సాంకేతికత మూలకేనా..!
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు నిరర్ధకం అయ్యాయి.
హుజూర్నగర్ మండలంలోని ఓ ఉన్నత పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్ దుస్థితి
హుజూర్నగర్, న్యూస్టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు నిరర్ధకం అయ్యాయి. ప్రభుత్వం కోట్ల రూపాయలు పెట్టి కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేసినా వాటిని ఉపయోగించి విద్యార్థులకు అవగాహన కల్పించే బోధకులు లేరు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని 204 కంప్యూటర్ ల్యాబ్లు నిరుపయోగంగా మారాయి.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 204 ఎంపిక చేసిన పాఠశాలలకు గత సంవత్సరం 1,433 కంప్యూటర్లు అందించారు. వాటిని వెంటనే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కావాల్సిన చర్యలు తీసుకున్నారు. విద్యార్థులకు బోధించాలనే లక్ష్యంతో ప్రత్యేక సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేశారు. వందలోపు విద్యార్థులు ఉంటే ఐదు, 101 నుంచి 200లోపు విద్యార్థులు ఉంటే ఎనిమిది కంప్యూటర్లు పంపిణీ చేశారు. రెండు వందలకు పైగా ఉంటే పది కంప్యూటర్లు అందించారు. అవగాహన ఉన్న ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించుకునే అవకాశం కూడా కల్పించారు. కానీ ఉపాధ్యాయులు మాత్రం తమకు బడిలోనే తరగతులు సరిపోను ఉన్నందున కంప్యూటర్ను బోధించలేమని గత సంవత్సరమే చేతులెత్తేశారు.
18 ఏళ్ల క్రితం ఇలా..
ప్రభుత్వ పాఠశాలలకు 18 సంవత్సరాల క్రితం కంప్యూటర్లను ఇచ్చి బోధించేందుకు పార్ట్టైమ్ బోధకులను నియమించారు. కొంత కాలం కంప్యూటర్ విద్య సక్రమంగానే సాగింది. తరువాత కంప్యూటర్ల మరమ్మతులు పట్టించుకోకపోవడంతో అన్ని పాఠశాలల కంప్యూటర్లు మూలకు పడ్డాయి. చివరకు కంప్యూటర్ బోధకులను కూడా తొలగించారు. 18 సంవత్సరాల తరువాత మళ్లీ ఎంపిక చేసిన పాఠశాలలకు కంప్యూటర్లు పంపిణీ చేశారు. కానీ బోధకుల నియామకాలు జరుపలేదు. గత సంవత్సరం కూడా బోధకులు లేకపోవడంతో బోధన జరగలేదు. పాఠశాలల్లో ఇప్పటికే కంప్యూటర్లు దుమ్ము పడుతున్నాయి. ప్రస్తుతం విద్యాసంవత్సరం ప్రారంభమైనందున ముందు నుంచే కంప్యూటర్ విద్యకు బోధకులను వెంటనే నియమిస్తారని విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.
ఆదేశాలు రాగానే నియామకాలు జరుపుతాం
అశోక్, జిల్లా విద్యాశాఖాధికారి, సూర్యాపేట
కంప్యూటర్ బోధకుల నియామకాలు జరగలేదు. ఈ విద్యాసంవత్సరం ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే కంప్యూటర్ బోధకుల నియామకాలు నిర్వహించి, కంప్యూటర్ విద్యను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకు వస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నల్లమల.. జంతువుల కళకళ
[ 07-07-2024]
ఉమ్మడి నల్గొండతో పాటూ నాగర్కర్నూల్ జిల్లాల్లో విస్తరించి ఉన్న నల్లమల అడవిలో గత రెండేళ్లలో గణనీయంగా శాకాహార జంతువులు వృద్ధి చెందినట్లు అటవీ అధికారులు వెల్లడిస్తున్నారు. -
మరో మణిహారం
[ 07-07-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లా జాతీయ రహదారుల్లో మరో మణిహారం చేరనుంది. -
సదా ‘మీ సేవ’లో..!
[ 07-07-2024]
ప్రభుత్వం మహిళల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట వేస్తోంది. ఆ క్రమంలోనే మీ సేవ కేంద్రాల ఏర్పాటు చేసి సదరు సేవలను వీరి ద్వారా పొందాలని భావిస్తోంది. -
పిల్లలకు రాష్ట్రీయ బాల పురస్కారాలు
[ 07-07-2024]
అసాధారణ సామర్ధ్యాలు ఉన్న బాలలకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు అందజేయనున్నారు. -
మాటల గారడీ.. నమ్మిస్తూ బురిడీ..!
[ 07-07-2024]
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని మోసపోయిన ఉదంతాలు జిల్లాలో నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి. -
యాదాద్రిలో శాస్త్రోక్తంగా నిత్యారాధనలు
[ 07-07-2024]
షాఢ మాసానికి తెరలేసిన శనివారం యాదాద్రి పుణ్యక్షేత్రంలో పంచనారసింహులను కొలుస్తూ చేపట్టిన నిత్యారాధనలు ఆలయ సంప్రదాయంగా కొనసాగాయి. -
ఆత్మకూర్(ఎస్) ఎంఈవో సస్పెన్షన్
[ 07-07-2024]
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మండల విద్యాధికారి పి.ధారాసింగ్ను సస్పెండ్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
సూర్యాపేటలో దొంగల హల్చల్
[ 07-07-2024]
జిల్లా కేంద్రంలోని భగత్సింగ్నగర్, చింతలచెర్వు రోడ్డులో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారు. -
వినిపిస్తూనే ఉంటుంది.. ఆ గుండె చప్పుడు..!
[ 07-07-2024]
ఇద్దరివీ చిరు ఉద్యోగాలు.. అయినా తమ ఇద్దరి పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఉన్నత చదువులు చదివిస్తూ హాయిగా జీవిస్తున్నారు. -
జాతీయ రహదారి అడ్డాగా.. పార్థీ ముఠా నేరాలు
[ 07-07-2024]
మూడు నెలలుగా హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిని అడ్డాగా చేసుకుని.. ఆగి ఉన్న వాహనాలనే లక్ష్యంగా రాత్రి, పగలు తేడాలేకుండా దొంగతనాలకు పాల్పడుతున్న పార్థీ దొంగల ముఠాలోని ఇద్దరిని నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు -
చోరీకి వచ్చి.. పోలీసులకు చిక్కి
[ 07-07-2024]
చోరీ చేయడానికి వచ్చి ఇద్దరు దుండగులు పోలీసులకు చిక్కిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ప్లాజా వద్ద శనివారం ఉదయం చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కెరీర్కు WWE స్టార్ జాన్ సీనా గుడ్బై.. చివరి పోరు ఎప్పుడంటే?
-
ప్రభాస్ పెళ్లిపై స్పందించిన శ్యామలా దేవి.. సక్సెస్ రాదన్నారు వచ్చింది
-
ఆ పురుగు ఖరీదు రూ.75 లక్షలా..!
-
ప్రధాని నుంచి ఆ ఒక్క ఫోన్ కాల్తో రిలాక్స్ అయిపోయా : రిషభ్ పంత్
-
పోటీపై బైడెన్ త్వరలో నిర్ణయం.. హవాయి గవర్నర్ కీలక వ్యాఖ్యలు!
-
దర్శన్కు డబ్బు ఎందుకిచ్చినట్లు?