నిరుద్యోగుల నిరీక్షణ!
ప్రభుత్వ కొలువులు దక్కని, ఉన్నత చదువులు చదివిన యువతకు ప్రభుత్వం జిల్లా కేంద్రంలో ప్రతినెల ఉద్యోగ మేళాను నిర్వహిస్తోంది.
జిల్లాలో ఉద్యోగ మేళాకు యువత ఎదురుచూపులు
సూర్యాపేట: ఉద్యోగ మేళాకు హాజరైన యువత (పాతచిత్రం)
సూర్యాపేట కలెక్టరేట్, న్యూస్టుడే: ప్రభుత్వ కొలువులు దక్కని, ఉన్నత చదువులు చదివిన యువతకు ప్రభుత్వం జిల్లా కేంద్రంలో ప్రతినెల ఉద్యోగ మేళాను నిర్వహిస్తోంది. యువత ఈ మేళాను సద్వినియోగం చేసుకుని ప్రైవేటు ఉద్యోగాలలో స్థిరపడుతుండటంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరినట్లు అవుతుంది. కాగా ఏడాది కాలంగా ఉద్యోగ మేళాలు నిర్వహించకపోవడంతో నిరుద్యోగులకు నిరీక్షణ తప్పడం లేదు. ఎప్పుడు నిర్వహిస్తారోనని జిల్లా కార్యాలయానికి వచ్చి ఆరా తీస్తున్నారు. ఈ విషయమై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేకపోవడంతో యువత ఎదురు చూస్తున్నారు.
3,246 మంది సద్వినియోగం..
జిల్లా కేంద్రంలో గతంలో ప్రతి నెల జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రైవేటు కంపెనీలు పాల్గొని ముఖాముఖి, అర్హతలను బట్టి వారికి ఉద్యోగాలు కేటాయించారు. ఇప్పటి వరకు గత అయిదేళ్లలో జిల్లా వ్యాప్తంగా 3,246 మంది యువత వివిధ కంపెనీలలో ఉద్యోగం పొంది స్థిరపడ్డారు.
స్థానికంగా కంపెనీలు ఉన్నా..
జిల్లా కేంద్రంలో నిర్వహించే ఉద్యోగ మేళాలో ఎక్కువగా హైదరాబాద్ నుంచి వచ్చిన కంపెనీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో నిరుద్యోగులు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో ప్రైవేటు కంపెనీలు అధికంగానే ఉన్నాయి. ఈ ఉద్యోగ మేళాల్లో స్థానిక కంపెనీలలో అర్హతను బట్టి ఉద్యోగం కల్పించినట్లయితే మరికొందరు యువత సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా జిల్లా కార్యాలయాల్లో, విద్యాసంస్థల్లో, మెడికల్ కళాశాలల్లో, ఒప్పంద పద్ధతిన తీసుకునేందుకు ఈ మేళాల ద్వారానే తీసుకుంటే యువతకు ప్రయోజనం చేకూరుతోంది.
ఉద్యోగం కల్పిస్తే ప్రయోజనం
ప్రదీప్, సూర్యాపేట: ప్రభుత్వం స్పందించి ఉద్యోగ మేళాలు నిర్వహించాలి. స్థానికంగా ఉద్యోగం కల్పిస్తే ప్రయోజనం చేకూరుతోంది. ఆ దిశగా ఆలోచన చేస్తే నిరుద్యోగులు ఉద్యోగ మేళాలు సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది.
