జాతీయ రహదారి అడ్డాగా.. పార్థీ ముఠా నేరాలు
మూడు నెలలుగా హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిని అడ్డాగా చేసుకుని.. ఆగి ఉన్న వాహనాలనే లక్ష్యంగా రాత్రి, పగలు తేడాలేకుండా దొంగతనాలకు పాల్పడుతున్న పార్థీ దొంగల ముఠాలోని ఇద్దరిని నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు
వివరాలు వెల్లడిస్తున్న నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్
నల్గొండ నేరవిభాగం, న్యూస్టుడే: మూడు నెలలుగా హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిని అడ్డాగా చేసుకుని.. ఆగి ఉన్న వాహనాలనే లక్ష్యంగా రాత్రి, పగలు తేడాలేకుండా దొంగతనాలకు పాల్పడుతున్న పార్థీ దొంగల ముఠాలోని ఇద్దరిని నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు. నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ శనివారం స్థానిక పోలీస్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని పుణే జిల్లా ఇందాపూర్, భారామతి చౌరత ప్రాంతంలోని పార్థీ కులానికి చెందిన అప్ప పాండ్రంగా (30) (పార్ధీ ముఠాకు చెందిన ప్రధాన నిందితుడు), అదే ప్రాంతానికి చెందిన శుభం అశోక్ (25)తో పాటు పరారీలో ఉన్న షోలాపూర్ ప్రాంతానికి చెందిన శశిపాల్ (32), అఖిల్ (25)లు కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. నల్గొండ జిల్లా పరిధిలోని చిట్యాల, నార్కట్పల్లి, కట్టంగూరు మండలాలతో పాటు రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధి, సంగారెడ్డి జిల్లా రహదారుల వెంట నిలిపి ఉన్న వాహనాల్లో నిద్రపోతున్నవారిని రాళ్లు, సీకులతో కొట్టి వారి వద్ద నుంచి నగదు, బంగారం ఎత్తుకెళ్తున్నారు. బాధితులు ప్రతిఘటిస్తే హత్యలు చేస్తారు. అదే క్రమంలో మే నెల 18న కట్టంగూరు మండల కేంద్రంలో కృష్ణాజిల్లా పామర్రు మండలానికి చెందిన కొల్లూరు రాజవర్ధన్ (32) టాటా ఏస్ వాహనం రోడ్డుపై ఆపి నిద్రపోతున్న సమయంలో చేతులు కాళ్లు కట్టేసి కొట్టి హత్యచేశారు. అతడి వద్ద ఉన్న రూ.14,500 ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో ముఠా కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్న క్రమంలో.. శుక్రవారం ఉదయం పార్థీ ముఠాలో ఇద్దరు సభ్యులు ఆటోలో వెళ్తున్నట్లు సమాచారం రావడంతో.. హయత్నగర్ అవుటర్ రింగ్రోడ్డు సమీపంలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని నల్గొండ జిల్లా పరిధిలోని చిట్యాల పోలీస్ స్టేషన్లో విచారించారు. కట్టంగూరులో జరిగిన హత్య కేసుతో పాటు నల్గొండ జిల్లాలో-6, రాచకొండ కమిషనరేట్లో-13, సంగారెడ్డి జిల్లాలో- 11, సైబరాబాద్ కమిషనరేట్లో -2 దొంగతనాలు చేసినట్లు అంగీకరించారు. మొత్తం 32 కేసుల్లో.. ఒకటి హత్య కేసు, ఆరు దొంగతనాలు, ఏడు ఛైన్స్నాచింగ్, ఎనిమిది ద్విచక్రవాహనాల అపహరణ, పది ప్రాంతాల్లో పగలు, రాత్రి ఇళ్లల్లో దొంగతనాలు చేసినట్లు ఒప్పుకొన్నారు. పట్టుబడిన ఇద్దరిని రిమాండ్కు పంపడంతో పాటు పరారీలో ఉన్న ఇద్దరిని పట్టుకునేందుకు రెండు బృందాలు గాలిస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. కేసును ఛేదించిన నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి, నార్కట్పల్లి సీఐ నాగరాజు, ఎస్సై సైదాబాబు, హెడ్కానిస్టేబుల్ విష్ణువర్థనగిరి, సిబ్బంది విక్రమ్ శంకర్, సాయిరాం, కలీమ్, సాయి కుమార్లను ఎస్పీ అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందిచాలి
[ 15-07-2024]
ప్రభుత్వం పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కల్లూరు మల్లేశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. -
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి
[ 15-07-2024]
అంగన్వాడీ టీచర్లకు రూ.5 లక్షలు, ఆయాలకు రెండు లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ పెంచాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరు మల్లేష్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
కలెక్టరేట్ ఎదుట పెన్షన్ దారుల ఆందోళన
[ 15-07-2024]
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ పెన్షన్ దారుల సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్యర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట పెన్షన్ దారులు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేశారు. -
జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి
[ 15-07-2024]
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కొనసాగుతోంది. పలు సమస్యలను ఎదుర్కొంటున్న ప్రజలు జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్కు వినతులు అందజేస్తున్నారు -
యాదాద్రిలో గిరి ప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు
[ 15-07-2024]
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం గిరి ప్రదక్షిణ చేపట్టారు. -
గత ఏడాది తండ్రి.. ఇప్పుడు కుమారుడి ఆత్మహత్య
[ 15-07-2024]
ఆర్థిక సమస్యలతో మనస్తాపం చెందిన యువకుడు ఇంట్లో ఉరేేసుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని రెడ్లరేపాక గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. -
రుణమాఫీ అమలుకు కసరత్తు
[ 15-07-2024]
ఆగస్టు 15వ తేదీలోగా రూ.2 లక్షల పంట రుణాన్ని మాఫీ చేస్తానని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. 2018 డిసెంబరు 12 నుంచి 2023 డిసెంబరు 9 వరకు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేసేందుకు జిల్లా యంత్రాంగం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. -
రాయితీ దూరం.. సాగు భారం
[ 15-07-2024]
వ్యవసాయంలో కూలీల కొరత తీవ్రంగా ఉండడంతో రైతులు యంత్రాలపై ఆధారపడుతున్నారు. అవి లేకుండా పనులు చేయడం ప్రస్తుతం కష్టతరంగా మారింది. -
ఆర్టీవో కార్యాలయం దరి చేరేదెన్నడో..!
