ఎన్ఎంఎంఎస్ ఫలితాలు విడుదల
జాతీయ స్థాయిలో ఉపకార వేతనాలు పొందేందుకు నిర్వహించిన ఎన్ఎంఎంఎస్ పరీక్ష ఫలితాలను మంగళవారం ఆన్లైన్లో విడుదల చేశారు.
జిల్లావ్యాప్తంగా 200 మంది ఎంపిక
విద్యార్థినులను అభినందిస్తున్న ప్రధానోపాధ్యాయులు విజయప్రకాశ్
నెల్లూరు(విద్య), న్యూస్టుడే: జాతీయ స్థాయిలో ఉపకార వేతనాలు పొందేందుకు నిర్వహించిన ఎన్ఎంఎంఎస్ పరీక్ష ఫలితాలను మంగళవారం ఆన్లైన్లో విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా రెండు వేల మందికి పైగా పరీక్ష రాయగా 200 మంది ఎంపికయ్యారని డీఈవో రామారావు తెలిపారు. జనరల్లో 66 మంది, ఎస్సీ 30 మంది, ఎస్టీ 8, బీసీఏ 11, బీసీబీ 12 బీసీడీ 11, బీసీఈ ఆరుగురు అర్హత సాధించారని పేర్కొన్నారు. వీరికి ఇంటర్ వరకు ఉపకార వేతనం అందనుందన్నారు. ఎంపికైన కేఎన్ఆర్ పాఠశాల విద్యార్థులను మంగళవారం ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయప్రకాష్ అభినందించారు. పాఠశాలలో పలువురు విద్యార్థులు జాతీయ ఉపకార వేతనాలకు ఎంపికయ్యారని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దోచినోళ్లకు అభయం
[ 29-06-2024]
జిల్లా పౌరసరఫరాల సంస్థలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులే.. వాటికి వంత పాడారు. కంచె చేను మేసిందన్న చందంగా పొరుగు సేవల సిబ్బంది సాయంతో రూ. కోట్లు కాజేశారు. -
సోమశిలపై గత పాలకుల నిర్లక్ష్యం
[ 29-06-2024]
రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని.. 2021 వరదల సమయంలో పూర్తిగా దెబ్బతిన్న సోమశిల ఆఫ్రాన్కు తక్షణం మరమ్మతులు చేయించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కేవీవీ ప్రసాద్ కోరారు. -
ఆగస్టు నాటికి... రైల్వే పనులు పూర్తయ్యేనా?
[ 29-06-2024]
నెల్లూరు నగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు కొనసాగుతూనే ఉన్నాయి. రోజుకు 30వేల మంది ప్రయాణికులు.. సుమారు వంద రైళ్లు నిలిచే ఈ రద్దీ స్టేషన్లో చేపట్టిన ప్రగతి పనులు ఆగస్టు నాటికి పూర్తయ్యేనా అన్న సందేహం కలుగుతోంది. -
ఈవీఎం గోదాం పరిశీలన
[ 29-06-2024]
కలెక్టర్ ఎం.హరినారాయణన్ శుక్రవారం నెల్లూరు ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎంల గోదామును రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. -
యువత.. మారాలి నడత
[ 29-06-2024]
నెల్లూరు స్టోన్హౌస్పేటలో ఇటీవల ఓ హత్య జరిగింది. పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిని ఆరుగురు యువకులు కలిసి కత్తులతో కడతేర్చారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉండటం గమనార్హం. -
నుడాపై.. నారాయణ గురి!
[ 29-06-2024]
నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(నుడా)పై పట్టణ పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ గురిపెట్టారు. అక్రమ లేఅవుట్లు, ప్రభుత్వ భూములు ఆక్రమించి స్థిరాస్తి వ్యాపారం తదితరాలపై ఫిర్యాదులు వస్తుండటంతో కమిటీ ఏర్పాటు చేసి.. విచారణ చేయించాలన్న నిర్ణయానికి వచ్చారు. -
వైద్య విద్యార్థినికి ప్రతిష్ఠాత్మక పురస్కారం
[ 29-06-2024]
ఆత్మకూరుకు చెందిన వైద్య విద్యార్థిని ఐశ్వర్య చంద్రిక అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ‘డాక్టర్ ఇర్విన్ గోల్డ్ ఫర్డ్ మెమోరియల్ అవార్డు’ వరించింది. -
స్వామి భక్తి..
[ 29-06-2024]
ప్రభుత్వం మారినా అధికారుల్లో స్వామి భక్తి తగ్గడం లేదనడానికి నిదర్శనం ఈ చిత్రం. గత వైకాపా ప్రభుత్వంలో పౌరసరఫరాల బియ్యం పంపిణీకి ఏర్పాటు చేసి ఎండీయూ వాహనం మీద నవరత్నాల చిహ్నం వేశారు. -
బిడ్డల కోసం వచ్చి దారుణ హత్య
[ 29-06-2024]
భర్తతో విడిపోయిన మహిళ.. అతని వద్ద ఉన్న బిడ్డలను తీసుకెళ్లేందుకు వచ్చి దారుణహత్యకు గురైంది. అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలం ఎర్రాతివారిపల్లె పంచాయతీ దివిటివారిపల్లెలో గురువారం రాత్రి హత్యకు గురైన మహిళను భారతిగా పోలీసులు గుర్తించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రజనీకాంత్, కమల్ హాసన్, అర్జున్: ‘సినిమాటిక్ యూనివర్స్’పై శంకర్ ఏమన్నారంటే?
-
పింఛన్దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
డీఎస్ మృతిపట్ల సీఎం రేవంత్రెడ్డి సంతాపం
-
వచ్చే వారంలో కొలిక్కి!.. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు
-
భార్యను నమ్మించి హతమార్చిన భర్త