అమ్మకు గుర్తుగా మొక్క..!
కనకనలాడే ఎండకు శిరస్సు మాడినా.. మనకు తన నీడను అందించే చెట్టే అమ్మాజారెడు నీళ్లయిన తాను దాచుకోక... జగతికి సర్వస్వం అర్పించే మబ్బె అమ్మ ఆ అమ్మలనే మించిన మా అమ్మకు... రుణం తీర్చుకోలేను ఏ జన్మకూ.. కంటేనే అమ్మ అంటే ఎలా... కరుణించే ప్రతి దేవత అమ్మే కదా... కన్న అమ్మే కదా..
కనకనలాడే ఎండకు శిరస్సు మాడినా.. మనకు తన నీడను అందించే చెట్టే అమ్మాజారెడు నీళ్లయిన తాను దాచుకోక... జగతికి సర్వస్వం అర్పించే మబ్బె అమ్మ ఆ అమ్మలనే మించిన మా అమ్మకు... రుణం తీర్చుకోలేను ఏ జన్మకూ.. కంటేనే అమ్మ అంటే ఎలా... కరుణించే ప్రతి దేవత అమ్మే కదా... కన్న అమ్మే కదా..
సూర్యాపేట కలెక్టరేట్, న్యూస్టుడే: మాతృమూర్తులు తమ పిల్లలను ఎలా సంరక్షించుకుంటారో.. అలాగే ఒక చెట్టు కూడా పర్యావరణాన్ని అలా రక్షిస్తోంది.. ఇలా ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు తమ తల్లుల పేరిట ఒక మొక్కను నాటాలని ఇటీవల మన్కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ దేశ ప్రజలకు సూచించారు. తల్లులు చనిపోయిన వారు వారి ఫొటోలను తీసుకుని వెళ్లి మొక్కలు నాటాలని.. ఆ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని పేర్కొన్నారు. ప్రధాని పిలుపుతో ఆ దిశగా అధికార యంత్రాంగం అడుగులు వేస్తోంది. కాగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించి.. ఉద్యమంలా చేపడుతోంది.
అటవీ విస్తీర్ణం పెంపునకు దోహదం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అటవీ విస్తీర్ణం తీవ్రంగా వెనుకబడింది. ప్రస్తుత కాలంలో చెట్లను నరికివేస్తుండటంతో కాలుష్యం ప్రభావం పెరుగుతూ వస్తోంది. దీంతో వాతావరణంలో కాలుష్య సమతుల్యత తగ్గిపోతుంది. ఈ ప్రభావం భవిష్యత్తు తరాలపై తీవ్రంగా చూపే అవకాశం ఉండటంతో దీని నుంచి మేల్కొనేందుకు ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా గత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని.. ప్రస్తుత ప్రభుత్వం పేరు మార్చి వన మహోత్సవం పేరిట చేపడుతోంది. గతంలో ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో, రహదారుల వెంట మొక్కలు నాటడంతో అటవీ విస్తీర్ణం కొంత వరకు పెరిగింది. ప్రస్తుతం వానాకాలం రావటంతో ఈ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని ప్రధాని మోదీ అధికారులకు, ప్రజలకు సూచించారు.
నాటిన మొక్కను సంరక్షిస్తేనే ప్రతిఫలం
సృష్టిలో తల్లులు తమ పిల్లలను ఎంత ప్రేమగా కాపాడుకుంటారో.. అదే రీతిలో నాటిన మొక్కనూ సంరక్షిస్తేనే అనుకున్న ప్రతిఫలం చేకూరుతుంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఇంటి ఆవరణలో ఒక మొక్కను నాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది జనాభా ఉండగా..వీరందరు తల ఒక్కోటి నాటినా అన్ని లక్షల మొక్కలు నాటే వీలుంటుంది. వాటిని సంరక్షిస్తే ఉమ్మడి జిల్లాలో భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేకూరుతుంది. అందరూ ఆలోచించి ఈ వన మహోత్సవంలో భాగస్వాములై, విజయవంతంగా చేపట్టాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఆ దిశగా నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేస్తుండగా అవసరం ఉన్న మొక్కలను కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎత్తిపోసేలా.. ఎదురుచూపులు..!
[ 05-07-2024]
సాగర్ ఎడమకాల్వ పరిధిలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉన్న ఎత్తిపోతల పథకాల నిర్వహణ రైతులకు భారంగా మారడంతో.. ఎత్తిపోతల పథకాల నిర్వహణను ప్రభుత్వమే చేపడుతుందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఇటీవల ప్రకటించారు. -
కూలిపోతున్న బతుకులు
[ 05-07-2024]
నల్గొండ జిల్లా పరిధిలో విద్యుదాఘాతంతో ప్రాణనష్టం జరుగుతోంది. నిర్ధేశిత ప్రాంతాల్లో విద్యుత్తు ఉద్యోగులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో విధులు సక్రమంగా నిర్వహించడం లేదు. -
సాదాబైనామా.. పరిష్కారమయ్యేనా!
[ 05-07-2024]
సాదాబైనామాల కింద కొనుగోలు చేసిన భూములకు యాజమాన్య హక్కులు కల్పించకపోవడంతో దరఖాస్తుదారులకు గత మూడున్నరేళ్ల నుంచి నిరీక్షణ తప్పడం లేదు. సాదాబైనామాలకు నవంబరు 2020లో దరఖాస్తులను స్వీకరించారు. -
మూసీలోకి వరదొస్తోంది
[ 05-07-2024]
జిల్లాలో నాగార్జునసాగర్ తర్వాత రెండో పెద్దజలాశయంగా ఉన్న మూసీ రిజర్వాయర్ నీటిమట్టం రోజురోజుకు పెరుగుతోంది. -
యాదాద్రిలో వైభవంగా సేవోత్సవాలు
[ 05-07-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న పంచనారసింహులను ఆరాధిస్తూ గురువారం ఆస్థాన, ఆర్జిత పూజలు శాస్త్రోక్తంగా కొనసాగించారు. -
బంగారు బాల్యం.. కారాదు ఛిద్రం
[ 05-07-2024]
బాల్యం విలువైంది. వీరిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. -
యాదాద్రిలో సరికొత్త నిత్యాన్న ప్రసాద భవనం
[ 05-07-2024]
తెలంగాణలో పేరొందిన యాదాద్రి పుణ్యక్షేత్రంలో సరికొత్తగా నిర్మితమవుతోన్న నిత్యాన్నప్రసాద భవనం వచ్చే శ్రావణంలో భక్తులకు సేవలందించేందుకు సిద్ధమవుతోంది. -
వానొస్తే బురద.. ఎండొస్తే దుమ్ము
[ 05-07-2024]
జిల్లాలోని వార సంతలకు ఏటా రూ.లక్షల్లో ఆదాయం సమకూరుతున్నా ఆ స్థాయిలో వసతులు ఒనగూరటం లేదు. వీటికి ఏటా అధికారులు వేలం నిర్వహిస్తున్నారు. -
బొద్దుగా.. వద్దు..!
[ 05-07-2024]
ఇటీవల కాలంలో ధనిక, పేద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరి ఆహార అలవాట్లలో మార్పులు వచ్చాయి. ప్రధానంగా మార్కెట్లో బేకరీ, జంక్ఫుడ్ అమ్మకాలు అధికంగా ఉన్నాయి. -
పట్టా కావాలంటే పైకమివ్వాల్సిందే!
[ 05-07-2024]
సూర్యాపేట నియోజకవర్గానికి సమీపంలోని ఓ మండలంలో రైతు వీరయ్య ఎకరంన్నర భూమి కొనుగోలు చేశాడు. -
అక్కాచెల్లెళ్లు.. సరస్వతీ పుత్రికలు
[ 05-07-2024]
చదువునకు పేదరికం అడ్డురాదని మరోమారు నిరూపించారు ముగ్గురు అక్కాచెల్లెళ్లు. దేవరకొండ పట్టణానికి చెందిన గంజి శ్రీను, విజయ దర్జీ పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. -
విద్యుదాఘాతంతో నల్గొండ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మృతి
[ 05-07-2024]
వ్యవసాయ పనులు చేస్తూ విద్యుదాఘాతానికి గురై కాంగ్రెస్ సీనియర్ నేత, నల్గొండ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నల్లబోతు సైదిరెడ్డి మృతి చెందిన ఘటన గురువారం నల్గొండ జిల్లా కనగల్ మండలం బాలసాయిగూడెంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలు పుట్టలేదని వివాహిత ఆత్మహత్య
-
అసలు కథ ముందుంది.. ‘కల్కి’ సీక్వెల్పై స్పందించిన నాగ్ అశ్విన్
-
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు భంగపాటు.. అధికారం దిశగా లేబర్ పార్టీ
-
ద్వారంపూడి వారి కాలుష్య పరిశ్రమ
-
వైకాపా విధేయుల్లో వణుకు.. అంటకాగిన అధికారులపై కూటమి ప్రభుత్వం ఆరా
-
అనుమతి లేకున్నా ఉన్నట్లు చూపి ప్లాట్ల విక్రయం.. కాకాణి సొంతూరిలో భారీ మోసం