ఈవీఎం గోదాం పరిశీలన
కలెక్టర్ ఎం.హరినారాయణన్ శుక్రవారం నెల్లూరు ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎంల గోదామును రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.
పరిశీలిస్తున్న కలెక్టర్ హరినారాయణన్
నెల్లూరు (కలెక్టరేట్): కలెక్టర్ ఎం.హరినారాయణన్ శుక్రవారం నెల్లూరు ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎంల గోదామును రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికలకు ఉపయోగించిన వీవీ ప్యాట్ యంత్రాల్లో మిగిలి ఉన్న పేపర్ రోల్స్ను తొలగించి, యథావిధిగా భద్రపరిచే ప్రక్రియను రెవెన్యూ అధికారులు చేపట్టారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, ఆర్డీవో మలోల, తెదేపా, వైకాపా, భాజపా, కాంగ్రెస్, ఆప్ పార్టీల ప్రతినిధులు రసూల్, విజయ్కుమార్రెడ్డి, శ్రీనివాస్, బాలసుధాకర్, ధరణికుమార్, ఎం.శ్రీనివాసులు పాల్గొన్నారు.
వేళ్లూనుకున్న నిర్లక్ష్యం
ఈనాడు, నెల్లూరు
నెల్లూరు పాత మున్సిపల్ ఆఫీస్లో భవనం ఖాళీగా ఉండటంతో ఇక్కడ సచివాలయాలు కొనసాగుతున్నాయి. భవనం గోడల్లోకి చెట్ల వేర్లు చొచ్చుకొనిపోయాయి. అసలే పాతగోడలు.. దీనికి తోడు మొక్కలు పెరగడం.. వర్షాకాలం వస్తుండటంతో సిబ్బంది భయం భయంగా విధులు నిర్వర్తిస్తున్నారు. సమస్యపై సచివాలయ ఉద్యోగుల వివరణ కోరగా నగరపాలక అధికారుల దృష్టికి తీసుకెళ్లి మొక్కలను తొలగిస్తామని తెలిపారు.
వానొస్తే వణుకే!
ఈనాడు, నెల్లూరు
ఇది నెల్లూరు స్వర్ణాల చెరువు నుంచి నీలగిరి సంఘం మీదుగా వెళుతున్న పంట కాలువ. నగరంలో మురుగు కాలువల నిర్వహణ సరిగా లేదనడానికి ఈ కాలువే సాక్ష్యం. చిన్నపాటి వర్షం వచ్చినా కాలువలు పొంగి మురుగు రహదారులపై చేరుతోంది. వర్షాలకు ముందే అధికారులు పూడిక తీయిస్తే ముంపు సమస్య ఉండదని నగరవాసులు తెలిపారు. సమస్యపై నగరపాలక సంస్ద్థ ఆరోగ్యాధికారి డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ కాలువల్లో పూడిక తీయిస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిప్పలు మింగిన తోడేళ్లు
[ 01-07-2024]
వైకాపా ప్రభుత్వంలో అన్నింటా అక్రమాలు జరిగాయి. అక్రమం జరగని చోటంటూ లేదు. ఇసుక దోపిడీ చేశారు. కొండలు కొల్లగొట్టారు. మట్టి అక్రమ రవాణా చేసి కోట్ల రూపాయలకు పడగలెత్తారు. -
నేడు పింఛన్ల పంపిణీ
[ 01-07-2024]
తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జులై 1న ‘ఎన్టీఆర్ భరోసా’ పేరిట నేరుగా ఇంటి వద్దకే సామ్ము పంపిణీ చేసేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. -
రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పండగ : మంత్రి నారాయణ
[ 01-07-2024]
రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం పండగ వాతావరణంలో సామాజిక పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. -
సెలవు రోజు.. వైద్యానికి స్వస్తి
[ 01-07-2024]
ప్రతిరోజూ ప్రభుత్వ ఆసుపత్రులు పనిచేయాలన్న నింబంధనలకు తూట్లు పడుతున్నాయి. పండుగలు, సాధారణ సెలవు రోజుల్లో పీహెచ్సీలు మూతపడుతున్నాయి. -
పట్టని నిబంధనలు.. ట్రాఫిక్ కష్టాలు
[ 01-07-2024]
ఈ చిత్రం పట్టణంలోని ట్రంకురోడ్డు నుంచి సంకులవారితోటకు వెళ్లే మార్గంలో ఇటీవల ఓ సమావేశ మందిరం నిర్మించారు. దీనికి పార్కింగ్ సదుపాయం లేదు. -
ఎన్నికల వ్యయంపై అభ్యంతరాలు రాలేదు: జేసీ
[ 01-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఖర్చు చేసిన వ్యయంపై ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్ తెలిపారు. -
పులి వాహనంపై ఆదిదంపతుల అభయం
[ 01-07-2024]
మండలంలోని రామతీర్థంలో వెలసిన శ్రీకామాక్షిదేవి సమేత రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి స్వామి, అమ్మవార్లు పులి వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. -
గ్రామస్థులకు పరిహారం ఇవ్వాలి
[ 01-07-2024]
మండలంలోని కర్లపాలెంలో మళ్లీ సర్వే చేసి నష్ట పరిహారం ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్. నరసింహారావు డిమాండ్ చేశారు. -
తెల్లని రూపం.. సేవలకు ప్రతిరూపం
[ 01-07-2024]
వైద్యులు దేవుడితో సమానమంటారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎందరికో ప్రాణభిక్ష పెడుతున్నారు. అలాంటి వారికి చేతులెత్తి నమస్కరిస్తుంటారు. కొందరు డాక్టర్లు నామమాత్రపు రుసుంతో వైద్య సేవలు అందిస్తున్నారు. -
గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం
[ 01-07-2024]
గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా అదనపు ఎస్పీ సీహెచ్ సౌజన్య అన్నారు. ఆదివారం ‘ఈనాడు’లో ‘గంజాయి గుప్పు.. ఏదీ కనువిప్పు’ పేరుతో కథనం ప్రచురితమైంది.