[ 15-07-2024]
దేవరకొండ రెవెన్యూ డివిజన్ కేంద్రంతో పాటు సబ్ కలెక్టర్ హోదా కలిగిన దేవరకొండకు ఆర్టీవో కార్యాలయం లేక వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. -
అక్షరాలు దిద్దించి.. సామర్థ్యాలు మదించి
[ 15-07-2024]
పదిహేను సంవత్సరాల వయస్సు దాటిన వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు భారత ప్రభుత్వం నవభారత సాక్షరత(న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం-ఎన్ఐఎల్పీ) కార్యక్రమాన్ని అమలు చేసేందుకు చర్యలు మొదలుపెట్టింది. -
అమ్మ మాట..అంగన్వాడీ బాట
[ 15-07-2024]
అంగన్వాడీ కేంద్రాల బలోపేతంతో పాటు గ్రామీణ స్థాయిలో విద్యను పటిష్ఠం చేసేందుకు ప్రవేశపెట్టిన పూర్వ ప్రాథమిక విద్యపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. -
బకాయిదారులకు మరో అవకాశం
[ 15-07-2024]
సీఎంఆర్ బకాయిల వసూలుకు భారత ఆహార సంస్థ(ఎఫ్సీఐ) బకాయిదారులకు మరో అవకాశం ఇచ్చింది. ఈ మేరకు ఇటీవల ఎఫ్సీఐ ఉత్తర్వులు జారీ చేసింది. -
నల్లమలలో నిఘా నేత్రాలు
[ 15-07-2024]
దేశంలోనే రెండో అతిపెద్ద అభయారణ్యమైన నల్లమలలో అటవీశాఖ అధికారులు నిఘా పెంచారు. కృష్ణాతీరాన్ని ఆవరించి ఉన్న నల్లమల.. నల్గొండ జిల్లాలో దాదాపు లక్ష ఎకరాల్లో విస్తరించి ఉంది. -
దృశ్యరూపకం.. విజ్ఞానదాయకం
[ 15-07-2024]
పాఠశాలల తరగతి గదుల్లో తెరమీద పాఠాలు చెప్పే విధానాన్ని మరింత మెరుగుపరచాలని విద్యాశాఖ సంకల్పించింది. ఇందులో భాగంగా నిపుణులైన ఉపాధ్యాయులు దృశ్య రూపకంగా పాఠాలు రూపొందించి అప్లోడ్ చేస్తే ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు బోధిస్తారు. -
వానాకాలం.. అప్రమత్తతే ఆయుధం..!
[ 15-07-2024]
వానాకాలంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా విద్యుత్తు ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. అందుకే అప్రమత్తత చాలా అవసరం. అజాగ్రత్తగా ఉంటే ప్రాణాలు గాలిలో కలుస్తాయి. -
మళ్లీ తెరపైకి చెత్త డంపింగ్!
[ 15-07-2024]
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జీహెచ్ఎంసీ)లో రోజుకు పది వేల మెట్రిక్ టన్నుల చెత్త వెలువడుతోంది. ఈ చెత్తను అంతా జవహర్నగర్ చెత్త డంపింగ్ కేంద్రానికి తరలిస్తారు. -
పల్లెల్లో విషజ్వరాల విజృంభణ
[ 15-07-2024]
గ్రామాల్లో ఎక్కడ చూసినా జ్వర బాధితులే కనిపిస్తున్నారు. ఇంటికో మనిషి మంచాన పడ్డారు. పారిశుద్ధ్య లోపంతో పల్లెల్లో వర్షపు నీరు ఎక్కడపడితే అక్కడే నిలిచింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పేరు గుర్తుపెట్టుకోండి: మరో డైరెక్టర్ని పరిచయం చేయనున్న నాని
-
ఆ జైలులో 9 రోజుల్లోనే 400కు పైగా సీసీటీవీలు ఏర్పాటు
-
రూ.65 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్
-
గొంతు కోసి మాజీ సైనికుడి హత్య
-
క్యాన్సర్తో పోరాడుతూ.. షూటింగ్కు సిద్ధమైన నటి..!
-
ట్రంప్నకు భారీ ఊరట.. రహస్య పత్రాల కేసు కొట్టివేత