logo

వైకాపా నాయకుల ఆక్రమణల తొలగింపు

ప్రభుత్వ భూమిలో వైకాపా నాయకులు నిర్మించిన అక్రమ కట్టడాలను సోమవారం అధికారులు కూల్చివేశారు. ఈ ఘటన సోమవారం బోగోలులో జరిగింది.

Published : 02 Jul 2024 02:47 IST

ఆక్రమణలు తొలగిస్తున్న యంత్రం

బిట్రగుంట, న్యూస్‌టుడే: ప్రభుత్వ భూమిలో వైకాపా నాయకులు నిర్మించిన అక్రమ కట్టడాలను సోమవారం అధికారులు కూల్చివేశారు. ఈ ఘటన సోమవారం బోగోలులో జరిగింది. బోగోలు పంచాయతీ మణికంఠనగర్‌ సమీపంలోని నాలుగు రోడ్ల కూడలిలో ఇద్దరు వైకాపా నాయకులు ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని మండల పరిషత్‌ అధికారులు గుర్తించారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారుల సూచనల మేరకు మండల ఈవోపీˆఆర్డీ శ్రీదేవి పర్యవేక్షణలో ఆక్రమణల తొలగింపు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇకపై ఈ స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేసినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని