రూ.65 లక్షల వ్యయం.. నెరవేరని లక్ష్యం
మండలంలోని గుండుపల్లిలో 2017లో రూ.13.80 లక్షలతో ఏర్పాటుచేసిన పథకమిది. మొదట్లో కొద్దిరోజులు నీరు వచ్చింది. రుచిగా లేదని వినియోగించడం మానేశారు.
మండలంలోని గుండుపల్లిలో 2017లో రూ.13.80 లక్షలతో ఏర్పాటుచేసిన పథకమిది. మొదట్లో కొద్దిరోజులు నీరు వచ్చింది. రుచిగా లేదని వినియోగించడం మానేశారు. దీంతో లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన నీటిపథకం నిరుపయోగంగా మారింది. ప్రస్తుతం డోరు అద్దాలు పగిలిపోయాయి. కంప చెట్లు పెరుగుతున్నాయి.
మండలంలోని బోడసిద్ధాయపల్లిలో 2017లో రూ.12.30 లక్షలతో ఏర్పాటుచేసిన నానో పథకమిది. గ్రామంలో 130 కుటుంబాలకు పైగా ఉన్నా ఈ నీటిని తాగేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. దీంతో నిరుపయోగంగా మారింది. రూ.లక్షలాది రూపాయల పరికరాలు వృథా అయ్యాయి. పక్కనే ఓగూరువాండ్లపల్లి పాఠశాలలో ఏర్పాటుచేసిన ఆర్వో ప్లాంట్ నీరు తెచ్చుకుంటున్నారు.
సీతారామపురం, న్యూస్టుడే : ఫ్లోరిన్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు శుద్ధి నీటిని అందించాలని మండలంలోని గుండుపల్లి, బోడసిద్ధాయపల్లి, గోనువారిపల్లి, చిన్నాగంపల్లి, జయపురం గ్రామాల్లో నానో నీటి పథకాలను 2017 ఏప్రిల్లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటుచేసింది. వీటిని దాదాపు రూ.65 లక్షల వరకు నిధులు వెచ్చించి ఏర్పాటుచేశారు. ఈ పథకాల్లో టీడీఎస్ (టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్) విధానంలో ప్రమాణాల మేరకు లవణాలు ఉంటాయి. రసాయనాలు కలపరు. దీంతో ఈ నీరు రుచించడంలేదు. మండలంలో ఐదుచోట్ల ఏర్పాటు చేయగా ఎక్కడా వినియోగించని పరిస్థితి నెలకొంది. రూ.65 లక్షలు వ్యయం చేసినా నిరుపయోగంగా మారాయి. గత వైకాపా ప్రభుత్వం ఈ పథకాలను గురించి పట్టించుకున్న పాపానపోలేదు. ప్రస్తుతం తిరిగి తెదేపా ప్రభుత్వం కొలువుదీరినందున ఆర్వో ప్లాంట్లుగా మార్పు చేస్తే తాగునీటి కష్టాలు తీరుతాయని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ఆర్వో ప్లాంటుగా మార్పు చేయాలి
మా గ్రామంలోని నానో నీటి పథకం నీరు రుచిగా లేవని తాగేందుకు ఆసక్తి చూపడంలేదు. కొందరు కుళాయి నీరు తాగుతున్నారు. మరికొందరు కొనుగోలు చేస్తున్నారు. ఆర్వో పథకంగా మారిస్తే ఉపయోగంగా ఉంటుంది.
వెంకటేశ్వర్లు, జయపురం
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం
నానో నీటి పథకాలు నిరుపయోగంగా ఉన్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం. వాటి స్థానంలో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటుచేయాలన్న ప్రజల వినతి మేరకు అమలుచేసేలా చర్యలు తీసుకుంటాం.
జగన్నాథం, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, సీతారామపురం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దోచినోళ్లకు అభయం
[ 29-06-2024]
జిల్లా పౌరసరఫరాల సంస్థలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులే.. వాటికి వంత పాడారు. కంచె చేను మేసిందన్న చందంగా పొరుగు సేవల సిబ్బంది సాయంతో రూ. కోట్లు కాజేశారు. -
సోమశిలపై గత పాలకుల నిర్లక్ష్యం
[ 29-06-2024]
రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని.. 2021 వరదల సమయంలో పూర్తిగా దెబ్బతిన్న సోమశిల ఆఫ్రాన్కు తక్షణం మరమ్మతులు చేయించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కేవీవీ ప్రసాద్ కోరారు. -
ఆగస్టు నాటికి... రైల్వే పనులు పూర్తయ్యేనా?
[ 29-06-2024]
నెల్లూరు నగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు కొనసాగుతూనే ఉన్నాయి. రోజుకు 30వేల మంది ప్రయాణికులు.. సుమారు వంద రైళ్లు నిలిచే ఈ రద్దీ స్టేషన్లో చేపట్టిన ప్రగతి పనులు ఆగస్టు నాటికి పూర్తయ్యేనా అన్న సందేహం కలుగుతోంది. -
ఈవీఎం గోదాం పరిశీలన
[ 29-06-2024]
కలెక్టర్ ఎం.హరినారాయణన్ శుక్రవారం నెల్లూరు ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎంల గోదామును రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. -
యువత.. మారాలి నడత
[ 29-06-2024]
నెల్లూరు స్టోన్హౌస్పేటలో ఇటీవల ఓ హత్య జరిగింది. పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిని ఆరుగురు యువకులు కలిసి కత్తులతో కడతేర్చారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉండటం గమనార్హం. -
నుడాపై.. నారాయణ గురి!
[ 29-06-2024]
నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(నుడా)పై పట్టణ పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ గురిపెట్టారు. అక్రమ లేఅవుట్లు, ప్రభుత్వ భూములు ఆక్రమించి స్థిరాస్తి వ్యాపారం తదితరాలపై ఫిర్యాదులు వస్తుండటంతో కమిటీ ఏర్పాటు చేసి.. విచారణ చేయించాలన్న నిర్ణయానికి వచ్చారు. -
వైద్య విద్యార్థినికి ప్రతిష్ఠాత్మక పురస్కారం
[ 29-06-2024]
ఆత్మకూరుకు చెందిన వైద్య విద్యార్థిని ఐశ్వర్య చంద్రిక అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ‘డాక్టర్ ఇర్విన్ గోల్డ్ ఫర్డ్ మెమోరియల్ అవార్డు’ వరించింది. -
స్వామి భక్తి..
[ 29-06-2024]
ప్రభుత్వం మారినా అధికారుల్లో స్వామి భక్తి తగ్గడం లేదనడానికి నిదర్శనం ఈ చిత్రం. గత వైకాపా ప్రభుత్వంలో పౌరసరఫరాల బియ్యం పంపిణీకి ఏర్పాటు చేసి ఎండీయూ వాహనం మీద నవరత్నాల చిహ్నం వేశారు. -
బిడ్డల కోసం వచ్చి దారుణ హత్య
[ 29-06-2024]
భర్తతో విడిపోయిన మహిళ.. అతని వద్ద ఉన్న బిడ్డలను తీసుకెళ్లేందుకు వచ్చి దారుణహత్యకు గురైంది. అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలం ఎర్రాతివారిపల్లె పంచాయతీ దివిటివారిపల్లెలో గురువారం రాత్రి హత్యకు గురైన మహిళను భారతిగా పోలీసులు గుర్తించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
భార్యను నమ్మించి హతమార్చిన భర్త
-
ఊదమంటే.. బ్రీత్ ఎనలైజర్ లాక్కెళ్లాడు!
-
కాసుల మత్తులో ‘దందా’నతాన.. అనుచరుల బార్ల కోసం మద్యం దుకాణాల మార్పు
-
కేయూ హాస్టల్ గదిలో ఊడిపడిన ఫ్యాను.. విద్యార్థినికి తీవ్ర గాయం
-
రాజీనామాపై దోబూచులాట.. వైవీయూ వీసీ, రిజిస్ట్రార్లు తప్పుకోవాలని ఆందోళన
-
‘మర్డర్ ఆఫ్ రేణుకాస్వామి’ పేరిట వికీపీడియాలో కొత్త పేజీ..!