సెలవు రోజు.. వైద్యానికి స్వస్తి
ప్రతిరోజూ ప్రభుత్వ ఆసుపత్రులు పనిచేయాలన్న నింబంధనలకు తూట్లు పడుతున్నాయి. పండుగలు, సాధారణ సెలవు రోజుల్లో పీహెచ్సీలు మూతపడుతున్నాయి.
మూతపడిన అల్లీపురం ఆసుపత్రి
నెల్లూరు(స్టోన్హౌస్పేట), న్యూస్టుడే: ప్రతిరోజూ ప్రభుత్వ ఆసుపత్రులు పనిచేయాలన్న నింబంధనలకు తూట్లు పడుతున్నాయి. పండుగలు, సాధారణ సెలవు రోజుల్లో పీహెచ్సీలు మూతపడుతున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలందక.. రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు..
జిల్లాలో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలందించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 61 పీహెచ్సీ, 497 వైఎస్సార్ హెల్త్క్లినిక్లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్సీలలో ఇద్దరు వైద్యాధికారులు, ముగ్గురు స్టాఫ్నర్సులు, ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఎంఎన్వో గానీ, ఎఫ్ఎన్వో, ఎంపీహెచ్వో ఇలా మొత్తంగా 14మంది వైద్య సిబ్బంది ఉండేలా ఏర్పాటు చేశారు. ఇద్దరిలో ఒక వైద్యుడు ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యం అందిస్తారు.. మరో వైద్యుడు 104 వాహనం ద్వారా పీహెచ్సీ పరిధిలోని వైఎస్సార్ హెల్త్క్ల్లినిక్కు వెళ్లి ఉదయం నుంచి ఓపీ చూడడం, మధ్యాహ్నం నుంచి ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్రచికిత్సలు చేసుకున్న వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో మంచానికి పరిమితమైన రోగులు, పాఠశాలలు విద్యార్థులు, అంగన్వాడీ చిన్నారులకు వైద్య సేవలందిస్తారు. వైద్య సిబ్బంది ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం భోజన విరామ సమయం మినహాయించి సాయంత్రం 4గంటల వరకు విధుల్లో ఉండాలి.
సేవలు బంద్
మధ్యాహ్నం నుంచి జిల్లాలో పలుపీహెచ్సీలకు తాళాలు పడుతున్నాయి. అల్లీపురం ఆసుపత్రి తోటపల్లి గూడూరు మండలం వరిగొండ ప్రాథమిక వైద్యశాల, కోవూరు నియోజకవర్గం జగదేవిపేట పీహెచ్సీలు ఆదివారం మధ్యాహ్నం తరువాత మూతపడ్డాయి. వీటన్నింటికీ తాళాలు వేసి ఉంచడం గమనార్హం.
మూతపడితే చర్యలు తప్పవు
పీహెచ్సీల్లో సెలవు రోజులు, ముఖ్యంగా ఆదివారం మధ్యాహ్నం వరకు వైద్యుడు, సిబ్బంది విధుల్లో ఉంటారు. మధ్యాహ్నం నుంచి సిబ్బంది విధుల్లో ఉండగా, అత్యవసర కేసుల్లో వైద్యుడు అందుబాటులో ఉంటారు. ఆసుపత్రిని మూత వేయకూడదు. ఎక్కడైనా జరిగితే చర్యలు తీసుకుంటాం.
ఎం.పెంచలయ్య, డీఎంహెచ్వో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జోరుగా బేరాలు.. పట్టాల అమ్మకాలు!
[ 03-07-2024]
అయిదేళ్ల పాలనలో వైకాపా నాయకులు దోచుకోవడం.. దాచుకోవడమే పరమావధిగా రెచ్చిపోయారు. కన్నుపడిన స్థలాలు తక్షణం తమ అధీనంలోకి వెళ్లిపోవాలన్నట్లు వ్యవహరించారు. దేవాదాయశాఖ అధికారులు తమ భూమిగా పేర్కొంటూ.. -
జలమయం.. జనం భయం
[ 03-07-2024]
ఏటా నవంబరు, డిసెంబరు నెలల్లో కురిసే వర్షాలకు నెల్లూరు నగరం ముంపునకు గురవుతోంది. శాఖల మధ్య సమన్వయ లోపం పది లక్షల మంది ప్రజలకు శాపంగా పరిణమిస్తోంది. -
బస్సులో రూ.80 లక్షల చోరీ
[ 03-07-2024]
బస్సులో ప్రయాణిస్తున్న వ్యాపారుల దగ్గర రూ.80 లక్షల నగదును దొంగలు అపహరించారు. సోమవారం రాత్రి మద్దూరుపాడు వద్దనున్న ఓ దాబా సమీపంలో ఆగి ఉన్న బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. -
అనర్హులకు మత్స్యకార భరోసా
[ 03-07-2024]
వేట విరామ సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం ఇచ్చే మత్స్యకార భరోసాలో అనర్హులు పాగా వేశారు. దీని కింద ప్రభుత్వం రూ. పదివేలు ఇచ్చి ఆదుకుంటుండగా- సదరు జాబితాలో కొందరు వైకాపా నాయకులు మత్స్య వేట తెలియని వారి పేర్లు నమోదు చేయించారు. -
అనధికారిక మార్గం.. ప్రమాదాలకు నిలయం
[ 03-07-2024]
జాతీయ రహదారిపై అనధికారిక క్రాసింగ్లతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మంగళవారం ముసునూరు టోల్ప్లాజా సమీపంలో అలాంటి క్రాసింగ్ వద్దే పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. -
వీఆర్లో ఎన్సీఈఆర్టీ కార్యకలాపాలు
[ 03-07-2024]
నెల్లూరులో 150 సంవత్సరాలకు పైగా విద్యార్థులకు చదువులు నేర్పిన వీఆర్ కళాశాలలో త్వరలో ఎన్సీఈఆర్టీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. దీంతో తరగతి గదులు, భవనాలకు పూర్వ వైభవం రానుంది. -
ఆత్మకూరును ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: మంత్రి ఆనం
[ 03-07-2024]
ఆత్మకూరును ఆదర్శంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ శాఖామాత్యులు ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. -
ఆరు ఇళ్లల్లో చోరీ
[ 03-07-2024]
సంగంలో సోమవారం అర్ధరాత్రి వేళ ఆరు ఇళ్లలో చోరీ జరిగింది. దాంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. -
సంగం - చేజర్ల రహదారికి మహర్దశ
[ 03-07-2024]
జిల్లా మధ్యలో ఉత్తర, దక్షిణ భాగాలను అనుసంధానం చేసే పెన్నానది వంతెన అనుబంధ రహదారి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చొరవతో రూపుమారనుంది. -
సృజనాత్మకత.. నృత్య ఘనత
[ 03-07-2024]
ఇంటర్మీడియట్ పూర్తిచేసిన వాడరేవు శ్రీలయ భరతనాట్యంలో ప్రావీణ్యాన్ని సాధించింది. తల్లిదండ్రులు వీవీఆర్ ఫణీంద్రకుమార్, ప్రసూన కుమారి ప్రోత్సాహంతో నేర్చుకున్న నృత్యాన్ని పలు వేదికలపై ప్రదర్శించి ప్రశంసలు అందుకుంటుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్క్రూడ్రైవర్తో మెడపై పొడిచి భర్తను అంతమొందించిన భార్య
-
పట్టిసీమను జగన్ ఒట్టిసీమ అన్నారు.. ఇప్పుడదే బంగారమైంది: మంత్రి నిమ్మల
-
బెంబేలెత్తించిన బెరిల్.. మొత్తం ద్వీపం ధ్వంసం!
-
రక్తంతో రాసిన కథ ‘మీర్జాపూర్’.. మూడో సీజన్ వస్తోంది!
-
అతిగా నిద్రపోయి.. భారత్తో మ్యాచ్కు దూరమై..
-
సెన్సెక్స్ @ 80,000.. రికార్డు గరిష్ఠానికి నిఫ్టీ