logo

Bhongir: అభివృద్ధి పథంలో నడిపిస్తా: ఎమ్మెల్యే

భువనగిరి నియోజకవర్గంలోని ప్రతి పల్లెను అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.

Published : 01 Jul 2024 17:12 IST

భువనగిరి: భువనగిరి నియోజకవర్గంలోని ప్రతి పల్లెను అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం  భువనగిరి మండలం హన్మపురం, బస్వపురం, ముత్తిరెడ్డిగూడెం, అనాజీపూర్ గ్రామాలలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు ప్రజల కోరిక మేరకు వారికి అవసరమైన పనులను చేపడతామన్నారు. పల్లెలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. హన్మపురం, మదిర, కుర్మగుడెం గ్రామంలో బీసి కమిటీ హాల్, ప్రహారీ గోడ,  బస్వపురం గ్రామంలో ఫంక్షన్ హాల్, ప్రాథమిక పాఠశాలలో అదనపు తరగతి గది, డైనింగ్ హాల్ పనులను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ నరాల నిర్మల, జడ్పీటీసీ సభ్యులు బీరు మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని