యువత.. మారాలి నడత
నెల్లూరు స్టోన్హౌస్పేటలో ఇటీవల ఓ హత్య జరిగింది. పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిని ఆరుగురు యువకులు కలిసి కత్తులతో కడతేర్చారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉండటం గమనార్హం.
న్యూస్టుడే, నెల్లూరు (నేర విభాగం)
- నెల్లూరు స్టోన్హౌస్పేటలో ఇటీవల ఓ హత్య జరిగింది. పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిని ఆరుగురు యువకులు కలిసి కత్తులతో కడతేర్చారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉండటం గమనార్హం.
- నెల్లూరుతో పాటు ఇతర జిల్లాల్లో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులంతా యువకులే కావడం.. వ్యసనాలకు బానిసలై.. దొంగలుగా మారినట్లు గుర్తించారు.
ఈ రెండే కాదు.. ఇటీవల తరచూ చోటు చేసుకుంటున్న సంఘటనల్లో ఎక్కువగా యువకులే నిందితులుగా తేలుతుండటం పోలీసులనే విస్తుపరుస్తోంది.. తల్లిదండ్రులు అప్రమత్తం కావాల్సిన ఆవశ్యకతను చాటిచెబుతోంది. మారుతున్న కాలం.. తీరిక లేని జీవితం.. ఏది ఏమైనా బిడ్డల చదువులు, నడవడి, స్నేహాలు, అలవాట్లను ఓ కంట కనిపెడుతూ.. వారిని సన్మార్గంలో నడపాల్సిన అవసరం ఉంది.
నెల్లూరు నగరంలో ఆరు పోలీసు స్టేషన్లతో పాటు నెల్లూరు గ్రామీణ పోలీసు స్టేషన్ ఉంది. వీటి పరిధిలో ఎక్కడో ఒకచోట హత్యలు, హత్యాయత్నాలు, గొడవలు, దాడుల కేసులు నమోదవుతుండగా- వాటిల్లో అధికశాతం యువకుల ప్రమేయం ఆందోళన కలిగిస్తోంది. చైన్ స్నాచింగ్, ద్విచక్ర వాహనాల దొంగతనాల్లోనూ వారే నిందితులుగా ఉండటం విస్తుగొలుపుతోంది. చక్కగా చదువుకుని జీవితాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన వయసులో.. అపరిపక్వ మనస్తత్వం, చెడు సావాసాలు, వ్యసనాలు, జల్సాల కాంక్ష తదితరాల కారణంగా వివాదాల్లో చిక్కుకుని స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. కొందరు అర్ధరాత్రి వరకు రోడ్లలో పంచాయితీలు.. పుట్టిన రోజు పార్టీలు, షికార్లు, చోటా నాయకులతో మంతనాలు చేస్తూ గడిపేస్తున్నారు. ఈ క్రమంలో అనుకోని వివాదాలు.. కేసుల్లో చిక్కుకుని.. చిక్కుల్లో పడుతున్నారు.
షీట్ తెరిస్తే.. ఇబ్బందే
ఒక్కసారి రౌడీషీట్ తెరిస్తే.. భవిష్యత్తు నాశనమే.. ఎలాంటి ఉద్యోగాలు రావు. నిత్యం పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. పాస్పోర్టు ప్రభుత్వ ఉద్యోగం రాదు. ప్రతి ఆదివారం సంబంధిత పోలీసు స్టేషన్కు వెళ్లి హాజరు వేసుకోవాల్సి వస్తుంది.
తల్లిదండ్రులు దృష్టిసారించాలి
తల్లిదండ్రులు తమ బిడ్డలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వారు ఏం చేస్తున్నారు? ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారు? కళాశాలకు వెళుతున్నారా? రాత్రుళ్లు ఇంటికి ఎప్పుడు వస్తున్నారు? ఎక్కడికి వెళుతున్నారనే విషయాలపై దృష్టిసారించాలి. ఎక్కువ నగదు ఇవ్వడం, భారీ మోటారు సైకిళ్లు కొనివ్వడం తదితరాలు చేయకూడదు. నేరాలకు పాల్పడితే జరిగే అనర్థాలను వివరించాలి. తల్లిదండ్రుల నియంత్రణ ఉంటే.. వారిలో చైతన్యం వస్తుంది.
శ్రీనివాస్రెడ్డి, నగర డీఎస్పీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టని నిబంధనలు.. ట్రాఫిక్ కష్టాలు
[ 01-07-2024]
ఈ చిత్రం పట్టణంలోని ట్రంకురోడ్డు నుంచి సంకులవారితోటకు వెళ్లే మార్గంలో ఇటీవల ఓ సమావేశ మందిరం నిర్మించారు. దీనికి పార్కింగ్ సదుపాయం లేదు. -
ఎన్నికల వ్యయంపై అభ్యంతరాలు రాలేదు: జేసీ
[ 01-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఖర్చు చేసిన వ్యయంపై ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్ తెలిపారు. -
పులి వాహనంపై ఆదిదంపతుల అభయం
[ 01-07-2024]
మండలంలోని రామతీర్థంలో వెలసిన శ్రీకామాక్షిదేవి సమేత రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి స్వామి, అమ్మవార్లు పులి వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. -
గ్రామస్థులకు పరిహారం ఇవ్వాలి
[ 01-07-2024]
మండలంలోని కర్లపాలెంలో మళ్లీ సర్వే చేసి నష్ట పరిహారం ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్. నరసింహారావు డిమాండ్ చేశారు. -
తెల్లని రూపం.. సేవలకు ప్రతిరూపం
[ 01-07-2024]
వైద్యులు దేవుడితో సమానమంటారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎందరికో ప్రాణభిక్ష పెడుతున్నారు. అలాంటి వారికి చేతులెత్తి నమస్కరిస్తుంటారు. కొందరు డాక్టర్లు నామమాత్రపు రుసుంతో వైద్య సేవలు అందిస్తున్నారు. -
గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం
[ 01-07-2024]
గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా అదనపు ఎస్పీ సీహెచ్ సౌజన్య అన్నారు. ఆదివారం ‘ఈనాడు’లో ‘గంజాయి గుప్పు.. ఏదీ కనువిప్పు’ పేరుతో కథనం ప్రచురితమైంది.