కక్షిదారులకు శాశ్వత పరిష్కారమే లోక్అదాలత్ లక్ష్యం
కక్షిదారులకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా లోక్అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ ఛైర్పర్సన్ సి.యామిని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానం
లబ్ధిదారులకు రూ.6.35 కోట్ల పరిహారం
చెక్కు అందజేస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని, ఇతర జడ్జీలు
నెల్లూరు(లీగల్), న్యూస్టుడే: కక్షిదారులకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా లోక్అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ ఛైర్పర్సన్ సి.యామిని స్పష్టం చేశారు. జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల పిలుపు మేరకు.. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో శనివారం ఆమె లోక్అదాలత్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇరువర్గాలు రాజీ ప్రక్రియ ద్వారా తమ కేసులు పరిష్కరించుకుంటే సత్వర, సమ న్యాయం లభిస్తుందన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గూడూరు, కోవూరు, కావలి, వెంకటగిరి, కోట, నాయుడుపేట, సూళ్లూరుపేట, ఆత్మకూరు, ఉదయగిరి, నెల్లూరు నగరంలో నిర్వహించిన లోక్ అదాలత్లో మొత్తం 3,201 కేసులు పరిష్కారం కాగా.. రూ.6,35,46,217 మేర లబ్ధిదారులకు పరిహారం లభించింది. జిల్లా కోర్టు ఆవరణలో మొత్తం ఏడు బెంచ్లు ఏర్పాటు చేయగా.. న్యాయమూర్తులు జి.కబర్ధీ, ఎస్.శ్రీనివాస్, పి.భరద్వాజా, ఎల్.శారదారెడ్డి, జి.దేవిక, టి.భాస్కర్, టి.సుయోధన్, ఎన్.లావణ్య ప్రిసైడింగ్ అధికారులుగా వ్యవహరించారు. 1658 క్రిమినల్, సివిల్, మోటార్ వాహన ప్రమాద, కుటుంబ వివాదాలు, బ్యాంక్, ఫైనాన్స్ తదితర కేసులు పరిష్కరించారు. జాతీయ లోక్అదాలత్లో కేసుల పరిష్కారంలో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానం పొందింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జోరుగా బేరాలు.. పట్టాల అమ్మకాలు!
[ 03-07-2024]
అయిదేళ్ల పాలనలో వైకాపా నాయకులు దోచుకోవడం.. దాచుకోవడమే పరమావధిగా రెచ్చిపోయారు. కన్నుపడిన స్థలాలు తక్షణం తమ అధీనంలోకి వెళ్లిపోవాలన్నట్లు వ్యవహరించారు. దేవాదాయశాఖ అధికారులు తమ భూమిగా పేర్కొంటూ.. -
జలమయం.. జనం భయం
[ 03-07-2024]
ఏటా నవంబరు, డిసెంబరు నెలల్లో కురిసే వర్షాలకు నెల్లూరు నగరం ముంపునకు గురవుతోంది. శాఖల మధ్య సమన్వయ లోపం పది లక్షల మంది ప్రజలకు శాపంగా పరిణమిస్తోంది. -
బస్సులో రూ.80 లక్షల చోరీ
[ 03-07-2024]
బస్సులో ప్రయాణిస్తున్న వ్యాపారుల దగ్గర రూ.80 లక్షల నగదును దొంగలు అపహరించారు. సోమవారం రాత్రి మద్దూరుపాడు వద్దనున్న ఓ దాబా సమీపంలో ఆగి ఉన్న బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. -
అనర్హులకు మత్స్యకార భరోసా
[ 03-07-2024]
వేట విరామ సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం ఇచ్చే మత్స్యకార భరోసాలో అనర్హులు పాగా వేశారు. దీని కింద ప్రభుత్వం రూ. పదివేలు ఇచ్చి ఆదుకుంటుండగా- సదరు జాబితాలో కొందరు వైకాపా నాయకులు మత్స్య వేట తెలియని వారి పేర్లు నమోదు చేయించారు. -
అనధికారిక మార్గం.. ప్రమాదాలకు నిలయం
[ 03-07-2024]
జాతీయ రహదారిపై అనధికారిక క్రాసింగ్లతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మంగళవారం ముసునూరు టోల్ప్లాజా సమీపంలో అలాంటి క్రాసింగ్ వద్దే పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. -
వీఆర్లో ఎన్సీఈఆర్టీ కార్యకలాపాలు
[ 03-07-2024]
నెల్లూరులో 150 సంవత్సరాలకు పైగా విద్యార్థులకు చదువులు నేర్పిన వీఆర్ కళాశాలలో త్వరలో ఎన్సీఈఆర్టీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. దీంతో తరగతి గదులు, భవనాలకు పూర్వ వైభవం రానుంది. -
ఆత్మకూరును ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: మంత్రి ఆనం
[ 03-07-2024]
ఆత్మకూరును ఆదర్శంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ శాఖామాత్యులు ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. -
ఆరు ఇళ్లల్లో చోరీ
[ 03-07-2024]
సంగంలో సోమవారం అర్ధరాత్రి వేళ ఆరు ఇళ్లలో చోరీ జరిగింది. దాంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. -
సంగం - చేజర్ల రహదారికి మహర్దశ
[ 03-07-2024]
జిల్లా మధ్యలో ఉత్తర, దక్షిణ భాగాలను అనుసంధానం చేసే పెన్నానది వంతెన అనుబంధ రహదారి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చొరవతో రూపుమారనుంది. -
సృజనాత్మకత.. నృత్య ఘనత
[ 03-07-2024]
ఇంటర్మీడియట్ పూర్తిచేసిన వాడరేవు శ్రీలయ భరతనాట్యంలో ప్రావీణ్యాన్ని సాధించింది. తల్లిదండ్రులు వీవీఆర్ ఫణీంద్రకుమార్, ప్రసూన కుమారి ప్రోత్సాహంతో నేర్చుకున్న నృత్యాన్ని పలు వేదికలపై ప్రదర్శించి ప్రశంసలు అందుకుంటుంది.