రాష్ట్ర స్థాయి నాటుబండి ఎడ్ల పోటీలు
విడవలూరు మండలం రామతీర్థంలో రాష్ట్ర స్థాయి నాటుబండి ఎడ్ల పోటీలు సోమవారం పోటాపోటీగా జరిగాయి.
రామతీర్థంలో బండి లాగుతున్న ఎడ్లు
విడవలూరు : విడవలూరు మండలం రామతీర్థంలో రాష్ట్ర స్థాయి నాటుబండి ఎడ్ల పోటీలు సోమవారం పోటాపోటీగా జరిగాయి. శ్రీకామాక్షిదేవి సమేత రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో రావణసేవ సందర్భంగా గౌడ సంఘం వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో 20 జతల ఎండ్లు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలు చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. మొదటి బహుమతి జొన్నవాడకు చెందిన ఎండ్లు, రెండో బహుమతి బాపట్ల జిల్లాకు చెందిన కడవకుదురు ఎడ్లు, మూడో బహుమతి అల్లూరు మండలం తూర్పుగోగులపల్లి ఎడ్లు, నాలుగో బహుమతి బాపట్ల జిల్లా వేటపాలెం ఎడ్లు, అయిదో బహుమతి అల్లూరు మండలం గోగులపల్లి ఎడ్ల జత కైవసం చేసుకున్నాయి. మొదటి విజేతకు ఎల్లసిరి లక్ష్మయ్య గౌడ్ రూ.30వేలు, ఉప్పల ఈశ్వరయ్య గౌడ్ రెండో విజేతకు రూ.20వేలు, మూడో విజేతకు రూ.15వేలు ఉప్పల శివకృష్ణ గౌడ్, నాలుగో విజేతకు నాసిన వెంకట శేషయ్య గౌడ్ రూ.10వేలు, ఐదో విజేతకు రూ.8వేలు అత్తిరాల శ్రీనివాసులు గౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా బాషా యూత్ ఫౌండేషన్, ఎడ్లబండి పోటీల నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం, కమిటీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గురుకులంపై ఆశ.. సీట్లు లేక నిరాశ
[ 05-07-2024]
జిల్లాలోని గురుకులాల్లో చదువుకోవాలనే ఆసక్తితో పేద విద్యార్థులు వందల సంఖ్యలో సీట్ల కోసం ప్రయత్నిస్తున్నారు -
ప్రభుత్వ పాఠశాలలే లక్ష్యంగా దొంగతనాలు
[ 05-07-2024]
ప్రభుత్వ పాఠశాలలే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. -
యువత.. క్రీడల్లో ఘనత
[ 05-07-2024]
పట్టణంలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పీజీ కళాశాలలో చదువుతున్న వారు క్రీడల్లో ప్రతిభ చూపుతున్నారు. పేద కుటుంబాలకు చెందిన వారు. -
ఖాతాదారుల ఆర్డీ నగదు రూ.10 లక్షలు స్వాహా
[ 05-07-2024]
మండలంలోని పుల్లాయపల్లి బ్రాంచి ఫోస్టాఫీసులో ఖాతాదారులు దాచుకున్న సుమారు రూ. 10 లక్షల ఆర్డీ నగదు పోస్టుమాస్టర్ షేక్ నాయబ్ రసూల్ స్వాహా చేసి పరారయ్యారు. ఈవిషయం గురువారం వెలుగులోకి వచ్చింది -
అనుమతి.. మాకెందుకది!
[ 05-07-2024]
కాస్త పెట్టుబడి.. కొంత పరిచయాలు ఉంటే చాలు.. అనతికాలంలోనే రూ. కోట్లకు పడగలెత్తవచ్చనే ఆలోచనతో వైకాపా నాయకులు రెచ్చిపోయారు. -
ఇదిగో పులి.. కారిడార్ జాడేది?
[ 05-07-2024]
టైగర్ కారిడార్ ప్రతిపాదనలకే పరిమితమైంది. నంద్యాల జిల్లా శ్రీశైలం నుంచి తిరుమల కొండల ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా.. ఆశించిన మేరకు అడుగులు పడలేదు -
నిర్లక్ష్యానికి.. ఏదీ ‘మాత్ర’?
[ 05-07-2024]
సకాలంలో, సక్రమంగా వినియోగిస్తే రోగుల పాలిట సంజీవినులయ్యే పలు ఔషధాలు.. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఏళ్లుగా ఆసుపత్రుల గదుల్లోనే మగ్గి కాలం చెల్లిపోతుండగా- ఆ విషయం ఎక్కడ బయటపడుతుందోనని గుట్టుగా కాల్చేస్తున్నారనే విమర్శలు నెలకొన్నాయి -
భూములిస్తే.. పరిహాసమా!
[ 05-07-2024]
పరిహారం అందకపోవడంపై ఆవేదనజిల్లాల అశాస్త్రీయ పునర్విభజన సమస్య కందుకూరును వెంటాడుతూనే ఉంది. -
నీట్ ఫలితాలపై సమగ్ర విచారణ జరిపించాలి
[ 05-07-2024]
నీట్ ఫలితాలపై అనుమానాలు ఉన్నాయని, వాటిపై సమగ్ర విచారణ జరిపించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ మస్తాన్ షరీఫ్ డిమాండ్ చేశారు
తాజా వార్తలు (Latest News)
-
మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ.. రూ.60వేల కోట్లతో ఏర్పాటు
-
ఆరు మందులు రాస్తే.. ఐదు కొనుక్కోవాల్సిందే
-
కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై కేసు
-
రక్తంలో కొలెస్ట్రాల్పై కొత్త మార్గదర్శకాలు.. తొలిసారి జారీ చేసిన సీఎస్ఐ
-
పిల్లలు పుట్టడంలేదని వివాహిత ఆత్మహత్య
-
అసలు కథ ముందుంది.. ‘కల్కి’ సీక్వెల్పై స్పందించిన నాగ్ అశ్విన్