logo

వైద్య విద్యార్థినికి ప్రతిష్ఠాత్మక పురస్కారం

ఆత్మకూరుకు చెందిన వైద్య విద్యార్థిని ఐశ్వర్య చంద్రిక అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ‘డాక్టర్‌ ఇర్విన్‌ గోల్డ్‌ ఫర్డ్‌ మెమోరియల్‌ అవార్డు’ వరించింది.

Updated : 29 Jun 2024 05:54 IST

ఆత్మకూరు, న్యూస్‌టుడే: ఆత్మకూరుకు చెందిన వైద్య విద్యార్థిని ఐశ్వర్య చంద్రిక అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ‘డాక్టర్‌ ఇర్విన్‌ గోల్డ్‌ ఫర్డ్‌ మెమోరియల్‌ అవార్డు’ వరించింది. ఇటీవల సెయింట్‌ మైఖెల్‌ మెడికల్‌ సెంటర్‌లో జరిగిన ఇంటర్నల్‌ రెసిడెన్సీ ప్రోగ్రాంలో ప్రతిభ చూపి పలువురి ప్రశంసలు పొందారు. ఆత్మకూరు మండలం అప్పారావుపాళెంనకు చెందిన ప్రముఖ క్యాన్సర్‌ వ్యాధి నిపుణులు డాక్టర్‌ సీకే నాయుడు కుమార్తె ఐశ్వర్య చంద్రిక అమెరికాలో వైద్య విద్యలో ఎండీ పూర్తిచేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభాకర్‌ నాయుడు ఆధ్వర్యంలో పలువురు అభినందనలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని