logo

పులి వాహనంపై ఆదిదంపతుల అభయం

మండలంలోని రామతీర్థంలో వెలసిన శ్రీకామాక్షిదేవి సమేత రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి స్వామి, అమ్మవార్లు పులి వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు.

Published : 01 Jul 2024 05:24 IST

విడవలూరు : మండలంలోని రామతీర్థంలో వెలసిన శ్రీకామాక్షిదేవి సమేత రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి స్వామి, అమ్మవార్లు పులి వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు. తొలుత స్వామి వారికి మహా రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆలయ ఈవో రామకృష్ణ, సిబ్బంది, బలిజ సంఘం సభ్యులు పాల్గొని కార్యక్రమాలు పర్యవేక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని