ఆర్ఆర్ఆర్ భూసేకరణ వేగిరం
రాజధాని హైదరాబాద్తో పాటూ పరిసర ప్రాంతాలకు సంబంధించి వచ్చే 30 ఏళ్ల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతమున్న బాహ్య వలయ రహదారి (ఓఆర్ఆర్)కి అవతల 30 కి.మీ. దూరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించనున్న ప్రాంతీయ వలయ రహదారి (ఆర్ఆర్ఆర్) నిర్మాణ ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో వడివడిగా సాగుతోంది.
ఉమ్మడి జిల్లాలో 100 కి.మీ. పైగానే రహదారి పనులు
ఈనాడు, నల్గొండ - న్యూస్టుడే, భువనగిరి : రాజధాని హైదరాబాద్తో పాటూ పరిసర ప్రాంతాలకు సంబంధించి వచ్చే 30 ఏళ్ల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతమున్న బాహ్య వలయ రహదారి (ఓఆర్ఆర్)కి అవతల 30 కి.మీ. దూరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించనున్న ప్రాంతీయ వలయ రహదారి (ఆర్ఆర్ఆర్) నిర్మాణ ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో వడివడిగా సాగుతోంది. ప్రాజెక్టు నిర్మాణానికి త్వరితగతిన నిధులు మంజూరు చేయాలని సంబంధిత రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ర్ెడ్డి ఇటీవలే కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరడంతో ఆయన సమ్మతించారు. మంత్రి ప్రత్యేక దృష్టితో ఉత్తర, దక్షిణ భాగాల భూ సేకరణ ప్రక్రియను వచ్చే మూడు, నాలుగు నెలల్లోనే పూర్తి చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తర భాగానికి సంబంధించి యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్, భువనగిరి ఆర్డీవోల పరిధిలో భూ సేకరణ జరుగుతుండగా..దక్షిణ భాగానికి సంబంధించి యాదాద్రి, నల్గొండ జిల్లాల పరిధిలో భూ సేకరణ క్రతువు సాగనుంది. యాదాద్రి కలెక్టరు హనుమంత్ కే.జెండగే ఇటీవలే అధికారులతో సమీక్షించి సాధ్యమైనంత తొందరగా ఉత్తర భాగం భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి జిల్లాలో 100 కి.మీ. వరకు
- ఉత్తర మార్గంలో సంగారెడ్డి నుంచి నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్పూర్, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్ వరకు 158 కి.మీ.మేర రహదారిని నిర్మించనున్నారు. ఈ మార్గం ఉమ్మడి జిల్లాలో 59.33 కి.మీ. మేర ఉండనుంది. అధికారులు ప్రతిపాదించిన మేరకు ఈ మార్గం ఐదు మండలాలు, 24 గ్రామాల మీదుగా వెళుతోంది. 649.85 హెక్టార్ల భూమి అవసరం అవుతుందని అంచనా వేయగా.. ఇప్పటికే అధికారులు 599.71 హెక్టార్ల భూ సేకరణకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంకా 50.06 హెక్టార్లకు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది.
- భువనగిరి మండలం రాయిగిరితో (కలెక్టరేట్కు ఎదురుగా)పాటూ చౌటుప్పల్, వలిగొండ వద్ద ఇంటర్ఛేంజ్ జంక్షన్లు రానున్నాయని గతంలోనే అధికారులు నిర్ణయించారు. అయితే రాయిగిరి వద్ద అలైన్మెంట్ను మార్చాలని రైతులు గత కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు భువనగిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత ఆర్అండ్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని అలైన్మెంట్ను మార్చి తమకు న్యాయం చేయాలని కోరారు. దీంతో రైతులకు అన్యాయం జరగకుండా రహదారి నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు చేపడుతామని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయనే మంత్రిగా ఉండటంతో తమకు న్యాయం దక్కుతుందని ఇక్కడి ప్రజలకు భావిస్తున్నారు. దీనిపై రైతులు న్యాయం కోసం కోర్టును ఆశ్రయించగా..అలైన్మెంట్ మార్చి దీనిపై ఉన్న స్టేను ఎత్తివేసే విధంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.
- మరోవైపు దక్షిణ భాగం చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపూర్, మర్రిగూడ, ఆమన్గల్, షాద్నగర్, కంది, సంగారెడ్డి వరకు నిర్మించనున్నారు. ఇది సుమారు 181 కి.మీ. వరకు ఉండగా.. యాదాద్రి, నల్గొండ జిల్లాల్లోని చౌటుప్పల్, నారాయణపూర్, మర్రిగూడ మండలాల్లో కలిపి సుమారు 40 కి.మీ.మేర రహదారి ఉండే అవకాశం ఉందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 250కి పైగా హెక్టార్ల భూమి అవసరం అవుతుందని భావిస్తుండగా..మరికొన్ని రోజుల్లో దక్షిణ భాగం భూ సేకరణపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఉత్తర, దక్షిణ భాగాలను కలిపి ఉమ్మడి జిల్లాలో ఆర్ఆర్ఆర్ 100 కి.మీ. మేర విస్తీర్ణంలో ఉంటుందని తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎత్తిపోసేలా.. ఎదురుచూపులు..!
[ 05-07-2024]
సాగర్ ఎడమకాల్వ పరిధిలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉన్న ఎత్తిపోతల పథకాల నిర్వహణ రైతులకు భారంగా మారడంతో.. ఎత్తిపోతల పథకాల నిర్వహణను ప్రభుత్వమే చేపడుతుందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఇటీవల ప్రకటించారు. -
కూలిపోతున్న బతుకులు
[ 05-07-2024]
నల్గొండ జిల్లా పరిధిలో విద్యుదాఘాతంతో ప్రాణనష్టం జరుగుతోంది. నిర్ధేశిత ప్రాంతాల్లో విద్యుత్తు ఉద్యోగులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో విధులు సక్రమంగా నిర్వహించడం లేదు. -
సాదాబైనామా.. పరిష్కారమయ్యేనా!
[ 05-07-2024]
సాదాబైనామాల కింద కొనుగోలు చేసిన భూములకు యాజమాన్య హక్కులు కల్పించకపోవడంతో దరఖాస్తుదారులకు గత మూడున్నరేళ్ల నుంచి నిరీక్షణ తప్పడం లేదు. సాదాబైనామాలకు నవంబరు 2020లో దరఖాస్తులను స్వీకరించారు. -
మూసీలోకి వరదొస్తోంది
[ 05-07-2024]
జిల్లాలో నాగార్జునసాగర్ తర్వాత రెండో పెద్దజలాశయంగా ఉన్న మూసీ రిజర్వాయర్ నీటిమట్టం రోజురోజుకు పెరుగుతోంది. -
యాదాద్రిలో వైభవంగా సేవోత్సవాలు
[ 05-07-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న పంచనారసింహులను ఆరాధిస్తూ గురువారం ఆస్థాన, ఆర్జిత పూజలు శాస్త్రోక్తంగా కొనసాగించారు. -
బంగారు బాల్యం.. కారాదు ఛిద్రం
[ 05-07-2024]
బాల్యం విలువైంది. వీరిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. -
యాదాద్రిలో సరికొత్త నిత్యాన్న ప్రసాద భవనం
[ 05-07-2024]
తెలంగాణలో పేరొందిన యాదాద్రి పుణ్యక్షేత్రంలో సరికొత్తగా నిర్మితమవుతోన్న నిత్యాన్నప్రసాద భవనం వచ్చే శ్రావణంలో భక్తులకు సేవలందించేందుకు సిద్ధమవుతోంది. -
వానొస్తే బురద.. ఎండొస్తే దుమ్ము
[ 05-07-2024]
జిల్లాలోని వార సంతలకు ఏటా రూ.లక్షల్లో ఆదాయం సమకూరుతున్నా ఆ స్థాయిలో వసతులు ఒనగూరటం లేదు. వీటికి ఏటా అధికారులు వేలం నిర్వహిస్తున్నారు. -
బొద్దుగా.. వద్దు..!
[ 05-07-2024]
ఇటీవల కాలంలో ధనిక, పేద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరి ఆహార అలవాట్లలో మార్పులు వచ్చాయి. ప్రధానంగా మార్కెట్లో బేకరీ, జంక్ఫుడ్ అమ్మకాలు అధికంగా ఉన్నాయి. -
పట్టా కావాలంటే పైకమివ్వాల్సిందే!
[ 05-07-2024]
సూర్యాపేట నియోజకవర్గానికి సమీపంలోని ఓ మండలంలో రైతు వీరయ్య ఎకరంన్నర భూమి కొనుగోలు చేశాడు. -
అక్కాచెల్లెళ్లు.. సరస్వతీ పుత్రికలు
[ 05-07-2024]
చదువునకు పేదరికం అడ్డురాదని మరోమారు నిరూపించారు ముగ్గురు అక్కాచెల్లెళ్లు. దేవరకొండ పట్టణానికి చెందిన గంజి శ్రీను, విజయ దర్జీ పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. -
విద్యుదాఘాతంతో నల్గొండ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మృతి
[ 05-07-2024]
వ్యవసాయ పనులు చేస్తూ విద్యుదాఘాతానికి గురై కాంగ్రెస్ సీనియర్ నేత, నల్గొండ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నల్లబోతు సైదిరెడ్డి మృతి చెందిన ఘటన గురువారం నల్గొండ జిల్లా కనగల్ మండలం బాలసాయిగూడెంలో చోటుచేసుకుంది.