మార్పుతోనే.. అందరికీ సరకులు
గత వైకాపా ప్రభుత్వం.. జిల్లాలో ఆహార భద్రతా చట్టానికి తూట్లు పొడిచింది. చౌక దుకాణాల వ్యవస్థను పక్కన పెట్టి.. ఇంటింటికీ రేషన్ పేరుతో మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల(ఎండీయూ)ను ప్రవేశపెట్టింది.
గత ప్రభుత్వంలో గాడితప్పిన ప్రజాపంపిణీ
గోదాములో బియ్యం బస్తాలు
న్యూస్టుడే, నెల్లూరు(కలెక్టరేట్): గత వైకాపా ప్రభుత్వం.. జిల్లాలో ఆహార భద్రతా చట్టానికి తూట్లు పొడిచింది. చౌక దుకాణాల వ్యవస్థను పక్కన పెట్టి.. ఇంటింటికీ రేషన్ పేరుతో మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల(ఎండీయూ)ను ప్రవేశపెట్టింది. రేషన్ డీలర్ల పొట్టకొట్టి వైకాపా కార్యకర్తలకు వాటిని కట్టబెట్టింది. ఆ చర్యలతో వ్యవస్థ గాడిన పడిందా? అంటే... తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా 95 శాతం మందికి రేషన్ పంపిణీ చేయగా... వైకాపా ప్రభుత్వంలో అది 85 శాతానికి పడిపోయింది. జిల్లాలో ప్రతి నెలా సుమారు 50వేల కార్డుదారులకు సరకులు సక్రమంగా అందని పరిస్థితి కొనసాగింది.
అధికారుల నిస్సహాయత
ఎండీయూ వాహనం ద్వారా సరకులు పంపిణీ చేయపోయినా.. అధికారులు ఏమీ చేయలేని నిస్సహాయత వ్యక్తం చేశారు. అధికార పార్టీ కార్యకర్తలు కావడంతో మిన్నకుండిపోయారు. కొందరు ఆపరేటర్లు వాహనాన్ని ఒక వీధిలో నిలిపి ఈ-పోస్ యంత్రంలో వేలిముద్రలు వేయించుకుని వెళ్లిపోతే.. తర్వాత వేరే వ్యక్తి సరకులు పంపిణీ చేసిన సంఘటనలు ఉన్నాయి. పైపెచ్చు సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువ మంది ఆపరేటర్లు వైకాపాకు అనుకూలంగా పనిచేశారు.
రూ. 30.66 కోట్లు వృథా
జిల్లాలో 438 ఎండీయూ వాహనాలు ఉండగా- ఒక్కోదాన్ని రూ. 7 లక్షలకు కొనుగోలు చేశారు. ఇందులో కొంత ఆపరేటర్ వాటా కాగా, మిగిలింది బ్యాంకు రుణంగా ఇప్పించారు. ప్రతి నెలా ఒక్కో ఆపరేటర్కు రూ. 21వేల చొప్పున వేతనం చెల్లిస్తున్నారు. వాహనాలకు రూ. 30.66 కోట్లు వెచ్చించారు. ఇంటింటికీ రేషన్ పేరుతో వీధుల్లో వాహనాలు నిలిపి.. సరకులు ఇచ్చేవారు. ప్రతి ఇంటికీ వెళ్లిన దాఖలాలే లేవు. ఎండీయూ ఆపరేటర్కు ప్రతినెలా వేతనం ఇవ్వడంతో పాటు రేషన్ డీలర్కు కమీషన్ చెల్లించేవారు. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి సరకులు చౌకదుకాణానికి చేరగా.. అక్కడి నుంచి ఆపరేటర్లు వాహనాల్లో నింపుకొని వెళ్లి పంపిణీ చేసేవారు. ఈ విధానం పూర్తిగా విఫలమైంది.
ప్రభుత్వ ఆదేశాలు రాగానే..
జిల్లాలోని చౌక దుకాణాలకు సరకుల సరఫరా జరుగుతోంది. జులై నెల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్డుదారులకు సరకులు పంపిణీ చేస్తాం.
లక్ష్మీనరసింహ, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్
ప్రజాధనం వృథా
ప్రజాధనం వృథా చేసి.. ఎండీయూ వాహనాలను వైకాపా కార్యకర్తలకు కట్టబెట్టిన వైనంపై తెదేపా ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. దాంతో ఈ వ్యవస్థను రద్దు చేసి.. ఆహార భద్రతా చట్టం మార్గదర్శకాల ప్రకారం చౌక దుకాణాల వద్దే సరకులు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పౌరసరఫరాలశాఖ అధికారులు చెబుతున్నారు. వైకాపా హయాంలో బియ్యం, పంచదార, గోధుమ పిండి మాత్రమే ఇచ్చి మిన్నకుండిపోగా.. కూటమి ప్రభుత్వం వాటితో పాటు వంట నూనె, కందిపప్పు రాయితీ ధరలకు పేదలకు పంపిణీ చేయాలని యోచిస్తోంది. ఈ నెల జిల్లాలోని ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి బియ్యం చౌక దుకాణాలకు చేరుస్తున్నారు.
జిల్లాలో కార్డులు: 7,22,257
చౌకదుకాణాలు:1513
ఎండీయూ వాహనాలు: 438
మండలాలు: 37
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దోచినోళ్లకు అభయం
[ 29-06-2024]
జిల్లా పౌరసరఫరాల సంస్థలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులే.. వాటికి వంత పాడారు. కంచె చేను మేసిందన్న చందంగా పొరుగు సేవల సిబ్బంది సాయంతో రూ. కోట్లు కాజేశారు. -
సోమశిలపై గత పాలకుల నిర్లక్ష్యం
[ 29-06-2024]
రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని.. 2021 వరదల సమయంలో పూర్తిగా దెబ్బతిన్న సోమశిల ఆఫ్రాన్కు తక్షణం మరమ్మతులు చేయించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కేవీవీ ప్రసాద్ కోరారు. -
ఆగస్టు నాటికి... రైల్వే పనులు పూర్తయ్యేనా?
[ 29-06-2024]
నెల్లూరు నగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు కొనసాగుతూనే ఉన్నాయి. రోజుకు 30వేల మంది ప్రయాణికులు.. సుమారు వంద రైళ్లు నిలిచే ఈ రద్దీ స్టేషన్లో చేపట్టిన ప్రగతి పనులు ఆగస్టు నాటికి పూర్తయ్యేనా అన్న సందేహం కలుగుతోంది. -
ఈవీఎం గోదాం పరిశీలన
[ 29-06-2024]
కలెక్టర్ ఎం.హరినారాయణన్ శుక్రవారం నెల్లూరు ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎంల గోదామును రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. -
యువత.. మారాలి నడత
[ 29-06-2024]
నెల్లూరు స్టోన్హౌస్పేటలో ఇటీవల ఓ హత్య జరిగింది. పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిని ఆరుగురు యువకులు కలిసి కత్తులతో కడతేర్చారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉండటం గమనార్హం. -
నుడాపై.. నారాయణ గురి!
[ 29-06-2024]
నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(నుడా)పై పట్టణ పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ గురిపెట్టారు. అక్రమ లేఅవుట్లు, ప్రభుత్వ భూములు ఆక్రమించి స్థిరాస్తి వ్యాపారం తదితరాలపై ఫిర్యాదులు వస్తుండటంతో కమిటీ ఏర్పాటు చేసి.. విచారణ చేయించాలన్న నిర్ణయానికి వచ్చారు. -
వైద్య విద్యార్థినికి ప్రతిష్ఠాత్మక పురస్కారం
[ 29-06-2024]
ఆత్మకూరుకు చెందిన వైద్య విద్యార్థిని ఐశ్వర్య చంద్రిక అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ‘డాక్టర్ ఇర్విన్ గోల్డ్ ఫర్డ్ మెమోరియల్ అవార్డు’ వరించింది. -
స్వామి భక్తి..
[ 29-06-2024]
ప్రభుత్వం మారినా అధికారుల్లో స్వామి భక్తి తగ్గడం లేదనడానికి నిదర్శనం ఈ చిత్రం. గత వైకాపా ప్రభుత్వంలో పౌరసరఫరాల బియ్యం పంపిణీకి ఏర్పాటు చేసి ఎండీయూ వాహనం మీద నవరత్నాల చిహ్నం వేశారు. -
బిడ్డల కోసం వచ్చి దారుణ హత్య
[ 29-06-2024]
భర్తతో విడిపోయిన మహిళ.. అతని వద్ద ఉన్న బిడ్డలను తీసుకెళ్లేందుకు వచ్చి దారుణహత్యకు గురైంది. అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలం ఎర్రాతివారిపల్లె పంచాయతీ దివిటివారిపల్లెలో గురువారం రాత్రి హత్యకు గురైన మహిళను భారతిగా పోలీసులు గుర్తించారు.