బడి భోజనంపై ఆరా!
నెల్లూరు నగరం జెండా వీధిలోని పీఎన్ఎంసీ ఉన్నత పాఠశాలలో 396 మంది విద్యార్థులు ఉండగా- ఈ నెల 26వ తేదీ 275 మంది హాజరయ్యారు. వీరిలో మధ్యాహ్న భోజనం తిన్నది 48 మందే.. అంటే, హాజరైన విద్యార్థుల్లో 17 శాతం మందే బడిలో పెట్టే భోజనం తిన్నారు.
తక్కువ శాతం నమోదుపై ప్రభుత్వం దృష్టి
50 పాఠశాలలకు షోకాజ్ నోటీసులు
నెల్లూరు నగరం జెండా వీధిలోని పీఎన్ఎంసీ ఉన్నత పాఠశాలలో 396 మంది విద్యార్థులు ఉండగా- ఈ నెల 26వ తేదీ 275 మంది హాజరయ్యారు. వీరిలో మధ్యాహ్న భోజనం తిన్నది 48 మందే.. అంటే, హాజరైన విద్యార్థుల్లో 17 శాతం మందే బడిలో పెట్టే భోజనం తిన్నారు.
బీవీనగర్లోని కేఎన్ఆర్ ఎంసీహెచ్ పాఠశాలలో 1539 మంది చదువుతుండగా- గత బుధవారం 73శాతం అంటే.. 1131 మంది హాజరయ్యారు. వీరిలో 254 మంది మాత్రమే భోజనం చేశారు. మిగిలిన వారిలో చాలా మంది ఇళ్లకు వెళ్లగా.. దూరాభారం ఉన్నవారు క్యారేజీలు తెచ్చుకుని.. అక్కడే తిన్నారు.
ఈనాడు, నెల్లూరు: విద్య, న్యూస్టుడే: పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తినేందుకు చాలాచోట్ల విద్యార్థులు ఇష్టపడటం లేదు. మెనూలో అనేక మార్పులు చేశామని గత ప్రభుత్వం గొప్పలు చెప్పినా.. క్షేత్రస్థాయిలో అది ప్రతిఫలించడం లేదు. అన్నం మెత్తగా, చప్పగా, ముద్దగా ఉంటోందని, తింటే కడుపు నొప్పి వస్తోందంటూ.. చాలా మంది పిల్లలు పాఠశాలల్లో భోజనం చేయడం లేదు. ఇంటి నుంచే తెచ్చుకుంటున్నారు. కొన్నిచోట్ల తల్లులే క్యారేజీలు తెచ్చి తినిపిస్తున్నారు. 90 శాతానికిపైగా పిల్లలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఆ సంఖ్య తక్కువగానే ఉంటోంది. విద్యార్థుల హాజరుతో పాటే.. భోజనం తినేవారి సంఖ్యను ఆన్లైన్లో తీసుకుంటున్నారు. ఆ క్రమంలో కొన్నిచోట్ల పిల్లలను అడిగి హాజరువేస్తుండగా.. మరికొన్ని చోట్ల హాజరైన వారిలో ఎంతో కొంత తగ్గించి.. సంఖ్య పంపిస్తున్నారు. భోజనం చేసేవారి సంఖ్య తగ్గితే ఉపాధ్యాయులను వివరణ కోరే పరిస్థితి ఉండటంతో.. కొందరు కచ్చితంగా నమోదు చేయడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ పరిస్థితిపై ఆరా తీస్తోంది. పాఠశాలల్లో భోజనం చేసేవారి సంఖ్య తగ్గితే.. దానికి కారణాలు తెలుసుకుంటోంది. ప్రతి విద్యార్థికి నాణ్యమైన భోజనం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో.. అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
వివరణ కోరుతూ...
జిల్లాలో మొత్తం 2,879 పాఠశాలలు ఉండగా- సుమారు 1.20 లక్షల మంది విద్యార్థులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీరిలో శనివారం 1,08,713 మంది హాజరు కాగా, 1,05,272 మంది మధ్యాహ్న భోజనం తిన్నట్లు అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంటోందనే విమర్శలు నెలకొన్నాయి. ఈ నెల 26వ తేదీ మధ్యాహ్న భోజనానికి సంబంధించిన డ్యాష్బోర్డులో పాఠశాలలకు హాజరైన విద్యార్థుల్లో 90 శాతం కంటే తక్కువ మంది భోజనం చేసిన పాఠశాలలను విద్యాశాఖాధికారులు గుర్తించారు. దానిపై పూర్తి వివరాలతో వివరణ ఇవ్వాలని డీఈవో పీవీజే రామారావు ఆయా పాఠశాలలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సంతృప్తికర వివరణ లేకపోతే.. తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
దీనిపై డీఈవో పీవీజే రామారావు వివరణ కోరగా.. పాఠశాలకు హాజరైన ప్రతి విద్యార్థి అక్కడే భోజనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా తినేవారి సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలను గుర్తించి.. షోకాజ్ నోటీసులు ఇచ్చాం. వారి నుంచి వివరణ తీసుకున్న తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం. ఆహారం విషయంలో నాణ్యత పాటించకపోతే.. కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జోరుగా బేరాలు.. పట్టాల అమ్మకాలు!
[ 03-07-2024]
అయిదేళ్ల పాలనలో వైకాపా నాయకులు దోచుకోవడం.. దాచుకోవడమే పరమావధిగా రెచ్చిపోయారు. కన్నుపడిన స్థలాలు తక్షణం తమ అధీనంలోకి వెళ్లిపోవాలన్నట్లు వ్యవహరించారు. దేవాదాయశాఖ అధికారులు తమ భూమిగా పేర్కొంటూ.. -
జలమయం.. జనం భయం
[ 03-07-2024]
ఏటా నవంబరు, డిసెంబరు నెలల్లో కురిసే వర్షాలకు నెల్లూరు నగరం ముంపునకు గురవుతోంది. శాఖల మధ్య సమన్వయ లోపం పది లక్షల మంది ప్రజలకు శాపంగా పరిణమిస్తోంది. -
బస్సులో రూ.80 లక్షల చోరీ
[ 03-07-2024]
బస్సులో ప్రయాణిస్తున్న వ్యాపారుల దగ్గర రూ.80 లక్షల నగదును దొంగలు అపహరించారు. సోమవారం రాత్రి మద్దూరుపాడు వద్దనున్న ఓ దాబా సమీపంలో ఆగి ఉన్న బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. -
అనర్హులకు మత్స్యకార భరోసా
[ 03-07-2024]
వేట విరామ సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం ఇచ్చే మత్స్యకార భరోసాలో అనర్హులు పాగా వేశారు. దీని కింద ప్రభుత్వం రూ. పదివేలు ఇచ్చి ఆదుకుంటుండగా- సదరు జాబితాలో కొందరు వైకాపా నాయకులు మత్స్య వేట తెలియని వారి పేర్లు నమోదు చేయించారు. -
అనధికారిక మార్గం.. ప్రమాదాలకు నిలయం
[ 03-07-2024]
జాతీయ రహదారిపై అనధికారిక క్రాసింగ్లతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మంగళవారం ముసునూరు టోల్ప్లాజా సమీపంలో అలాంటి క్రాసింగ్ వద్దే పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. -
వీఆర్లో ఎన్సీఈఆర్టీ కార్యకలాపాలు
[ 03-07-2024]
నెల్లూరులో 150 సంవత్సరాలకు పైగా విద్యార్థులకు చదువులు నేర్పిన వీఆర్ కళాశాలలో త్వరలో ఎన్సీఈఆర్టీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. దీంతో తరగతి గదులు, భవనాలకు పూర్వ వైభవం రానుంది. -
ఆత్మకూరును ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: మంత్రి ఆనం
[ 03-07-2024]
ఆత్మకూరును ఆదర్శంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ శాఖామాత్యులు ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. -
ఆరు ఇళ్లల్లో చోరీ
[ 03-07-2024]
సంగంలో సోమవారం అర్ధరాత్రి వేళ ఆరు ఇళ్లలో చోరీ జరిగింది. దాంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. -
సంగం - చేజర్ల రహదారికి మహర్దశ
[ 03-07-2024]
జిల్లా మధ్యలో ఉత్తర, దక్షిణ భాగాలను అనుసంధానం చేసే పెన్నానది వంతెన అనుబంధ రహదారి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చొరవతో రూపుమారనుంది. -
సృజనాత్మకత.. నృత్య ఘనత
[ 03-07-2024]
ఇంటర్మీడియట్ పూర్తిచేసిన వాడరేవు శ్రీలయ భరతనాట్యంలో ప్రావీణ్యాన్ని సాధించింది. తల్లిదండ్రులు వీవీఆర్ ఫణీంద్రకుమార్, ప్రసూన కుమారి ప్రోత్సాహంతో నేర్చుకున్న నృత్యాన్ని పలు వేదికలపై ప్రదర్శించి ప్రశంసలు అందుకుంటుంది.