logo

చెన్నాయపాలెంలో హైకోర్టు న్యాయమూర్తి

మండలంలోని చెన్నాయపాలెంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మన్మథరావు శనివారం పర్యటించారు. గ్రామంలోని పాఠశాల ఉపాధ్యాయులు రామారావు ఉద్యోగ విరమణ వేడుకల్లో పాల్గొన్నారు.

Published : 30 Jun 2024 02:50 IST

మాట్లాడుతున్న న్యాయమూర్తి మన్మథ]రావు 

కావలి గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని చెన్నాయపాలెంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మన్మథరావు శనివారం పర్యటించారు. గ్రామంలోని పాఠశాల ఉపాధ్యాయులు రామారావు ఉద్యోగ విరమణ వేడుకల్లో పాల్గొన్నారు. అందరూ మొక్కలు నాటి చెట్లుగా ఎదిగేలా కృషి చేయాలన్నారు. కావలి సీనియర్‌ జడ్జి ఎం.శోభ, ఎంఈవోలు గోవిందయ్య, వెంకటసుబ్బయ్య, పాఠశాల హెచ్‌ఎం రంగాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

మర్రిపాడు : రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం పాలైన సంఘటన మర్రిపాడులో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు మర్రిపాడుకు చెందిన షేక్‌ సైదుల్లా (24) రోడ్డు దాటుతున్నారు. ఈ క్రమంలో బద్వేలు వైపు నుంచి నెల్లూరు వెళుతున్న లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సైదుల్లాను స్థానికులు వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రథమ చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం నిమిత్తం ఆత్మకూరు జిల్లా ఆసుప్రతికి రెఫర్‌ చేశారు. అక్కడ చిక్సిత పొందుతూ యువకుడు మృతి చెందారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు