logo

Nalgonda: నిరుద్యోగులను వంచించిన సర్కార్: గొంగిడి సునీత

అబద్ధాల హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఎంతోకాలం మనుగడ సాధించలేదని మాజీ ఎమ్మెల్యే భారాస నాయకురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు.

Published : 02 Jul 2024 17:41 IST

భువనగిరి: అబద్ధాల హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఎంతోకాలం మనుగడ సాధించలేదని మాజీ ఎమ్మెల్యే భారాస నాయకురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. నిరుద్యోగులను ప్రచార అస్త్రాలుగా వాడుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైందని ఆమె విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని, హత్యలు మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో యాదగిరిగుట్ట మండల పార్టీ అధ్యక్షుడు కర్ర వెంకటయ్య తదితరులు  పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని