బ్యాంకర్ల ఒత్తిడి.. లబ్ధిదారుల కంటతడి
బ్యాంకర్ల ఒత్తిడితో ఆత్మకూరు టిడ్కో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. పట్టణంలో గతంలో తెదేపా ప్రభుత్వం 1,056 గృహాలు నిర్మించింది. 2019 ఎన్నికల్లో వీటిని ఉచితంగా ఇస్తామని వైకాపా హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చినా.. ఇవ్వకుండా మూడేళ్లు కాలయాపన చేసింది.
ఆందోళన చేస్తున్న లబ్ధిదారులు
ఆత్మకూరు, న్యూస్టుడే: బ్యాంకర్ల ఒత్తిడితో ఆత్మకూరు టిడ్కో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. పట్టణంలో గతంలో తెదేపా ప్రభుత్వం 1,056 గృహాలు నిర్మించింది. 2019 ఎన్నికల్లో వీటిని ఉచితంగా ఇస్తామని వైకాపా హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చినా.. ఇవ్వకుండా మూడేళ్లు కాలయాపన చేసింది. లబ్ధిదారుల ఆందోళనతో చివరికి పంపిణీ చేసింది. లబ్ధిదారులు 430చదరపు అడుగుల ఇళ్లకు మొదట రూ.లక్ష చెల్లించారు. ఆ డిపాజిట్ను రూ.50వేలకు వైకాపా ప్రభుత్వం తగ్గించింది. రూ.లక్ష చెల్లించిన వారికి తగ్గించిన మొత్తం ఇప్పటి వరకు తిరిగివ్వలేదు. 430 చదరపు అడుగుల ఇళ్లను ఇచ్చేందుకు రూ.3,65,000 రుణాలు బ్యాంకర్లు ఇచ్చారు. అప్పటి నుంచి లబ్ధిదారులు తాము కట్టిన డబ్బులో మిగిలిన రూ.50వేలు అప్పునకు జమ చేసుకోవాలని కోరుతూనే ఉన్నారు. అయినా, పట్టించుకోవడం లేదు. 365 చదరపు అడుగుల గృహాలకు రూ.3,15,000 బ్యాంకర్లు రుణాలిచ్చారు. వీటికి రూ.50వేలు డిపాజిట్గా కొందరు కట్టారు. దాన్ని రూ.25వేలకు తగ్గించినట్లు వైకాపా ప్రభుత్వం చెప్పింది. రూ 50వేలు కట్టిన వారి సొమ్ము తిరిగివ్వలేదు. ఇలా చెల్లించిన సొమ్ము బ్యాంకు బకాయిలకు జమ చేయాలని కోరినా.. లబ్ధిదారుల మొర వినే నాథులే లేరు. మరోవైపు గృహాలపై అప్పు ఇచ్చిన బ్యాంకర్లు వాయిదాలకు ఒత్తిడి చేయడం అధికమైంది.
కూటమి నాయకుల హామీలపై ఆశలు
ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో వీరిని ఆదుకుంటామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రావడంతో తమ కష్టాలు తీరేలా వెసులుబాటు ఇస్తుందని లబ్ధిదారులు ఆశిస్తున్నారు. ప్రభుత్వం ఇంకా ఈ గృహాలపై తన విధానం ప్రకటించలేదు. శుక్రవారం కొందరు బ్యాంకర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వచ్చి.. బకాయిలు చెల్లించాలని ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో శుక్ర, శనివారాల్లో ఆందోళన చేశారు. కొందరు రూ.300 ఉన్నాయని చెప్పడంతో.. ఆ కొద్ది మొత్తాన్ని కూడా కట్టించుకున్నారు. రూ.3,65,000 రుణాలు తీసుకొన్న కొందరు రూ.50వేల వరకు చెల్లించినప్పటికీ.. బకాయి మొత్తం అలాగే చూపుతుండడం గమనార్హం.
ప్రభుత్వం ఆదుకోవాలి: వి. వజ్రమ్మ
465చదరపు అడుగల గృహానికి మొదట డిపాజిట్గా రూ.లక్ష చెల్లించా. డిపాజిట్ రూ.50వేలకు తగ్గించినా మాకు రూ.50వేలు తిరిగివ్వలేదు. బ్యాంకర్లు ఒత్తిడి చేస్తున్నారు. కొందరు బకాయి డబ్బులు చెల్లించినా.. అది వడ్డీకి సరిపోతుందని చెబుతున్నారు. ఇలా అయితే అప్పు తీరేదెలా?. తెదేపా ప్రభుత్వం మా కష్టాలు తీరుస్తుందనే ఆశతో ఉన్నాం.
చర్యలు చేపడతాం: ఫజిల్లుల్లా
టిడ్కో కాలనీవాసులపై బ్యాంకర్ల ఒత్తిడి విషయం తెలియదు. క్షేత్ర స్థాయిలో విచారణ చేస్తాం. ప్రభుత్వానికి తెలియపరిచి.. కాలనీవాసులను ఆదుకునేలా చర్యలు చేపడతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జోరుగా బేరాలు.. పట్టాల అమ్మకాలు!
[ 03-07-2024]
అయిదేళ్ల పాలనలో వైకాపా నాయకులు దోచుకోవడం.. దాచుకోవడమే పరమావధిగా రెచ్చిపోయారు. కన్నుపడిన స్థలాలు తక్షణం తమ అధీనంలోకి వెళ్లిపోవాలన్నట్లు వ్యవహరించారు. దేవాదాయశాఖ అధికారులు తమ భూమిగా పేర్కొంటూ.. -
జలమయం.. జనం భయం
[ 03-07-2024]
ఏటా నవంబరు, డిసెంబరు నెలల్లో కురిసే వర్షాలకు నెల్లూరు నగరం ముంపునకు గురవుతోంది. శాఖల మధ్య సమన్వయ లోపం పది లక్షల మంది ప్రజలకు శాపంగా పరిణమిస్తోంది. -
బస్సులో రూ.80 లక్షల చోరీ
[ 03-07-2024]
బస్సులో ప్రయాణిస్తున్న వ్యాపారుల దగ్గర రూ.80 లక్షల నగదును దొంగలు అపహరించారు. సోమవారం రాత్రి మద్దూరుపాడు వద్దనున్న ఓ దాబా సమీపంలో ఆగి ఉన్న బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. -
అనర్హులకు మత్స్యకార భరోసా
[ 03-07-2024]
వేట విరామ సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం ఇచ్చే మత్స్యకార భరోసాలో అనర్హులు పాగా వేశారు. దీని కింద ప్రభుత్వం రూ. పదివేలు ఇచ్చి ఆదుకుంటుండగా- సదరు జాబితాలో కొందరు వైకాపా నాయకులు మత్స్య వేట తెలియని వారి పేర్లు నమోదు చేయించారు. -
అనధికారిక మార్గం.. ప్రమాదాలకు నిలయం
[ 03-07-2024]
జాతీయ రహదారిపై అనధికారిక క్రాసింగ్లతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మంగళవారం ముసునూరు టోల్ప్లాజా సమీపంలో అలాంటి క్రాసింగ్ వద్దే పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. -
వీఆర్లో ఎన్సీఈఆర్టీ కార్యకలాపాలు
[ 03-07-2024]
నెల్లూరులో 150 సంవత్సరాలకు పైగా విద్యార్థులకు చదువులు నేర్పిన వీఆర్ కళాశాలలో త్వరలో ఎన్సీఈఆర్టీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. దీంతో తరగతి గదులు, భవనాలకు పూర్వ వైభవం రానుంది. -
ఆత్మకూరును ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: మంత్రి ఆనం
[ 03-07-2024]
ఆత్మకూరును ఆదర్శంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ శాఖామాత్యులు ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. -
ఆరు ఇళ్లల్లో చోరీ
[ 03-07-2024]
సంగంలో సోమవారం అర్ధరాత్రి వేళ ఆరు ఇళ్లలో చోరీ జరిగింది. దాంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. -
సంగం - చేజర్ల రహదారికి మహర్దశ
[ 03-07-2024]
జిల్లా మధ్యలో ఉత్తర, దక్షిణ భాగాలను అనుసంధానం చేసే పెన్నానది వంతెన అనుబంధ రహదారి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చొరవతో రూపుమారనుంది. -
సృజనాత్మకత.. నృత్య ఘనత
[ 03-07-2024]
ఇంటర్మీడియట్ పూర్తిచేసిన వాడరేవు శ్రీలయ భరతనాట్యంలో ప్రావీణ్యాన్ని సాధించింది. తల్లిదండ్రులు వీవీఆర్ ఫణీంద్రకుమార్, ప్రసూన కుమారి ప్రోత్సాహంతో నేర్చుకున్న నృత్యాన్ని పలు వేదికలపై ప్రదర్శించి ప్రశంసలు అందుకుంటుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పిన్నెల్లితో ములాఖత్ కోసం 4న నెల్లూరు జైలుకు జగన్
-
నేడు దిల్లీకి చంద్రబాబు.. రేపు ప్రధాని మోదీతో భేటీ
-
మళ్లీ మనమే వస్తాం.. ఈసారి 15 ఏళ్లు ఉంటాం: కేసీఆర్
-
ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే.. మెగా డీఎస్సీకి ఫీజు మినహాయింపు: మంత్రి నారా లోకేశ్
-
మరోసారి కూలిన ఓడేడ్ వంతెన గడ్డర్లు
-
ఆ రోజు ఫోన్ చేసి నన్నాపింది రోహితే: ద్రవిడ్