త్వరలో నిర్వహిస్తాం
అక్బర్, జిల్లా ఉపాధి కల్పనాధికారి, సూర్యాపేట
ఉద్యోగ మేళాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. త్వరలో ప్రభుత్వ అనుమతితో నిర్వహిస్తాం. ఉద్యోగాలు కల్పించేందుకు నిరంతరం చర్యలు తీసుకుంటున్నాం. స్థానిక కంపెనీల విషయమై ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే నిర్వహిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నల్లమల.. జంతువుల కళకళ
[ 07-07-2024]
ఉమ్మడి నల్గొండతో పాటూ నాగర్కర్నూల్ జిల్లాల్లో విస్తరించి ఉన్న నల్లమల అడవిలో గత రెండేళ్లలో గణనీయంగా శాకాహార జంతువులు వృద్ధి చెందినట్లు అటవీ అధికారులు వెల్లడిస్తున్నారు. -
మరో మణిహారం
[ 07-07-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లా జాతీయ రహదారుల్లో మరో మణిహారం చేరనుంది. -
సదా ‘మీ సేవ’లో..!
[ 07-07-2024]
ప్రభుత్వం మహిళల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట వేస్తోంది. ఆ క్రమంలోనే మీ సేవ కేంద్రాల ఏర్పాటు చేసి సదరు సేవలను వీరి ద్వారా పొందాలని భావిస్తోంది. -
పిల్లలకు రాష్ట్రీయ బాల పురస్కారాలు
[ 07-07-2024]
అసాధారణ సామర్ధ్యాలు ఉన్న బాలలకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు అందజేయనున్నారు. -
మాటల గారడీ.. నమ్మిస్తూ బురిడీ..!
[ 07-07-2024]
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని మోసపోయిన ఉదంతాలు జిల్లాలో నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి. -
యాదాద్రిలో శాస్త్రోక్తంగా నిత్యారాధనలు
[ 07-07-2024]
షాఢ మాసానికి తెరలేసిన శనివారం యాదాద్రి పుణ్యక్షేత్రంలో పంచనారసింహులను కొలుస్తూ చేపట్టిన నిత్యారాధనలు ఆలయ సంప్రదాయంగా కొనసాగాయి. -
ఆత్మకూర్(ఎస్) ఎంఈవో సస్పెన్షన్
[ 07-07-2024]
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మండల విద్యాధికారి పి.ధారాసింగ్ను సస్పెండ్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
సూర్యాపేటలో దొంగల హల్చల్
[ 07-07-2024]
జిల్లా కేంద్రంలోని భగత్సింగ్నగర్, చింతలచెర్వు రోడ్డులో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారు. -
వినిపిస్తూనే ఉంటుంది.. ఆ గుండె చప్పుడు..!
[ 07-07-2024]
ఇద్దరివీ చిరు ఉద్యోగాలు.. అయినా తమ ఇద్దరి పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఉన్నత చదువులు చదివిస్తూ హాయిగా జీవిస్తున్నారు. -
జాతీయ రహదారి అడ్డాగా.. పార్థీ ముఠా నేరాలు
[ 07-07-2024]
మూడు నెలలుగా హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిని అడ్డాగా చేసుకుని.. ఆగి ఉన్న వాహనాలనే లక్ష్యంగా రాత్రి, పగలు తేడాలేకుండా దొంగతనాలకు పాల్పడుతున్న పార్థీ దొంగల ముఠాలోని ఇద్దరిని నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు -
చోరీకి వచ్చి.. పోలీసులకు చిక్కి
[ 07-07-2024]
చోరీ చేయడానికి వచ్చి ఇద్దరు దుండగులు పోలీసులకు చిక్కిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ప్లాజా వద్ద శనివారం ఉదయం చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
హార్దిక్ పాత్రను పోషించేందుకు సిద్ధమవుతున్నా: నితీశ్ కుమార్ రెడ్డి
-
హైదరాబాద్లో భారీగా బంగారం పట్టివేత
-
ఛాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ రోహిత్కే సారథ్యం: జైషా
-
జగన్నాథుడి రథయాత్ర.. కిక్కిరిసిన పూరీ వీధులు
-
మైనర్ల చేతిలో అశ్లీల కంటెంట్.. అడ్డుకట్టకు స్పెయిన్ వినూత్న ఆలోచన!
-
‘భారతీయుడు 2’.. నేను అలా అనలేదు: కమల్ హాసన్ క్లారిటీ