నేరస్థులను పట్టిస్తోంది నిఘా నేత్రం
నేరాల నియంత్రణకు, నేరస్థులను పట్టుకునేందుకు, కోర్టులో శిక్ష పడేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.
చౌటుప్పల్గ్రామీణం, న్యూస్టుడే: నేరాల నియంత్రణకు, నేరస్థులను పట్టుకునేందుకు, కోర్టులో శిక్ష పడేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీతో పాటు, ప్రతి గ్రామంలోను, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పొడవునా కెమెరాలను ఏర్పాటు చేసి పోలీసులు పక్కాగా పర్యవేక్షిస్తున్నారు. పోలీస్శాఖ ఆధ్వర్యంలో మొత్తం 435 సీసీ కెమెరాలను బిగించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల 55 కెమెరాలు పని చేయడం లేదని గుర్తించి వెంటనే మరమ్మతులు చేయించారు. హోటళ్లు, దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, పెట్రోల్ బంకులు, పరిశ్రమల్లో నేను సైతంలో భాగంగా 5వేల కెమెరాలను ఏర్పాటు చేయించారు. చౌటుప్పల్లో పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన సుమారు 20వేల మంది ఉద్యోగులు, కార్మికులు పని చేస్తారు. కెమెరాలు ఉంటే ఘటన జరిగిన వెంటనే చేధించవచ్చని పోలీసులు ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు.
ఛేదించిన కేసులు
- చౌటుప్పల్ బస్టాండ్ వద్ద మార్చి 3న రాత్రి ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా అతని మెడలోని బంగారు గొలుసును సూర్యాపేటకు చెందిన హరకావత్ వెంకన్న లాక్కొని పారిపోయాడు. నిందితుడిని సీసీ కెమెరాల్లో గుర్తించారు. పట్టుకొని రిమాండ్కు తరలించారు.
- తంగడపల్లిలో మార్చి 25న ఒంటరిగా వృద్ధురాలి మెడలోని 3.5తులాల గొలుసును ఓ యువకుడు లాక్కెళ్లాడు. కెమెరాల ద్వారా నిందితుడు దేవలమ్మనాగారానికి చెందిన సిలువేరు ప్రవీణ్గా గుర్తించి అరెస్ట్ చేశారు.
- మసీదుగూడెంలో కన్నతల్లినే కుమారుడు హతమార్చాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు కూడా తెలియదు. సెల్టవర్ లొకేషన్తో పాటు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు.
- హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనాలను ఢీకొని గాయపడటం, చనిపోతుంటారు. 5 నెలల్లోనే 23 వాహనాలను గుర్తించారు. జాతీయ రహదారిపై ప్రధాన కూడళ్ల వద్ద, ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో విభాగినుల మధ్యలో సీసీ కెమెరాలను బిగించారు. రాత్రి వేళ్లలో వాహనాల నంబర్లు స్పష్టంగా కనిపించేలా నాణ్యమైన కెమెరాలను ఏర్పాటు చేశారు.
తప్పుడు సమాచారం ఇచ్చినా దొరుకుతారు..
లక్కారంలోని తన దుకాణంలో చోరీ జరిగిందని రూ.లక్ష నగదు మాయమైందని యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులను ఏపీలోని గుంతకల్లులో అరెస్ట్ చేసి తీసుకొని రాగా రూ.25వేల ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. సీసీ కెమెరాలను చూడగా నగదు ఎత్తుకెళ్లినట్లు తేలిపోయింది. తంగడపల్లి రోడ్డులో రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో జరిగిన ఘర్షణలో బంగారు గొలుసు మాయమైందని ఒకరు ఫిర్యాదు చేయగా అక్కడ కెమెరాలను పరిశీలించగా గొలుసు పోలేదని తెలిసింది. తప్పుడు ఫిర్యాదులు ఇచ్చిన దొరికిపోతారని పోలీసులు పేర్కొంటున్నారు.
పక్కాగా నిర్వహణ: అశోక్రెడ్డి, పోలీస్ ఇన్స్పెక్టర్, చౌటుప్పల్
డీసీపీ రాజేశ్చంద్ర ఆదేశాల మేరకు సీసీ కెమెరాల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేస్తున్నాం. ప్రతి గ్రామంలో, సరిహద్దు ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తున్నాం. దేవాలయాలు, మసీదులు, ప్రార్థన మందిరాలు, వ్యాపార సంస్థలు తప్పకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని నోటీసులు ఇస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎత్తిపోసేలా.. ఎదురుచూపులు..!
[ 05-07-2024]
సాగర్ ఎడమకాల్వ పరిధిలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉన్న ఎత్తిపోతల పథకాల నిర్వహణ రైతులకు భారంగా మారడంతో.. ఎత్తిపోతల పథకాల నిర్వహణను ప్రభుత్వమే చేపడుతుందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఇటీవల ప్రకటించారు. -
కూలిపోతున్న బతుకులు
[ 05-07-2024]
నల్గొండ జిల్లా పరిధిలో విద్యుదాఘాతంతో ప్రాణనష్టం జరుగుతోంది. నిర్ధేశిత ప్రాంతాల్లో విద్యుత్తు ఉద్యోగులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో విధులు సక్రమంగా నిర్వహించడం లేదు. -
సాదాబైనామా.. పరిష్కారమయ్యేనా!
[ 05-07-2024]
సాదాబైనామాల కింద కొనుగోలు చేసిన భూములకు యాజమాన్య హక్కులు కల్పించకపోవడంతో దరఖాస్తుదారులకు గత మూడున్నరేళ్ల నుంచి నిరీక్షణ తప్పడం లేదు. సాదాబైనామాలకు నవంబరు 2020లో దరఖాస్తులను స్వీకరించారు. -
మూసీలోకి వరదొస్తోంది
[ 05-07-2024]
జిల్లాలో నాగార్జునసాగర్ తర్వాత రెండో పెద్దజలాశయంగా ఉన్న మూసీ రిజర్వాయర్ నీటిమట్టం రోజురోజుకు పెరుగుతోంది. -
యాదాద్రిలో వైభవంగా సేవోత్సవాలు
[ 05-07-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న పంచనారసింహులను ఆరాధిస్తూ గురువారం ఆస్థాన, ఆర్జిత పూజలు శాస్త్రోక్తంగా కొనసాగించారు. -
బంగారు బాల్యం.. కారాదు ఛిద్రం
[ 05-07-2024]
బాల్యం విలువైంది. వీరిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. -
యాదాద్రిలో సరికొత్త నిత్యాన్న ప్రసాద భవనం
[ 05-07-2024]
తెలంగాణలో పేరొందిన యాదాద్రి పుణ్యక్షేత్రంలో సరికొత్తగా నిర్మితమవుతోన్న నిత్యాన్నప్రసాద భవనం వచ్చే శ్రావణంలో భక్తులకు సేవలందించేందుకు సిద్ధమవుతోంది. -
వానొస్తే బురద.. ఎండొస్తే దుమ్ము
[ 05-07-2024]
జిల్లాలోని వార సంతలకు ఏటా రూ.లక్షల్లో ఆదాయం సమకూరుతున్నా ఆ స్థాయిలో వసతులు ఒనగూరటం లేదు. వీటికి ఏటా అధికారులు వేలం నిర్వహిస్తున్నారు. -
బొద్దుగా.. వద్దు..!
[ 05-07-2024]
ఇటీవల కాలంలో ధనిక, పేద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరి ఆహార అలవాట్లలో మార్పులు వచ్చాయి. ప్రధానంగా మార్కెట్లో బేకరీ, జంక్ఫుడ్ అమ్మకాలు అధికంగా ఉన్నాయి. -
పట్టా కావాలంటే పైకమివ్వాల్సిందే!
[ 05-07-2024]
సూర్యాపేట నియోజకవర్గానికి సమీపంలోని ఓ మండలంలో రైతు వీరయ్య ఎకరంన్నర భూమి కొనుగోలు చేశాడు. -
అక్కాచెల్లెళ్లు.. సరస్వతీ పుత్రికలు
[ 05-07-2024]
చదువునకు పేదరికం అడ్డురాదని మరోమారు నిరూపించారు ముగ్గురు అక్కాచెల్లెళ్లు. దేవరకొండ పట్టణానికి చెందిన గంజి శ్రీను, విజయ దర్జీ పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. -
విద్యుదాఘాతంతో నల్గొండ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మృతి
[ 05-07-2024]
వ్యవసాయ పనులు చేస్తూ విద్యుదాఘాతానికి గురై కాంగ్రెస్ సీనియర్ నేత, నల్గొండ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నల్లబోతు సైదిరెడ్డి మృతి చెందిన ఘటన గురువారం నల్గొండ జిల్లా కనగల్ మండలం బాలసాయిగూడెంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిర్పోర్టులో గ్యాస్ లీక్.. 39 మందికి అస్వస్థత
-
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తుల ఓటమి
-
నేనిప్పుడే మొదలుపెట్టా.. రిటైర్మెంట్పై బుమ్రా స్పందన ఇదే..
-
‘అదానీ’పై హిండెన్బర్గ్ ఆరోపణల్లో చైనా హస్తం?.. మహేశ్ జెఠ్మలానీ సంచలన ఆరోపణలు!
-
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
-
‘మీర్జాపూర్’ ఎంతో ప్రేక్షకాదరణ పొందింది.. వాటిని పట్టించుకోవద్దు: విజయ్ వర్మ