logo

TS News: ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలి

ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యతనిచ్చి వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కే జెండగే జిల్లా అధికారులను ఆదేశించారు.

Published : 01 Jul 2024 17:52 IST

భువనగిరి: ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యతనిచ్చి వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కే జెండగే జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన  ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి 82 ఫిర్యాదులు, దరఖాస్తులను స్వీకరించారు. జిల్లా అధికారులు ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమైన చోట క్షేత్రస్థాయి పరిశీలన జరిపి పరిష్కరించాలని సూచించారు. ఇందులో రెవెన్యూ శాఖ 51, వ్యవసాయ శాఖ 3, ల్యాండ్ రికార్డ్ శాఖ 3, మున్సిపాలిటీ 7, గ్రామీణ అభివృద్ధి శాఖ 5, పంచాయతీ శాఖ 3, విద్యాశాఖ 3, జిల్లా పరిషత్ 2, సివిల్ సప్లై, పోలీసు, ఇరిగేషన్, విద్యుత్, ఉపాధి కల్పన శాఖలు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టరు పి.బెన్షా లోమ్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు కె.గంగాధర్, జిల్లా పరిషత్ సీఈఓ శోభారాణి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ, కలెక్టరేట్ ఎ.ఓ. జగన్మోహన్ ప్రసాద్, జిల్లా అధికారులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని