మాయా మహల్
సెంటు స్థలంలో చిన్న రేకుల షెడ్డు కట్టుకుంటేనే హడావుడి చేసే పట్టణ ప్రణాళిక అధికారులు.. ఎలాంటి అనుమతి లేకుండా నిర్మిస్తున్న వైకాపా కార్యాలయం విషయమే తెలియనట్లు వ్యవహరిస్తున్నారు.
నిర్మాణమే కాదు.. స్థల సేకరణలోనూ వివాదమే
నెల్లూరులోని వెంకటేశ్వరపురంలో నిర్మిస్తున్న వైకాపా కార్యాలయానికి అంటించిన నోటీసులు
ఈనాడు, నెల్లూరు: కార్పొరేషన్, న్యూస్టుడే: సెంటు స్థలంలో చిన్న రేకుల షెడ్డు కట్టుకుంటేనే హడావుడి చేసే పట్టణ ప్రణాళిక అధికారులు.. ఎలాంటి అనుమతి లేకుండా నిర్మిస్తున్న వైకాపా కార్యాలయం విషయమే తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. తాడేపల్లిలోని నిర్మాణాన్ని పగలగొట్టడంతో.. హడావుడిగా వెంకటేశ్వరపురంలోని వైకాపా కార్యాలయం వద్దకు చేరుకున్న అధికారులు.. అనుమతులు చూపించాలని కోరడం విడ్డూరంగా అనిపించింది. అప్పటి వరకు వైకాపా కొమ్ముకాసి.. వారు చెప్పిన ఇళ్లకు నోటీసులు.. అవసరమైతే పగలగొట్టేందుకూ వెనుకాడని అధికారులకు ప్రభుత్వం మారడంతో ముచ్చెమటలు పడుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే అనుమతులపై అడిగేందుకు వెళ్లిన అధికారులను వైకాపా నాయకులు నిలదీసినా.. సక్రమంగా సమాధానం చెప్పలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. చివరకు గత్యంతరం లేక.. ఉన్నతాధికారుల సూచనలతో అదే రోజు సాయంత్రం కార్యాలయానికి నోటీసులు అందించారు. టిడ్కో ఇళ్లకు కేటాయించిన భూమిని వైకాపా నాయకులు ప్రభుత్వం నుంచి లీజు పద్ధతిలో తీసుకున్నట్లు ఇప్పటి వరకు చెబుతున్నా.. తాజాగా ఓ కుటుంబం ‘వైకాపా కార్యాలయ భవనం తమ భూమి ఆక్రమించి కడుతున్నారని’ నెల్లూరు ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వారంలో వివరణ ఇవ్వాలని..
వెంకటేశ్వరపురంలోని సర్వే నంబరు 2222-2లో రెండెకరాల స్థలాన్ని వైకాపా కార్యాలయ నిర్మాణం కోసం 33 ఏళ్లకు ఏడాదికి ఎకరాకు రూ.వేయి చొప్పున లీజుకు కేటాయించగా.. ఎలాంటి ప్లాన్ పొందకుండా నిబంధనలు ఉల్లంఘించి నిర్మిస్తున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా.. కనీసం ప్లాన్ అప్రూవల్ తీసుకోకుండా కడుతున్న వైకాపా కార్యాలయ భవన నిర్మాణం పూర్తిగా అక్రమమని ఎట్టకేలకు నగరపాలక సంస్థ అధికారులు తేల్చారు. వాస్తవానికి 1500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ నిర్మాణం చేస్తుంటే నుడా(నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఆ విషయాన్ని పట్టించుకోలేదని గుర్తించారు. నెల్లూరులో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ అబ్జర్వర్ పేరుతో వైకాపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డికి నోటీసులు అందించేందుకు యత్నించినా.. ఆయన అందుబాటులో లేరు. దాంతో కమిషనర్ ఆదేశాలతో ఆగమేఘాలపై ఈ నెల 22వతేదీ సాయంత్రం కార్యాలయం ప్రాంతానికి వెళ్లారు. అక్కడ కూడా సంబంధిత బాధ్యులు లేకపోవడంతో.. పిల్లర్లకు నోటీసులు అంటించారు. ఏడు రోజుల్లో తగిన వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.
అసలు.. ఆ భూమి ఎవరిది?
ఏకంగా రూ. పది కోట్ల విలువైన భూమి అది. చెన్నై-విజయవాడ జాతీయ రహదారిని ఆనుకుని.. అత్యంత విలువైన స్థలంలో వైకాపా కార్యాలయం నిర్మిస్తున్నారు. తొలుత ఆ భూమిని టిడ్కో ఇళ్ల కోసం పేదల దగ్గర నుంచి ప్రభుత్వం తీసుకుందని, అందులో రెండు ఎకరాలను ప్రభుత్వ జీవో ప్రకారం వైకాపాకు అప్పగించారని ప్రచారం జరిగింది. తాజాగా నెల్లూరుకు చెందిన షేక్ కౌసర్ జాన్ అనే మహిళ తమ భూమిపై మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ కన్ను పడిందని, వైకాపా కార్యాలయం కడుతున్న విషయం తెలిసి.. ఆయన్ను కలిస్తే, న్యాయం చేస్తానని మాట ఇచ్చి.. తర్వాత కలిస్తే గెంటేయించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు బహిరంగ మార్కెట్టులో రూ. కోట్లు పలికే స్థలాన్ని.. ఏడాదికి ఎకరాకు రూ. వేయి చొప్పున 33 ఏళ్ల పాటు లీజుకు తీసుకోవడం, అందులో రాజ ప్రాసాదాన్ని తలపించేలా నిర్మాణం చేయడం వైకాపా అరాచకాలకు అద్దం పడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దోచినోళ్లకు అభయం
[ 29-06-2024]
జిల్లా పౌరసరఫరాల సంస్థలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులే.. వాటికి వంత పాడారు. కంచె చేను మేసిందన్న చందంగా పొరుగు సేవల సిబ్బంది సాయంతో రూ. కోట్లు కాజేశారు. -
సోమశిలపై గత పాలకుల నిర్లక్ష్యం
[ 29-06-2024]
రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని.. 2021 వరదల సమయంలో పూర్తిగా దెబ్బతిన్న సోమశిల ఆఫ్రాన్కు తక్షణం మరమ్మతులు చేయించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కేవీవీ ప్రసాద్ కోరారు. -
ఆగస్టు నాటికి... రైల్వే పనులు పూర్తయ్యేనా?
[ 29-06-2024]
నెల్లూరు నగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు కొనసాగుతూనే ఉన్నాయి. రోజుకు 30వేల మంది ప్రయాణికులు.. సుమారు వంద రైళ్లు నిలిచే ఈ రద్దీ స్టేషన్లో చేపట్టిన ప్రగతి పనులు ఆగస్టు నాటికి పూర్తయ్యేనా అన్న సందేహం కలుగుతోంది. -
ఈవీఎం గోదాం పరిశీలన
[ 29-06-2024]
కలెక్టర్ ఎం.హరినారాయణన్ శుక్రవారం నెల్లూరు ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎంల గోదామును రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. -
యువత.. మారాలి నడత
[ 29-06-2024]
నెల్లూరు స్టోన్హౌస్పేటలో ఇటీవల ఓ హత్య జరిగింది. పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిని ఆరుగురు యువకులు కలిసి కత్తులతో కడతేర్చారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉండటం గమనార్హం. -
నుడాపై.. నారాయణ గురి!
[ 29-06-2024]
నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(నుడా)పై పట్టణ పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ గురిపెట్టారు. అక్రమ లేఅవుట్లు, ప్రభుత్వ భూములు ఆక్రమించి స్థిరాస్తి వ్యాపారం తదితరాలపై ఫిర్యాదులు వస్తుండటంతో కమిటీ ఏర్పాటు చేసి.. విచారణ చేయించాలన్న నిర్ణయానికి వచ్చారు. -
వైద్య విద్యార్థినికి ప్రతిష్ఠాత్మక పురస్కారం
[ 29-06-2024]
ఆత్మకూరుకు చెందిన వైద్య విద్యార్థిని ఐశ్వర్య చంద్రిక అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ‘డాక్టర్ ఇర్విన్ గోల్డ్ ఫర్డ్ మెమోరియల్ అవార్డు’ వరించింది. -
స్వామి భక్తి..
[ 29-06-2024]
ప్రభుత్వం మారినా అధికారుల్లో స్వామి భక్తి తగ్గడం లేదనడానికి నిదర్శనం ఈ చిత్రం. గత వైకాపా ప్రభుత్వంలో పౌరసరఫరాల బియ్యం పంపిణీకి ఏర్పాటు చేసి ఎండీయూ వాహనం మీద నవరత్నాల చిహ్నం వేశారు. -
బిడ్డల కోసం వచ్చి దారుణ హత్య
[ 29-06-2024]
భర్తతో విడిపోయిన మహిళ.. అతని వద్ద ఉన్న బిడ్డలను తీసుకెళ్లేందుకు వచ్చి దారుణహత్యకు గురైంది. అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలం ఎర్రాతివారిపల్లె పంచాయతీ దివిటివారిపల్లెలో గురువారం రాత్రి హత్యకు గురైన మహిళను భారతిగా పోలీసులు గుర్తించారు.