సేంద్రియ సాగులో మేటి
ఉన్నత చదువు చదివి.. రూ.వేలల్లో వేతనానికి ఏసీ గదుల్లో పని చేసే ఉద్యోగావకాశాలు ఉన్నా.. అవన్నీ వదిలేసి వ్యవసాయంపై మక్కువ.. భూమిపై ప్రేమతో సాగు రంగంలోకి అడుగు పెట్టారు మిర్యాలగూడ పట్టణానికి చెందిన సోమా పవన్కుమార్.
సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన వరి (పాత చిత్రం)
మిర్యాలగూడ పట్టణం, న్యూస్టుడే: ఉన్నత చదువు చదివి.. రూ.వేలల్లో వేతనానికి ఏసీ గదుల్లో పని చేసే ఉద్యోగావకాశాలు ఉన్నా.. అవన్నీ వదిలేసి వ్యవసాయంపై మక్కువ.. భూమిపై ప్రేమతో సాగు రంగంలోకి అడుగు పెట్టారు మిర్యాలగూడ పట్టణానికి చెందిన సోమా పవన్కుమార్. కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఈయన చదువు పూర్తయిన వెంటనే 2004లో వ్యవసాయాన్ని ప్రారంభించారు. పెద్దవూర మండలం పెద్దగూడెంలోని తమకున్న వ్యవసాయ క్షేత్రంలో పలు రకాల పంటలు పండిస్తున్నాడు. వరితో పాటు బత్తాయి, బొప్పాయి, అల్లం, పుచ్చకాయ, కూరగాయలతో పాటు చేపలు, కోళ్ల పెంపకం చేపడుతున్నారు.
పదిహేనేళ్లుగా..
2009లో ఎనిమిది గుంటల విస్తీర్ణంలో సేంద్రియ పద్ధతిలో వరి సాగు ప్రారంభించిన పవన్కుమార్.. ఏటా కొంత విస్తీర్ణం పెంచుతూ ప్రస్తుతం నాలుగున్నర ఎకరాల్లో పండిస్తున్నారు. పొలానికి పురుగు మందులకు బదులు వర్మీ కంపోస్టుతో పాటు ఆవు మూత్రం, వేపనూనె, పుల్లటి మజ్జిగ, పురుగులు రాకుండా జిగురు అట్టలు, సోలార్ ట్రాప్లు వాడుతున్నారు.
తొలుత దిగుబడి తక్కువగా వచ్చినా ప్రస్తుతం బాగానే వస్తోందని.. ఈ బియ్యం తిన్న వారు మళ్లీ కావాలంటున్నారని పవన్కుమార్ తెలిపారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులకు వర్మీ కంపోస్టు తయారీలో ఉచిత శిక్షణ అందిస్తూ.. లాభాలను వివరిస్తున్నారు.
సంఘటితంగా ముందుకు..
పెద్దవూర రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన పవన్కుమార్ ప్రస్తుతం దానికి డైరెక్టర్గా ఉన్నారు. నాబార్డు సహకారంతో ఏర్పాటైన ఈ సంఘంలో ఐదు మండలాలు.. 35 గ్రామాలకు చెందిన 500 మంది వరకు రైతులు సభ్యులుగా ఉన్నారు. సంఘం ఆధ్వర్యంలో వర్మీ కంపోస్టు విక్రయం, రసాయన ఎరువుల దుకాణం, వివిధ బ్యాంకుల నుంచి రుణ సదుపాయం, వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా పరిశ్రమలకే విక్రయం వంటి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు.
ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం
సోమా పవన్కుమార్, యువ రైతు, మిర్యాలగూడ
రసాయన ఎరువుల వాడకంతో పర్యావరణ కాలుష్యంతో పాటు భూసారం తగ్గుతోంది. అందుకే నా వంతుగా సేంద్రియ పద్ధతిలో పంటలు పండిస్తూనే రైతులకూ అవగాహన కల్పిస్తున్నా. ప్రభుత్వాలు వర్మీ కంపోస్టు ఎరువులను ఉచితంగా అందించి ప్రోత్సహించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎత్తిపోసేలా.. ఎదురుచూపులు..!
[ 05-07-2024]
సాగర్ ఎడమకాల్వ పరిధిలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉన్న ఎత్తిపోతల పథకాల నిర్వహణ రైతులకు భారంగా మారడంతో.. ఎత్తిపోతల పథకాల నిర్వహణను ప్రభుత్వమే చేపడుతుందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఇటీవల ప్రకటించారు. -
కూలిపోతున్న బతుకులు
[ 05-07-2024]
నల్గొండ జిల్లా పరిధిలో విద్యుదాఘాతంతో ప్రాణనష్టం జరుగుతోంది. నిర్ధేశిత ప్రాంతాల్లో విద్యుత్తు ఉద్యోగులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో విధులు సక్రమంగా నిర్వహించడం లేదు. -
సాదాబైనామా.. పరిష్కారమయ్యేనా!
[ 05-07-2024]
సాదాబైనామాల కింద కొనుగోలు చేసిన భూములకు యాజమాన్య హక్కులు కల్పించకపోవడంతో దరఖాస్తుదారులకు గత మూడున్నరేళ్ల నుంచి నిరీక్షణ తప్పడం లేదు. సాదాబైనామాలకు నవంబరు 2020లో దరఖాస్తులను స్వీకరించారు. -
మూసీలోకి వరదొస్తోంది
[ 05-07-2024]
జిల్లాలో నాగార్జునసాగర్ తర్వాత రెండో పెద్దజలాశయంగా ఉన్న మూసీ రిజర్వాయర్ నీటిమట్టం రోజురోజుకు పెరుగుతోంది. -
యాదాద్రిలో వైభవంగా సేవోత్సవాలు
[ 05-07-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న పంచనారసింహులను ఆరాధిస్తూ గురువారం ఆస్థాన, ఆర్జిత పూజలు శాస్త్రోక్తంగా కొనసాగించారు. -
బంగారు బాల్యం.. కారాదు ఛిద్రం
[ 05-07-2024]
బాల్యం విలువైంది. వీరిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. -
యాదాద్రిలో సరికొత్త నిత్యాన్న ప్రసాద భవనం
[ 05-07-2024]
తెలంగాణలో పేరొందిన యాదాద్రి పుణ్యక్షేత్రంలో సరికొత్తగా నిర్మితమవుతోన్న నిత్యాన్నప్రసాద భవనం వచ్చే శ్రావణంలో భక్తులకు సేవలందించేందుకు సిద్ధమవుతోంది. -
వానొస్తే బురద.. ఎండొస్తే దుమ్ము
[ 05-07-2024]
జిల్లాలోని వార సంతలకు ఏటా రూ.లక్షల్లో ఆదాయం సమకూరుతున్నా ఆ స్థాయిలో వసతులు ఒనగూరటం లేదు. వీటికి ఏటా అధికారులు వేలం నిర్వహిస్తున్నారు. -
బొద్దుగా.. వద్దు..!
[ 05-07-2024]
ఇటీవల కాలంలో ధనిక, పేద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరి ఆహార అలవాట్లలో మార్పులు వచ్చాయి. ప్రధానంగా మార్కెట్లో బేకరీ, జంక్ఫుడ్ అమ్మకాలు అధికంగా ఉన్నాయి. -
పట్టా కావాలంటే పైకమివ్వాల్సిందే!
[ 05-07-2024]
సూర్యాపేట నియోజకవర్గానికి సమీపంలోని ఓ మండలంలో రైతు వీరయ్య ఎకరంన్నర భూమి కొనుగోలు చేశాడు. -
అక్కాచెల్లెళ్లు.. సరస్వతీ పుత్రికలు
[ 05-07-2024]
చదువునకు పేదరికం అడ్డురాదని మరోమారు నిరూపించారు ముగ్గురు అక్కాచెల్లెళ్లు. దేవరకొండ పట్టణానికి చెందిన గంజి శ్రీను, విజయ దర్జీ పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. -
విద్యుదాఘాతంతో నల్గొండ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మృతి
[ 05-07-2024]
వ్యవసాయ పనులు చేస్తూ విద్యుదాఘాతానికి గురై కాంగ్రెస్ సీనియర్ నేత, నల్గొండ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నల్లబోతు సైదిరెడ్డి మృతి చెందిన ఘటన గురువారం నల్గొండ జిల్లా కనగల్ మండలం బాలసాయిగూడెంలో చోటుచేసుకుంది.