గ్రామస్థులకు పరిహారం ఇవ్వాలి
మండలంలోని కర్లపాలెంలో మళ్లీ సర్వే చేసి నష్ట పరిహారం ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్. నరసింహారావు డిమాండ్ చేశారు.
గుడ్లూరు, న్యూస్టుడే: మండలంలోని కర్లపాలెంలో మళ్లీ సర్వే చేసి నష్ట పరిహారం ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్. నరసింహారావు డిమాండ్ చేశారు. ఆదివారం సర్పంచి చాపల రమణయ్య ఆధ్వర్యంలో గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ కర్లపాలెం వాసుల కోసం జెట్టీ నిర్మించాలన్నారు. చదువుకున్న వారందరికి ఓడరేవులో ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జి.వెంకటేశ్వర్లు, ఎన్.వెంకటేశ్వర్లు, సురేంద్ర, మణి, ఏడుకొండలు, రాజేంద్ర,మీరయ్య తదితరులు పాల్గొన్నారు.
విశ్రాంత సమయం.. గుండెపోటుతో హఠాన్మరణం
వలేటివారిపాలెం, న్యూస్టుడే : ఆయన ఆదివారం ఉద్యోగ విరమణ చేయనున్నారు. దీనికి కొద్ది గంటల ముందు ప్రాణాలు కోల్పోయారు. ఈఘటన వలేటివారిపాలెంలో శనివారం జరిగింది. పొదిలి పట్టణానికి చెందిన సూరిబాబు (62) గ్రామంలో వీఆర్వోగా పనిచేస్తున్నారు. ఆదివారం ఉద్యోగ విరమణ చేయనున్నారు. దీంతో ఘనంగా వీడ్కోలు చెప్పేందుకు తోటి ఉద్యోగులు ఏర్పాటుచేస్తున్నారు. శనివారం అర్ధరాత్రి తర్వాత అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. సహచర ఉద్యోగులు విషాదంలో మునిగిపోయారు. గుండెపోటుతో మృతి చెందినట్లు కుమారై సమాచారం ఇచ్చారని తహసీల్దారు నాగమల్లేశ్వరరావు తెలిపారు. స్వగ్రామమైన పొదిలికి మృతదేహాన్ని తరలించారని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జోరుగా బేరాలు.. పట్టాల అమ్మకాలు!
[ 03-07-2024]
అయిదేళ్ల పాలనలో వైకాపా నాయకులు దోచుకోవడం.. దాచుకోవడమే పరమావధిగా రెచ్చిపోయారు. కన్నుపడిన స్థలాలు తక్షణం తమ అధీనంలోకి వెళ్లిపోవాలన్నట్లు వ్యవహరించారు. దేవాదాయశాఖ అధికారులు తమ భూమిగా పేర్కొంటూ.. -
జలమయం.. జనం భయం
[ 03-07-2024]
ఏటా నవంబరు, డిసెంబరు నెలల్లో కురిసే వర్షాలకు నెల్లూరు నగరం ముంపునకు గురవుతోంది. శాఖల మధ్య సమన్వయ లోపం పది లక్షల మంది ప్రజలకు శాపంగా పరిణమిస్తోంది. -
బస్సులో రూ.80 లక్షల చోరీ
[ 03-07-2024]
బస్సులో ప్రయాణిస్తున్న వ్యాపారుల దగ్గర రూ.80 లక్షల నగదును దొంగలు అపహరించారు. సోమవారం రాత్రి మద్దూరుపాడు వద్దనున్న ఓ దాబా సమీపంలో ఆగి ఉన్న బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. -
అనర్హులకు మత్స్యకార భరోసా
[ 03-07-2024]
వేట విరామ సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం ఇచ్చే మత్స్యకార భరోసాలో అనర్హులు పాగా వేశారు. దీని కింద ప్రభుత్వం రూ. పదివేలు ఇచ్చి ఆదుకుంటుండగా- సదరు జాబితాలో కొందరు వైకాపా నాయకులు మత్స్య వేట తెలియని వారి పేర్లు నమోదు చేయించారు. -
అనధికారిక మార్గం.. ప్రమాదాలకు నిలయం
[ 03-07-2024]
జాతీయ రహదారిపై అనధికారిక క్రాసింగ్లతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మంగళవారం ముసునూరు టోల్ప్లాజా సమీపంలో అలాంటి క్రాసింగ్ వద్దే పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. -
వీఆర్లో ఎన్సీఈఆర్టీ కార్యకలాపాలు
[ 03-07-2024]
నెల్లూరులో 150 సంవత్సరాలకు పైగా విద్యార్థులకు చదువులు నేర్పిన వీఆర్ కళాశాలలో త్వరలో ఎన్సీఈఆర్టీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. దీంతో తరగతి గదులు, భవనాలకు పూర్వ వైభవం రానుంది. -
ఆత్మకూరును ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: మంత్రి ఆనం
[ 03-07-2024]
ఆత్మకూరును ఆదర్శంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ శాఖామాత్యులు ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. -
ఆరు ఇళ్లల్లో చోరీ
[ 03-07-2024]
సంగంలో సోమవారం అర్ధరాత్రి వేళ ఆరు ఇళ్లలో చోరీ జరిగింది. దాంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. -
సంగం - చేజర్ల రహదారికి మహర్దశ
[ 03-07-2024]
జిల్లా మధ్యలో ఉత్తర, దక్షిణ భాగాలను అనుసంధానం చేసే పెన్నానది వంతెన అనుబంధ రహదారి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చొరవతో రూపుమారనుంది. -
సృజనాత్మకత.. నృత్య ఘనత
[ 03-07-2024]
ఇంటర్మీడియట్ పూర్తిచేసిన వాడరేవు శ్రీలయ భరతనాట్యంలో ప్రావీణ్యాన్ని సాధించింది. తల్లిదండ్రులు వీవీఆర్ ఫణీంద్రకుమార్, ప్రసూన కుమారి ప్రోత్సాహంతో నేర్చుకున్న నృత్యాన్ని పలు వేదికలపై ప్రదర్శించి ప్రశంసలు అందుకుంటుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాన బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఇవే..
-
కోహ్లీతోపాటు నాకూ టికెట్ బుక్ చేయండి: ధోనీ సమాధానంపై పాక్ మాజీ షాక్
-
ఈ ఏడాది ప్రయోగాత్మక చిత్రాలు.. ఏ సినిమా ఏ ఓటీటీలో?
-
ఎంక్యూర్ ఫార్మా, బన్సల్ వైర్ ఐపీఓలు ప్రారంభం.. ₹2,700 కోట్ల సమీకరణ
-
బైడెన్ డిమెన్షియాను దాచిపెట్టారు..కమలా హ్యారిస్ ఆయన స్థానాన్ని భర్తీ చేయొచ్చు..!
-
పవన్ కల్యాణ్ చరిత్ర సృష్టించారు: పరుచూరి గోపాలకృష్ణ