నేడు పింఛన్ల పంపిణీ
తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జులై 1న ‘ఎన్టీఆర్ భరోసా’ పేరిట నేరుగా ఇంటి వద్దకే సామ్ము పంపిణీ చేసేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.
ఇంటి వద్దే ఇవ్వనున్న అధికారులు
నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్టుడే: తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జులై 1న ‘ఎన్టీఆర్ భరోసా’ పేరిట నేరుగా ఇంటి వద్దకే సామ్ము పంపిణీ చేసేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఉదయం ఆరు గంటలకే పంపిణీ ప్రారంభించనున్నారు. ఒకేసారి రూ.వెయ్యి పెంచడడం, అదనంగా మరో రూ.3 వేలు.. మొత్తం రూ.7 వేలు అందజేయనుండటంతో అవ్వాతాతలు, ఇతర లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అన్ని రకాల కేటగిరీల్లో 3,13,757 మందికి రూ.214,50,69,500 అందించనున్నారు. 8,500 మంది సచివాలయ సిబ్బంది పింఛన్లను ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయనున్నారు. మొదటి రోజే వంద శాతం పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. సాంకేతిక.. ఇతరత్రా సమస్యలు తలెత్తితే మరుసటి రోజు అందించనున్నట్లు డీఆర్డీఏ పీడీ సాంబశివారెడ్డి తెలిపారు.
జిల్లాలో ఇలా.. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 6,021 పింఛనుదారులకు రూ.4,15,41,501, నెెల్లూరు అర్బన్లో 47,315 మందికి రూ.32,66,51,501, కోవూరులో 42,797 మందికి రూ.29,46,36,000, కావలిలో 37,479 మందికి రూ.25,68,38,000, ఉదయగిరిలో 41,054 మందికి రూ.27,87,75,000, ఆత్మకూరులో 38,127 మందికి రూ.26,08,12,500, వెంకటగిరిలో 20,343 మందికి రూ.13,88,89,100, సర్వేపల్లిలో 39886 మందికి రూ.27,45,93,500, కందుకూరు నియోజకవర్గంలో 40,735 మంది పింఛనుదారులకు రూ.27,33,30,500 అందజేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జోరుగా బేరాలు.. పట్టాల అమ్మకాలు!
[ 03-07-2024]
అయిదేళ్ల పాలనలో వైకాపా నాయకులు దోచుకోవడం.. దాచుకోవడమే పరమావధిగా రెచ్చిపోయారు. కన్నుపడిన స్థలాలు తక్షణం తమ అధీనంలోకి వెళ్లిపోవాలన్నట్లు వ్యవహరించారు. దేవాదాయశాఖ అధికారులు తమ భూమిగా పేర్కొంటూ.. -
జలమయం.. జనం భయం
[ 03-07-2024]
ఏటా నవంబరు, డిసెంబరు నెలల్లో కురిసే వర్షాలకు నెల్లూరు నగరం ముంపునకు గురవుతోంది. శాఖల మధ్య సమన్వయ లోపం పది లక్షల మంది ప్రజలకు శాపంగా పరిణమిస్తోంది. -
బస్సులో రూ.80 లక్షల చోరీ
[ 03-07-2024]
బస్సులో ప్రయాణిస్తున్న వ్యాపారుల దగ్గర రూ.80 లక్షల నగదును దొంగలు అపహరించారు. సోమవారం రాత్రి మద్దూరుపాడు వద్దనున్న ఓ దాబా సమీపంలో ఆగి ఉన్న బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. -
అనర్హులకు మత్స్యకార భరోసా
[ 03-07-2024]
వేట విరామ సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం ఇచ్చే మత్స్యకార భరోసాలో అనర్హులు పాగా వేశారు. దీని కింద ప్రభుత్వం రూ. పదివేలు ఇచ్చి ఆదుకుంటుండగా- సదరు జాబితాలో కొందరు వైకాపా నాయకులు మత్స్య వేట తెలియని వారి పేర్లు నమోదు చేయించారు. -
అనధికారిక మార్గం.. ప్రమాదాలకు నిలయం
[ 03-07-2024]
జాతీయ రహదారిపై అనధికారిక క్రాసింగ్లతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మంగళవారం ముసునూరు టోల్ప్లాజా సమీపంలో అలాంటి క్రాసింగ్ వద్దే పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. -
వీఆర్లో ఎన్సీఈఆర్టీ కార్యకలాపాలు
[ 03-07-2024]
నెల్లూరులో 150 సంవత్సరాలకు పైగా విద్యార్థులకు చదువులు నేర్పిన వీఆర్ కళాశాలలో త్వరలో ఎన్సీఈఆర్టీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. దీంతో తరగతి గదులు, భవనాలకు పూర్వ వైభవం రానుంది. -
ఆత్మకూరును ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: మంత్రి ఆనం
[ 03-07-2024]
ఆత్మకూరును ఆదర్శంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ శాఖామాత్యులు ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. -
ఆరు ఇళ్లల్లో చోరీ
[ 03-07-2024]
సంగంలో సోమవారం అర్ధరాత్రి వేళ ఆరు ఇళ్లలో చోరీ జరిగింది. దాంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. -
సంగం - చేజర్ల రహదారికి మహర్దశ
[ 03-07-2024]
జిల్లా మధ్యలో ఉత్తర, దక్షిణ భాగాలను అనుసంధానం చేసే పెన్నానది వంతెన అనుబంధ రహదారి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చొరవతో రూపుమారనుంది. -
సృజనాత్మకత.. నృత్య ఘనత
[ 03-07-2024]
ఇంటర్మీడియట్ పూర్తిచేసిన వాడరేవు శ్రీలయ భరతనాట్యంలో ప్రావీణ్యాన్ని సాధించింది. తల్లిదండ్రులు వీవీఆర్ ఫణీంద్రకుమార్, ప్రసూన కుమారి ప్రోత్సాహంతో నేర్చుకున్న నృత్యాన్ని పలు వేదికలపై ప్రదర్శించి ప్రశంసలు అందుకుంటుంది.