బిడ్డల కోసం వచ్చి దారుణ హత్య
భర్తతో విడిపోయిన మహిళ.. అతని వద్ద ఉన్న బిడ్డలను తీసుకెళ్లేందుకు వచ్చి దారుణహత్యకు గురైంది. అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలం ఎర్రాతివారిపల్లె పంచాయతీ దివిటివారిపల్లెలో గురువారం రాత్రి హత్యకు గురైన మహిళను భారతిగా పోలీసులు గుర్తించారు.
భర్తే నిందితుడు
భారతి (పాత చిత్రం)
మదనపల్లె నేరవార్తలు, నిమ్మనపల్లె, న్యూస్టుడే: భర్తతో విడిపోయిన మహిళ.. అతని వద్ద ఉన్న బిడ్డలను తీసుకెళ్లేందుకు వచ్చి దారుణహత్యకు గురైంది. అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలం ఎర్రాతివారిపల్లె పంచాయతీ దివిటివారిపల్లెలో గురువారం రాత్రి హత్యకు గురైన మహిళను భారతిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. నెల్లూరు జిల్లా కోవూరులోని నాగలకట్ట వీధికి చెందిన రంగయ్య, సాలమ్మల కుమార్తె భారతి (26)కి తొమ్మిదేళ్ల క్రితం చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన గణపతితో వివాహమైంది. వీరికి గంగాధర్ (6), రోహిత్ (4) పిల్లలు. గణపతి, అతని కుటుంబ సభ్యులు భారతిని తరచూ వేధింపులకు గురి చేసే వారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను స్వగ్రామానికి తీసుకెళ్లారు. రెండు నెలల క్రితం పెనుమూరు మండలం కార్తికేయపురంలో ఉన్న చిన్నమ్మ జ్యోతి వద్దకు వచ్చి ఉంటోంది. ఈ నేపథ్యంలో నెల్లూరుకు చెందిన రవితో పరిచయం పెంచుకుని నెలరోజుల క్రితం అతనితో వెళ్లి పోయింది. ఈ నెల 27న గణపతి భార్యకు ఫోన్ చేసి బిడ్డలను పోషించలేనని తీసుకెళ్లాలని సూచించాడు. ఆమె గురువారం పలమనేరుకు వచ్చింది. ఇద్దరు కలసి నిమ్మనపల్లె మండలం దివిటివారిపల్లె వద్ద ఉన్న బాహుదా కాలువలో చేపలు పట్టేందుకు వెళ్లారు. అక్కడ గొడవ పడినట్లు తెలుస్తోంది. గణపతి పథకం ప్రకారం తెచ్చుకున్న ఆయుధంతో హత్య చేసినట్లు తెలిసింది. మోటారు వసేందుకు వచ్చిన దివిటివారిపల్లెకు చెందిన మంజునాథ్ హత్య చూడటంతో అతనిపై దాడి జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మదనపల్లె డీఎస్పీ ప్రసాద్రెడ్డి, సీఐలు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. భర్తే హత్య చేసి ఉంటాడని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అతను కన్పించకుండా పోవడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతురాలి తల్లి సాలమ్మ, తమ్ముడు మునికృష్ణ ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిప్పలు మింగిన తోడేళ్లు
[ 01-07-2024]
వైకాపా ప్రభుత్వంలో అన్నింటా అక్రమాలు జరిగాయి. అక్రమం జరగని చోటంటూ లేదు. ఇసుక దోపిడీ చేశారు. కొండలు కొల్లగొట్టారు. మట్టి అక్రమ రవాణా చేసి కోట్ల రూపాయలకు పడగలెత్తారు. -
నేడు పింఛన్ల పంపిణీ
[ 01-07-2024]
తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జులై 1న ‘ఎన్టీఆర్ భరోసా’ పేరిట నేరుగా ఇంటి వద్దకే సామ్ము పంపిణీ చేసేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. -
రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పండగ : మంత్రి నారాయణ
[ 01-07-2024]
రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం పండగ వాతావరణంలో సామాజిక పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. -
సెలవు రోజు.. వైద్యానికి స్వస్తి
[ 01-07-2024]
ప్రతిరోజూ ప్రభుత్వ ఆసుపత్రులు పనిచేయాలన్న నింబంధనలకు తూట్లు పడుతున్నాయి. పండుగలు, సాధారణ సెలవు రోజుల్లో పీహెచ్సీలు మూతపడుతున్నాయి. -
పట్టని నిబంధనలు.. ట్రాఫిక్ కష్టాలు
[ 01-07-2024]
ఈ చిత్రం పట్టణంలోని ట్రంకురోడ్డు నుంచి సంకులవారితోటకు వెళ్లే మార్గంలో ఇటీవల ఓ సమావేశ మందిరం నిర్మించారు. దీనికి పార్కింగ్ సదుపాయం లేదు. -
ఎన్నికల వ్యయంపై అభ్యంతరాలు రాలేదు: జేసీ
[ 01-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఖర్చు చేసిన వ్యయంపై ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్ తెలిపారు. -
పులి వాహనంపై ఆదిదంపతుల అభయం
[ 01-07-2024]
మండలంలోని రామతీర్థంలో వెలసిన శ్రీకామాక్షిదేవి సమేత రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి స్వామి, అమ్మవార్లు పులి వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. -
గ్రామస్థులకు పరిహారం ఇవ్వాలి
[ 01-07-2024]
మండలంలోని కర్లపాలెంలో మళ్లీ సర్వే చేసి నష్ట పరిహారం ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్. నరసింహారావు డిమాండ్ చేశారు. -
తెల్లని రూపం.. సేవలకు ప్రతిరూపం
[ 01-07-2024]
వైద్యులు దేవుడితో సమానమంటారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎందరికో ప్రాణభిక్ష పెడుతున్నారు. అలాంటి వారికి చేతులెత్తి నమస్కరిస్తుంటారు. కొందరు డాక్టర్లు నామమాత్రపు రుసుంతో వైద్య సేవలు అందిస్తున్నారు. -
గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం
[ 01-07-2024]
గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా అదనపు ఎస్పీ సీహెచ్ సౌజన్య అన్నారు. ఆదివారం ‘ఈనాడు’లో ‘గంజాయి గుప్పు.. ఏదీ కనువిప్పు’ పేరుతో కథనం ప్రచురితమైంది.