తెల్లని రూపం.. సేవలకు ప్రతిరూపం
వైద్యులు దేవుడితో సమానమంటారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎందరికో ప్రాణభిక్ష పెడుతున్నారు. అలాంటి వారికి చేతులెత్తి నమస్కరిస్తుంటారు. కొందరు డాక్టర్లు నామమాత్రపు రుసుంతో వైద్య సేవలు అందిస్తున్నారు.
నేడు జాతీయ వైద్యుల దినోత్సవం
న్యూస్టుడే, నెల్లూరు(క్రీడలు), ఆత్మకూరు, కోవూరు
వైద్యులు దేవుడితో సమానమంటారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎందరికో ప్రాణభిక్ష పెడుతున్నారు. అలాంటి వారికి చేతులెత్తి నమస్కరిస్తుంటారు. కొందరు డాక్టర్లు నామమాత్రపు రుసుంతో వైద్య సేవలు అందిస్తున్నారు. ఇంకొందరు గ్రామాలు, పాఠశాలల్లో అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ వ్యాధులు దూరం చేస్తున్నారు. పలువురు పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తూ స్ఫూర్తిగా
నిలిచారు.
అవగాహన కార్యక్రమాల్లో దిట్ట
చైతన్య గీతాలు ఆలపిస్తున్న డాక్టరు శ్రీనునాయక్
నెల్లూరు డాక్టరు రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాలకు చెందిన డాక్టరు శ్రీనునాయక్ సేవాభావంతో వైద్యసేవలు అందిస్తున్నారు.. నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన తక్కువ ఖర్చుతో నమ్మకమైన వైద్యం అందించాలనే డాక్టరు రామచంద్రారెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రథమ చికిత్స గురించి పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రజారోగ్య చైతన్య గీతాలను స్వయంగా రచించి పాడి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజలు కాలానుగుణ వ్యాధుల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఆయన తన పాటల ద్వారా గ్రామాల్లో పర్యటించి వివరిస్తున్నారు. ప్రొజెక్టరు ద్వారా రాత్రుల్లో గ్రామాల్లో వైద్యం పట్ల అవగాహన కల్పిస్తున్నారు. మొక్కలు నాటి వాతావరణ కాలుష్యాన్ని నివారణలో చురుకుగా పాల్గొంటున్నారు. పాఠశాలల్లో సైన్స్ పాఠాలను గురించి వివరిస్తున్నారు. ఇప్పటివరకు రెండు వేల మొక్కలు నాటించారు. 60 గ్రామాల్లో, 150కి పైగా పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
సమాజ హితుడు
అవగాహన కార్యక్రమంలో డాక్టర్ కాలేషా
అల్లూరుకు చెందిన డాక్టర్ కాలేషా 2012 నుంచి జిల్లా ప్రభుత్వాస్పత్రిలో వైద్యులుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం అసోసియేట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. వృత్తిపరంగా పేరు సాధించి సమాజం కోసం తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ముఖ్యంగా ప్రజల్లో అజ్ఞానాన్ని తొలగించి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే ఈయన ముఖ్య ఉద్దేశం. ఇప్పటికీ అవగాహన కార్యక్రమాలు, రక్తదాన, వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 50కి పైగా ఉచిత వైద్య శిబిరాలు, 20కి పైగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు.
పేదలకు కార్పొరేట్ వైద్యం..
చికిత్స చేస్తున్న డాక్టర్ గౌస్బాషా
నెల్లూరులో చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ గౌస్బాషా కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తూనే వెంగళరావునగర్లోని సొంతిట్లోనే క్ల్లినిక్ ఏర్పాటు చేసుకున్నారు. కరోనా కష్టకాలంలోనూ ఆయన వైద్యసేవలుతో పాటు ఎంతో మందికి వాట్సాప్లోనే టెలీ మెడిసిన్ అందించారు. కరోనా సెకండ్ వేవ్లో చికిత్స అందించాల్సిన వైద్యులు పలువురు భయపడి ఇళ్లకే పరిమితమయ్యారు. గౌస్బాషా భయపడకుండా ఇంట్లోనే వైద్యం అందించారు. ఎంతో మంది చిన్నపిల్లలకు సేవలు చేశారు. డెంగీ వంటి విష జ్వరాల వైద్యానికి కార్పొరేట్ ఆసుపత్రుల్లో రూ.లక్షల్లో బిల్లులు అవుతాయి. ఇక్కడ నామమాత్రపు రుసుం తీసుకుని వ్యాధి నయంచేస్తారు.
40 వేల శస్త్రచికిత్సలు
ప్రభుత్వం రంగంలో డాక్టర్గా ఉన్న శార్వాణి.. సేవలు చేస్తూ ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం ఆత్మకూరు జిల్లా వైద్యశాలలో నేత్ర వైద్యురాలిగా ఉన్నారు. ప్రభుత్వ సేవలతో పాటు ఎన్జీవో, రోటరీ క్ల్లబ్ నెల్లూరు, సింహపురిసేవా సమితి ఆధ]్వర్యంలో చేపట్టే వైద్య శిబిరాలలో పేదలకు ఆపరేషన్లు చేస్తున్నారు. 18 సవవత్సరాల కాలంలో దాదాపు 40వేల శస్త్రచికిత్సలు చేశారు. ఉచిత కంటి వైద్య శిబిరాలలో సేవలు అందించినందుకు సన్మానాలు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు. సేవలకు గుర్తింపుగా 2016లో ఉత్తమ కంటి వైద్యసేవల అవార్డును అప్పటి మంత్రి నారాయణ చేతుల మీదుగా అందుకున్నారు. 2019, 2022లో ఉత్తమ సేవా పురస్కారాలు వరించాయి.
శార్వాణి, కంటి వైద్యనిపుణురాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జోరుగా బేరాలు.. పట్టాల అమ్మకాలు!
[ 03-07-2024]
అయిదేళ్ల పాలనలో వైకాపా నాయకులు దోచుకోవడం.. దాచుకోవడమే పరమావధిగా రెచ్చిపోయారు. కన్నుపడిన స్థలాలు తక్షణం తమ అధీనంలోకి వెళ్లిపోవాలన్నట్లు వ్యవహరించారు. దేవాదాయశాఖ అధికారులు తమ భూమిగా పేర్కొంటూ.. -
జలమయం.. జనం భయం
[ 03-07-2024]
ఏటా నవంబరు, డిసెంబరు నెలల్లో కురిసే వర్షాలకు నెల్లూరు నగరం ముంపునకు గురవుతోంది. శాఖల మధ్య సమన్వయ లోపం పది లక్షల మంది ప్రజలకు శాపంగా పరిణమిస్తోంది. -
బస్సులో రూ.80 లక్షల చోరీ
[ 03-07-2024]
బస్సులో ప్రయాణిస్తున్న వ్యాపారుల దగ్గర రూ.80 లక్షల నగదును దొంగలు అపహరించారు. సోమవారం రాత్రి మద్దూరుపాడు వద్దనున్న ఓ దాబా సమీపంలో ఆగి ఉన్న బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. -
అనర్హులకు మత్స్యకార భరోసా
[ 03-07-2024]
వేట విరామ సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం ఇచ్చే మత్స్యకార భరోసాలో అనర్హులు పాగా వేశారు. దీని కింద ప్రభుత్వం రూ. పదివేలు ఇచ్చి ఆదుకుంటుండగా- సదరు జాబితాలో కొందరు వైకాపా నాయకులు మత్స్య వేట తెలియని వారి పేర్లు నమోదు చేయించారు. -
అనధికారిక మార్గం.. ప్రమాదాలకు నిలయం
[ 03-07-2024]
జాతీయ రహదారిపై అనధికారిక క్రాసింగ్లతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మంగళవారం ముసునూరు టోల్ప్లాజా సమీపంలో అలాంటి క్రాసింగ్ వద్దే పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. -
వీఆర్లో ఎన్సీఈఆర్టీ కార్యకలాపాలు
[ 03-07-2024]
నెల్లూరులో 150 సంవత్సరాలకు పైగా విద్యార్థులకు చదువులు నేర్పిన వీఆర్ కళాశాలలో త్వరలో ఎన్సీఈఆర్టీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. దీంతో తరగతి గదులు, భవనాలకు పూర్వ వైభవం రానుంది. -
ఆత్మకూరును ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: మంత్రి ఆనం
[ 03-07-2024]
ఆత్మకూరును ఆదర్శంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ శాఖామాత్యులు ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. -
ఆరు ఇళ్లల్లో చోరీ
[ 03-07-2024]
సంగంలో సోమవారం అర్ధరాత్రి వేళ ఆరు ఇళ్లలో చోరీ జరిగింది. దాంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. -
సంగం - చేజర్ల రహదారికి మహర్దశ
[ 03-07-2024]
జిల్లా మధ్యలో ఉత్తర, దక్షిణ భాగాలను అనుసంధానం చేసే పెన్నానది వంతెన అనుబంధ రహదారి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చొరవతో రూపుమారనుంది. -
సృజనాత్మకత.. నృత్య ఘనత
[ 03-07-2024]
ఇంటర్మీడియట్ పూర్తిచేసిన వాడరేవు శ్రీలయ భరతనాట్యంలో ప్రావీణ్యాన్ని సాధించింది. తల్లిదండ్రులు వీవీఆర్ ఫణీంద్రకుమార్, ప్రసూన కుమారి ప్రోత్సాహంతో నేర్చుకున్న నృత్యాన్ని పలు వేదికలపై ప్రదర్శించి ప్రశంసలు అందుకుంటుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలు ఢీకొని వృద్ధుడి మృతి.. ఇంజిన్కు వేలాడుతూ వచ్చిన మృతదేహం
-
మదుపర్లకు మెయిల్ ద్వారానే ఖాతా స్టేట్మెంట్లు
-
ఆగస్టు 15 నుంచి వందే భారత్ స్లీపర్.. సికింద్రాబాద్, కాచిగూడ నుంచి నడపాలని ప్రతిపాదన
-
వందలో మరో చిరుత.. ఉసేన్ బోల్ట్ను గుర్తుచేస్తూ..
-
పిన్నెల్లితో ములాఖత్ కోసం 4న నెల్లూరు జైలుకు జగన్
-
నేడు దిల్లీకి చంద్రబాబు.. రేపు ప్రధాని మోదీతో భేటీ