logo

గ్రామస్థులకు పరిహారం ఇవ్వాలి

మండలంలోని కర్లపాలెంలో మళ్లీ సర్వే చేసి నష్ట పరిహారం ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్‌. నరసింహారావు డిమాండ్‌ చేశారు.

Published : 01 Jul 2024 05:22 IST

గుడ్లూరు, న్యూస్‌టుడే: మండలంలోని కర్లపాలెంలో మళ్లీ సర్వే చేసి నష్ట పరిహారం ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్‌. నరసింహారావు డిమాండ్‌ చేశారు. ఆదివారం సర్పంచి చాపల రమణయ్య ఆధ్వర్యంలో గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ కర్లపాలెం వాసుల కోసం జెట్టీ నిర్మించాలన్నారు. చదువుకున్న వారందరికి ఓడరేవులో ఉద్యోగాలివ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జి.వెంకటేశ్వర్లు, ఎన్‌.వెంకటేశ్వర్లు, సురేంద్ర, మణి, ఏడుకొండలు, రాజేంద్ర,మీరయ్య తదితరులు పాల్గొన్నారు.


విశ్రాంత సమయం.. గుండెపోటుతో హఠాన్మరణం

వలేటివారిపాలెం, న్యూస్‌టుడే : ఆయన ఆదివారం ఉద్యోగ విరమణ చేయనున్నారు. దీనికి కొద్ది గంటల ముందు ప్రాణాలు కోల్పోయారు. ఈఘటన వలేటివారిపాలెంలో శనివారం జరిగింది. పొదిలి పట్టణానికి చెందిన సూరిబాబు (62) గ్రామంలో వీఆర్వోగా పనిచేస్తున్నారు. ఆదివారం ఉద్యోగ విరమణ చేయనున్నారు. దీంతో   ఘనంగా వీడ్కోలు చెప్పేందుకు తోటి ఉద్యోగులు ఏర్పాటుచేస్తున్నారు. శనివారం అర్ధరాత్రి తర్వాత అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. సహచర ఉద్యోగులు విషాదంలో మునిగిపోయారు. గుండెపోటుతో మృతి చెందినట్లు కుమారై సమాచారం ఇచ్చారని తహసీల్దారు నాగమల్లేశ్వరరావు తెలిపారు. స్వగ్రామమైన పొదిలికి మృతదేహాన్ని తరలించారని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు