర విచారణ జరిపించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ మస్తాన్ షరీఫ్ డిమాండ్ చేశారు
తాజా వార్తలు (Latest News)
-
హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. బాధితులను పరామర్శించిన రాహుల్ గాంధీ
-
క్షమించండి.. ఓటమికి బాధ్యత వహిస్తున్నా: రిషి సునాక్
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,200
-
చెన్నుపాటి గాంధీపై దాడి కేసులో వైకాపా నేత ఈశ్వరప్రసాద్ అరెస్టు
-
‘భారతీయుడు2’ సెన్సార్ పూర్తి.. రన్టైమ్ ఎంతంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM