దుర్గం కొండపై అటవీ శాఖ కూంబింగ్
పట్టణంలోని దుర్గంకొండపై వారం రోజులుగా కూంబింగ్ నిర్వహిస్తున్న అటవీశాఖ అధికారులు... శనివారం గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల తవ్వకాల కోసం దాచి ఉంచిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
గుప్త నిధుల తవ్వకాల సామగ్రి స్వాధీనం
స్వాధీనం చేసుకున్న సామగ్రితో రేంజి అధికారి ఉమామహేశ్వరరెడ్డి, సిబ్బంది
ఉదయగిరి, న్యూస్టుడే: పట్టణంలోని దుర్గంకొండపై వారం రోజులుగా కూంబింగ్ నిర్వహిస్తున్న అటవీశాఖ అధికారులు... శనివారం గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల తవ్వకాల కోసం దాచి ఉంచిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక రేంజి కార్యాలయంలో అధికారి తుమ్మల ఉమామహేశ్వరరెడ్డి ఆ వివరాలు వెల్లడించారు. యాత్రికులు, పర్యాటకుల రూపంలో కొందరు రిజర్వు అటవీ ప్రాంతంలో దుర్గం కొండపై గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తున్నారన్నారు. దానిపై సమాచారం రావడంతో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. పెద్ద మసీదు సమీపంలోని కోనేరులో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేసిన విషయాన్ని కూంబింగ్లో గుర్తించామన్నారు. దానికి కొంత దూరంలో రాళ్ల గుట్ట వద్ద వద్ద తవ్వకాల కోసం తెచ్చి దాచి ఉంచిన డ్రిల్లింగ్ యంత్రాలు, సమ్మెట తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పురావస్తుశాఖ, పోలీసుల సమన్వయంతో కేసు నమోదు చేస్తున్నామని తెలిపారు. తవ్వకాల విషయంలో స్థానికులపై అనుమానం ఉందని, వారికి నోటీసులు జారీ చేసి విచారణ చేస్తామన్నారు. కార్యక్రమంలో డీఆర్వోలు శ్రీనివాసులు, ప్రసాద్, ఎఫ్బీవోలు నాయబ్, చిన్నపరెడ్డి, ప్రసాద్, లక్ష్మీప్రసన్న, ఏబీవో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జోరుగా బేరాలు.. పట్టాల అమ్మకాలు!
[ 03-07-2024]
అయిదేళ్ల పాలనలో వైకాపా నాయకులు దోచుకోవడం.. దాచుకోవడమే పరమావధిగా రెచ్చిపోయారు. కన్నుపడిన స్థలాలు తక్షణం తమ అధీనంలోకి వెళ్లిపోవాలన్నట్లు వ్యవహరించారు. దేవాదాయశాఖ అధికారులు తమ భూమిగా పేర్కొంటూ.. -
జలమయం.. జనం భయం
[ 03-07-2024]
ఏటా నవంబరు, డిసెంబరు నెలల్లో కురిసే వర్షాలకు నెల్లూరు నగరం ముంపునకు గురవుతోంది. శాఖల మధ్య సమన్వయ లోపం పది లక్షల మంది ప్రజలకు శాపంగా పరిణమిస్తోంది. -
బస్సులో రూ.80 లక్షల చోరీ
[ 03-07-2024]
బస్సులో ప్రయాణిస్తున్న వ్యాపారుల దగ్గర రూ.80 లక్షల నగదును దొంగలు అపహరించారు. సోమవారం రాత్రి మద్దూరుపాడు వద్దనున్న ఓ దాబా సమీపంలో ఆగి ఉన్న బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. -
అనర్హులకు మత్స్యకార భరోసా
[ 03-07-2024]
వేట విరామ సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం ఇచ్చే మత్స్యకార భరోసాలో అనర్హులు పాగా వేశారు. దీని కింద ప్రభుత్వం రూ. పదివేలు ఇచ్చి ఆదుకుంటుండగా- సదరు జాబితాలో కొందరు వైకాపా నాయకులు మత్స్య వేట తెలియని వారి పేర్లు నమోదు చేయించారు. -
అనధికారిక మార్గం.. ప్రమాదాలకు నిలయం
[ 03-07-2024]
జాతీయ రహదారిపై అనధికారిక క్రాసింగ్లతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మంగళవారం ముసునూరు టోల్ప్లాజా సమీపంలో అలాంటి క్రాసింగ్ వద్దే పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. -
వీఆర్లో ఎన్సీఈఆర్టీ కార్యకలాపాలు
[ 03-07-2024]
నెల్లూరులో 150 సంవత్సరాలకు పైగా విద్యార్థులకు చదువులు నేర్పిన వీఆర్ కళాశాలలో త్వరలో ఎన్సీఈఆర్టీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. దీంతో తరగతి గదులు, భవనాలకు పూర్వ వైభవం రానుంది. -
ఆత్మకూరును ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: మంత్రి ఆనం
[ 03-07-2024]
ఆత్మకూరును ఆదర్శంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ శాఖామాత్యులు ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. -
ఆరు ఇళ్లల్లో చోరీ
[ 03-07-2024]
సంగంలో సోమవారం అర్ధరాత్రి వేళ ఆరు ఇళ్లలో చోరీ జరిగింది. దాంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. -
సంగం - చేజర్ల రహదారికి మహర్దశ
[ 03-07-2024]
జిల్లా మధ్యలో ఉత్తర, దక్షిణ భాగాలను అనుసంధానం చేసే పెన్నానది వంతెన అనుబంధ రహదారి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చొరవతో రూపుమారనుంది. -
సృజనాత్మకత.. నృత్య ఘనత
[ 03-07-2024]
ఇంటర్మీడియట్ పూర్తిచేసిన వాడరేవు శ్రీలయ భరతనాట్యంలో ప్రావీణ్యాన్ని సాధించింది. తల్లిదండ్రులు వీవీఆర్ ఫణీంద్రకుమార్, ప్రసూన కుమారి ప్రోత్సాహంతో నేర్చుకున్న నృత్యాన్ని పలు వేదికలపై ప్రదర్శించి ప్రశంసలు అందుకుంటుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే.. మెగా డీఎస్సీకి ఫీజు మినహాయింపు
-
మరోసారి కూలిన ఓడేడ్ వంతెన గడ్డర్లు
-
ఆ రోజు ఫోన్ చేసి నన్నాపింది రోహితే: ద్రవిడ్
-
ఎమ్మెల్యే కొలికపూడి అత్యుత్సాహం
-
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. పోలీసుల అదుపులో నిందితులు
-
జగన్ బినామీ స్వరూపానందేంద్ర: పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి