తప్పు నుంచి మెప్పు దిశగా..!
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న 213 మంది ఖైదీలను సత్ప్రవర్తన పేరుతో ప్రభుత్వం విడుదల చేసింది.
నల్గొండ జైలు నుంచి నలుగురికి విముక్తి
నల్గొండ అర్బన్, న్యూస్టుడే: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న 213 మంది ఖైదీలను సత్ప్రవర్తన పేరుతో ప్రభుత్వం విడుదల చేసింది. శిక్షా కాలంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా జిల్లా జైలు నుంచి నలుగురు జీవిత ఖైదీలు బుధవారం విడుదలయ్యారు. ఖైదీల కుటుంబ సభ్యుల కోరిక మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వ సూచనలతో ఖైదీల విడుదలకు శ్రీకారం చుట్టారు. జైలు జీవితం నుంచి బయటకు వచ్చిన వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని భావించిన జైళ్లశాఖ అధికారులు.. వారికి తగిన ఉపాధి కల్పించాలనే సంకల్పంతో విడుదలైన ఖైదీలకు పెట్రోల్ బంకులు, కుట్టుమిషన్లు, ఉపాధి మార్గాలు సైతం చూపనున్నారు. జిల్లా జైలు నుంచి విడుదలైన నలుగురితో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన మరో పది మందికి జిల్లా జైలు ప్రాంగణంలో ఉన్న పెట్రోల్ బంకులో ఉపాధి కల్పించనున్నారు. జైలు నుంచి ఇళ్లకు వెళ్లిన వారు రెండు రోజుల్లో తిరిగి బంకులో విధులు నిర్వర్తించనున్నారు.
సంతోషంగా ఉంది
టి.నాగయ్య, నిడమనూరు
హత్య కేసులో న్యాయమూర్తి జీవిత ఖైదు వేయడంతో 18 ఏళ్లుగా వివిధ జైళ్లలో జీవితం అనుభవిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా నాకు మరో జీవితం ప్రసాదించినట్లయింది. మిగిలిన జీవిత కాలం కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటా. ఇక చిన్న తప్పుకూడా చేయకూడదని నిర్ణయించుకున్నాను. బయటకు వెళ్లిన వెంటనే ఉపాధి కష్టంగా ఉంటుందని జైలు అధికారులు పెట్రోల్ బంకులో పని కల్పిస్తున్నారు. నెలకు రూ.15 వేలు జీతం ఇస్తామని చెప్పారు.
తప్పు తెలుసుకున్నాను
యు.పాండు, మెదక్
దొంగతనం, హత్య కేసులో జీవితఖైదుగా 18 ఏళ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్నాను. జైలులో అమలు చేస్తున్న చదువు, యోగా, ధ్యానం వంటి కార్యక్రమాల మూలంగా నాలో మార్పు వచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో కొత్త జీవితంలోకి వెళ్తున్నా. ఎలాంటి తప్పులు చేయకుండా ఉంటా. తప్పు చేయాలనుకునే వారికి నా వంతుగా సూచనలు చేస్తాను. జైలు అధికారులు చూపించిన మంచి మార్గంలో పెట్రోల్ బంకులో పనిచేస్తూ కుటుంబ సభ్యులకు అండగా ఉంటా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నల్లమల.. జంతువుల కళకళ
[ 07-07-2024]
ఉమ్మడి నల్గొండతో పాటూ నాగర్కర్నూల్ జిల్లాల్లో విస్తరించి ఉన్న నల్లమల అడవిలో గత రెండేళ్లలో గణనీయంగా శాకాహార జంతువులు వృద్ధి చెందినట్లు అటవీ అధికారులు వెల్లడిస్తున్నారు. -
మరో మణిహారం
[ 07-07-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లా జాతీయ రహదారుల్లో మరో మణిహారం చేరనుంది. -
సదా ‘మీ సేవ’లో..!
[ 07-07-2024]
ప్రభుత్వం మహిళల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట వేస్తోంది. ఆ క్రమంలోనే మీ సేవ కేంద్రాల ఏర్పాటు చేసి సదరు సేవలను వీరి ద్వారా పొందాలని భావిస్తోంది. -
పిల్లలకు రాష్ట్రీయ బాల పురస్కారాలు
[ 07-07-2024]
అసాధారణ సామర్ధ్యాలు ఉన్న బాలలకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు అందజేయనున్నారు. -
మాటల గారడీ.. నమ్మిస్తూ బురిడీ..!
[ 07-07-2024]
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని మోసపోయిన ఉదంతాలు జిల్లాలో నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి. -
యాదాద్రిలో శాస్త్రోక్తంగా నిత్యారాధనలు
[ 07-07-2024]
షాఢ మాసానికి తెరలేసిన శనివారం యాదాద్రి పుణ్యక్షేత్రంలో పంచనారసింహులను కొలుస్తూ చేపట్టిన నిత్యారాధనలు ఆలయ సంప్రదాయంగా కొనసాగాయి. -
ఆత్మకూర్(ఎస్) ఎంఈవో సస్పెన్షన్
[ 07-07-2024]
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మండల విద్యాధికారి పి.ధారాసింగ్ను సస్పెండ్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
సూర్యాపేటలో దొంగల హల్చల్
[ 07-07-2024]
జిల్లా కేంద్రంలోని భగత్సింగ్నగర్, చింతలచెర్వు రోడ్డులో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారు. -
వినిపిస్తూనే ఉంటుంది.. ఆ గుండె చప్పుడు..!
[ 07-07-2024]
ఇద్దరివీ చిరు ఉద్యోగాలు.. అయినా తమ ఇద్దరి పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఉన్నత చదువులు చదివిస్తూ హాయిగా జీవిస్తున్నారు. -
జాతీయ రహదారి అడ్డాగా.. పార్థీ ముఠా నేరాలు
[ 07-07-2024]
మూడు నెలలుగా హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిని అడ్డాగా చేసుకుని.. ఆగి ఉన్న వాహనాలనే లక్ష్యంగా రాత్రి, పగలు తేడాలేకుండా దొంగతనాలకు పాల్పడుతున్న పార్థీ దొంగల ముఠాలోని ఇద్దరిని నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు -
చోరీకి వచ్చి.. పోలీసులకు చిక్కి
[ 07-07-2024]
చోరీ చేయడానికి వచ్చి ఇద్దరు దుండగులు పోలీసులకు చిక్కిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ప్లాజా వద్ద శనివారం ఉదయం చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘క్యానులో ఏదో తెచ్చి చల్లారు’.. భోలే బాబా లాయర్ ఆరోపణ
-
‘నివేదికను హిండెన్బర్గ్ ముందే లీక్ చేసింది.. లాభాల్లో వాటా తీసుకుంది’
-
సూరారంలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురికి తీవ్ర గాయాలు
-
రిషికేశ్లో ఉప్పొంగుతున్న గంగ.. ఘాట్ల వద్దకు వెళ్లొద్దని హెచ్చరికలు
-
‘కల్కి’ మరో రికార్డు.. కమల్హాసన్ డైలాగ్పై సాయిమాధవ్ ఏమన్నారంటే?
-
యుద్ధానికి తొమ్మిది నెలలు.. నెతన్యాహుకు నిరసన సెగలు!