logo

మండలంలో ఎమ్మెల్యే పర్యటన

కొండాపురం మండలంలోని మర్రిగుంట గ్రామంలో శాసనసభ సభ్యుడు కాకర్ల సురేష్ మంగళవారం పర్యటించారు.

Published : 02 Jul 2024 13:34 IST

కొండాపురం: కొండాపురం మండలంలోని మర్రిగుంట గ్రామంలో శాసనసభ సభ్యుడు కాకర్ల సురేష్ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే వాటిని పరిశీలించి పరిష్కరిస్తామని వారికి తెలియజేశారు. అనంతరం ఎస్సీ కాలనీలో తెదేపా జెండా ఆవిష్కరించి పోతురాజు ఆలయం వద్ద కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ తెదేపా నాయకులు చిట్టాబత్తిన మాచర్ల, తెదేపా రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు చిరంజీవి రెడ్డి, అరే పాపారాయుడు, మండల కన్వీనర్ ఓంకారం, చాగంటి కృష్ణ, పోలినేని రమేష్ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని