ఆగస్టు నాటికి... రైల్వే పనులు పూర్తయ్యేనా?
నెల్లూరు నగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు కొనసాగుతూనే ఉన్నాయి. రోజుకు 30వేల మంది ప్రయాణికులు.. సుమారు వంద రైళ్లు నిలిచే ఈ రద్దీ స్టేషన్లో చేపట్టిన ప్రగతి పనులు ఆగస్టు నాటికి పూర్తయ్యేనా అన్న సందేహం కలుగుతోంది.
న్యూస్టుడే, నెల్లూరు(రైల్వేస్టేషన్)
స్టేషన్ పడమర వైపు ప్రధాన భవనానికి ఇరువైపులా కొత్త నిర్మాణాలు
నెల్లూరు నగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు కొనసాగుతూనే ఉన్నాయి. రోజుకు 30వేల మంది ప్రయాణికులు.. సుమారు వంద రైళ్లు నిలిచే ఈ రద్దీ స్టేషన్లో చేపట్టిన ప్రగతి పనులు ఆగస్టు నాటికి పూర్తయ్యేనా అన్న సందేహం కలుగుతోంది. రైల్వే అధికారుల లెక్కల ప్రకారం.. ఈ ఏడాది మే చివరి నాటికే ఇవి పూర్తి కావాల్సి ఉంది. ఆగస్టు వరకు గడువు పెంచారు. ఇప్పటికి 70 శాతమే పూర్తయ్యాయని.. మరో 30శాతం జరగాల్సి ఉందని తెలుస్తోంది.
రూ.102 కోట్లతో..
విజయవాడ డివిజన్ పరిధిలో అత్యధిక ప్రయాణికులతో రాకపోకలు సాగించే నెల్లూరు రైల్వేస్టేషన్ను రూ. 102 కోట్లతో ప్రపంచస్థాయి వసతులతో ఆధునికీకరించాలని నిర్ణయించారు. 2024, మే నాటికి పూర్తి చేయాలని నిర్ణయించగా.. ఇప్పటి వరకు ప్రభుత్వ రైల్వే భవనం పూర్తిస్థాయిలో నిర్మించారు. మొదటి నుంచి నాలుగో ఫ్లాట్ఫారం వరకు నిర్మించనున్న అండర్ బ్రిడ్జి నిర్మాణాలు కొనసాగుతున్నాయి. రెండు, మూడు ఫ్లాట్ఫారాల్లో జరుగుతున్న పనులు ఇంకా కొలిక్కిరాలేదు. ఒకటో నంబరు ఫ్లాట్ఫారంలో స్టేషన్మాస్టర్, సూపరింటెండెంట్ కార్యాలయాలు కడుతున్నారు. తూర్పు, పడమర వైపున్న భవనాలతో పాటు అదనంగా కొత్తవి నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఎయిర్ కాంకర్స్ పనులు ఇంకా సాగుతూనే ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే వ్యాపార సంస్థలు వెలిసే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేస్తే.. ఇబ్బందులు తొలగుతాయని ప్రయాణికులు కోరుతున్నారు. దీనిపై ‘న్యూస్టుడే’ సంబంధిత అధికారులను సంప్రదించగా.. పనులు వేగంగా జరుగుతున్నాయని, నిర్దేశిత లక్ష్యంలోపు పూర్తవుతాయని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిప్పలు మింగిన తోడేళ్లు
[ 01-07-2024]
వైకాపా ప్రభుత్వంలో అన్నింటా అక్రమాలు జరిగాయి. అక్రమం జరగని చోటంటూ లేదు. ఇసుక దోపిడీ చేశారు. కొండలు కొల్లగొట్టారు. మట్టి అక్రమ రవాణా చేసి కోట్ల రూపాయలకు పడగలెత్తారు. -
నేడు పింఛన్ల పంపిణీ
[ 01-07-2024]
తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జులై 1న ‘ఎన్టీఆర్ భరోసా’ పేరిట నేరుగా ఇంటి వద్దకే సామ్ము పంపిణీ చేసేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. -
రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పండగ : మంత్రి నారాయణ
[ 01-07-2024]
రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం పండగ వాతావరణంలో సామాజిక పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. -
సెలవు రోజు.. వైద్యానికి స్వస్తి
[ 01-07-2024]
ప్రతిరోజూ ప్రభుత్వ ఆసుపత్రులు పనిచేయాలన్న నింబంధనలకు తూట్లు పడుతున్నాయి. పండుగలు, సాధారణ సెలవు రోజుల్లో పీహెచ్సీలు మూతపడుతున్నాయి. -
పట్టని నిబంధనలు.. ట్రాఫిక్ కష్టాలు
[ 01-07-2024]
ఈ చిత్రం పట్టణంలోని ట్రంకురోడ్డు నుంచి సంకులవారితోటకు వెళ్లే మార్గంలో ఇటీవల ఓ సమావేశ మందిరం నిర్మించారు. దీనికి పార్కింగ్ సదుపాయం లేదు. -
ఎన్నికల వ్యయంపై అభ్యంతరాలు రాలేదు: జేసీ
[ 01-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఖర్చు చేసిన వ్యయంపై ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్ తెలిపారు. -
పులి వాహనంపై ఆదిదంపతుల అభయం
[ 01-07-2024]
మండలంలోని రామతీర్థంలో వెలసిన శ్రీకామాక్షిదేవి సమేత రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి స్వామి, అమ్మవార్లు పులి వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. -
గ్రామస్థులకు పరిహారం ఇవ్వాలి
[ 01-07-2024]
మండలంలోని కర్లపాలెంలో మళ్లీ సర్వే చేసి నష్ట పరిహారం ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్. నరసింహారావు డిమాండ్ చేశారు. -
తెల్లని రూపం.. సేవలకు ప్రతిరూపం
[ 01-07-2024]
వైద్యులు దేవుడితో సమానమంటారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎందరికో ప్రాణభిక్ష పెడుతున్నారు. అలాంటి వారికి చేతులెత్తి నమస్కరిస్తుంటారు. కొందరు డాక్టర్లు నామమాత్రపు రుసుంతో వైద్య సేవలు అందిస్తున్నారు. -
గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం
[ 01-07-2024]
గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా అదనపు ఎస్పీ సీహెచ్ సౌజన్య అన్నారు. ఆదివారం ‘ఈనాడు’లో ‘గంజాయి గుప్పు.. ఏదీ కనువిప్పు’ పేరుతో కథనం ప్రచురితమైంది.