పట్టని నిబంధనలు.. ట్రాఫిక్ కష్టాలు
ఈ చిత్రం పట్టణంలోని ట్రంకురోడ్డు నుంచి సంకులవారితోటకు వెళ్లే మార్గంలో ఇటీవల ఓ సమావేశ మందిరం నిర్మించారు. దీనికి పార్కింగ్ సదుపాయం లేదు.
ఈ చిత్రం పట్టణంలోని ట్రంకురోడ్డు నుంచి సంకులవారితోటకు వెళ్లే మార్గంలో ఇటీవల ఓ సమావేశ మందిరం నిర్మించారు. దీనికి పార్కింగ్ సదుపాయం లేదు. ఇక్కడ జరిగే కార్యక్రమాలకు హాజరయ్యే వారు తమ వాహనాలు నడిరోడ్డుపైనే నిలుపుతుండడంతో ట్రాఫిక్కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
న్యూస్టుడే, కావలి: పట్టణంలో వాణిజ్య భవనాలు, సమావేశ మందిరాల నిర్మాణంలో వాటి యజమానులు నిబంధనలు పాటించడం లేదు.పెద్దపెద్ద భవనాలు నిర్మించే వారుపురపాలక సంఘం అనుమతి తీసుకొనే సమయంలో వాహనాల నిలుపుదలకు స్థలం చూపించాల్సి ఉంది. చూపించకపోయినా అనుమతివ్వడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో నిర్మించిన వాటి విషయంలో ఏమీ చేయలేకున్నామని, ఇకపై అలాంటివి కట్టకుండా చేస్తామటున్న అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఇటీవల సంకులవారి తోట, రామ్మూర్తిపేటలో నిర్మించిన వాటికి వాహనాల పార్కింగ్ సదుపాయం లేదు. అక్కడ ఏవైనా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఆయా ప్రాంతాల్లో నిలిపే వాహనాలతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. సాయిబాబా ఆలయం, ప్రైవేట్ ఆసుపత్రి, వివిధ పార్టీల కార్యాలయాలుండడంతో అటుగా వెళ్లే వారి వాహనాలకు ఇబ్బంది తప్పడం లేదు.తహసీల్దార్ కార్యాలయం నుంచి తుమ్మలపెంట వైపు వెళ్లే వాహనాలు ఈ మార్గంలో వెళ్లేందుకు సమస్యలు ఎదురవుతున్నాయి.ట్రంకురోడ్డులో ఉన్న వాణిజ్య సముదాయాల ముందు పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. వాహనాలు సగం రోడ్డును ఆక్రమిస్తున్నాయి. దీంతో సాయంత్రం సమయంలో పాదచారులు నడకకు కూడా ఇక్కట్లు తప్పడం లేదు.
జాబితా తయారు చేస్తున్నాం
ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించేలా వ్యవహరించడం తగదు. నియమాలకు విరుద్ధంగా నిర్మించిన వాటి వివరాలతో జాబితా తయారు చేస్తున్నాం. ఇకపై ఎక్కడా ఇలా కట్టకుండా చూస్తాం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తాం.
కొట్టే బాబురావు, పట్టణ ప్రణాళికాధికారి, కావలి పురపాలక సంఘం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జోరుగా బేరాలు.. పట్టాల అమ్మకాలు!
[ 03-07-2024]
అయిదేళ్ల పాలనలో వైకాపా నాయకులు దోచుకోవడం.. దాచుకోవడమే పరమావధిగా రెచ్చిపోయారు. కన్నుపడిన స్థలాలు తక్షణం తమ అధీనంలోకి వెళ్లిపోవాలన్నట్లు వ్యవహరించారు. దేవాదాయశాఖ అధికారులు తమ భూమిగా పేర్కొంటూ.. -
జలమయం.. జనం భయం
[ 03-07-2024]
ఏటా నవంబరు, డిసెంబరు నెలల్లో కురిసే వర్షాలకు నెల్లూరు నగరం ముంపునకు గురవుతోంది. శాఖల మధ్య సమన్వయ లోపం పది లక్షల మంది ప్రజలకు శాపంగా పరిణమిస్తోంది. -
బస్సులో రూ.80 లక్షల చోరీ
[ 03-07-2024]
బస్సులో ప్రయాణిస్తున్న వ్యాపారుల దగ్గర రూ.80 లక్షల నగదును దొంగలు అపహరించారు. సోమవారం రాత్రి మద్దూరుపాడు వద్దనున్న ఓ దాబా సమీపంలో ఆగి ఉన్న బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. -
అనర్హులకు మత్స్యకార భరోసా
[ 03-07-2024]
వేట విరామ సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం ఇచ్చే మత్స్యకార భరోసాలో అనర్హులు పాగా వేశారు. దీని కింద ప్రభుత్వం రూ. పదివేలు ఇచ్చి ఆదుకుంటుండగా- సదరు జాబితాలో కొందరు వైకాపా నాయకులు మత్స్య వేట తెలియని వారి పేర్లు నమోదు చేయించారు. -
అనధికారిక మార్గం.. ప్రమాదాలకు నిలయం
[ 03-07-2024]
జాతీయ రహదారిపై అనధికారిక క్రాసింగ్లతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మంగళవారం ముసునూరు టోల్ప్లాజా సమీపంలో అలాంటి క్రాసింగ్ వద్దే పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. -
వీఆర్లో ఎన్సీఈఆర్టీ కార్యకలాపాలు
[ 03-07-2024]
నెల్లూరులో 150 సంవత్సరాలకు పైగా విద్యార్థులకు చదువులు నేర్పిన వీఆర్ కళాశాలలో త్వరలో ఎన్సీఈఆర్టీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. దీంతో తరగతి గదులు, భవనాలకు పూర్వ వైభవం రానుంది. -
ఆత్మకూరును ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: మంత్రి ఆనం
[ 03-07-2024]
ఆత్మకూరును ఆదర్శంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ శాఖామాత్యులు ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. -
ఆరు ఇళ్లల్లో చోరీ
[ 03-07-2024]
సంగంలో సోమవారం అర్ధరాత్రి వేళ ఆరు ఇళ్లలో చోరీ జరిగింది. దాంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. -
సంగం - చేజర్ల రహదారికి మహర్దశ
[ 03-07-2024]
జిల్లా మధ్యలో ఉత్తర, దక్షిణ భాగాలను అనుసంధానం చేసే పెన్నానది వంతెన అనుబంధ రహదారి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చొరవతో రూపుమారనుంది. -
సృజనాత్మకత.. నృత్య ఘనత
[ 03-07-2024]
ఇంటర్మీడియట్ పూర్తిచేసిన వాడరేవు శ్రీలయ భరతనాట్యంలో ప్రావీణ్యాన్ని సాధించింది. తల్లిదండ్రులు వీవీఆర్ ఫణీంద్రకుమార్, ప్రసూన కుమారి ప్రోత్సాహంతో నేర్చుకున్న నృత్యాన్ని పలు వేదికలపై ప్రదర్శించి ప్రశంసలు అందుకుంటుంది.