నకిలీ ధ్రువపత్రాలతో.. నర్సుల కొలువులు..?
వైద్యఆరోగ్యశాఖ పరిధిలో రెండు నెలల క్రితం ఒప్పంద, పొరుగు సేవల కింద స్టాఫ్నర్సులు(20) ఫార్మాసిస్టులు(2), ఆయూష్ ఫార్మాసిస్టు(4) కొలువుల ఎంపిక కోసం దరఖాస్తులు స్వీకరించారు.
నల్గొండ అర్బన్, న్యూస్టుడే: వైద్యఆరోగ్యశాఖ పరిధిలో రెండు నెలల క్రితం ఒప్పంద, పొరుగు సేవల కింద స్టాఫ్నర్సులు(20) ఫార్మాసిస్టులు(2), ఆయూష్ ఫార్మాసిస్టు(4) కొలువుల ఎంపిక కోసం దరఖాస్తులు స్వీకరించారు. నాలుగు వేల వరకు నిరుద్యోగ అభ్యర్థులు ఈ కొలువులకు దరఖాస్తులు చేసుకున్నారు. స్టాఫ్నర్సుల ఎంపికకు మే నెలలో మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేసి డీఎంహెచ్వో కార్యాలయం గోడపై వివరాలు పొందు పరిచారు. ఎంపిక చేసిన మొదటి పది మందిలో ఐదుగురు ఏడాది క్రితం జరిగిన ఎంపికలో దరఖాస్తులు చేసుకున్న వారే ఉన్నారు. అప్పట్లో వారి పేర్లు రెండు వందల సంఖ్యకు దిగువన ఉండగా.. మే నెలలో జరిగిన ఎంపిక జాబితాలో పదిలోపు ఉండటంతో దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల్లో కొందరు అప్పటి డీఎంహెచ్వోకు ఫిర్యాదు చేశారు. కంప్యూటర్లో తప్పులు దొర్లాయని చెబుతూ.. ఎన్నికల నియమావళి, డీఎంహెచ్వో పదవీ విరమణ వంటి కారణాలతో అభ్యర్థుల ఎంపిక తాత్కాలికంగా వాయిదా వేశారు. తాజాగా అభ్యర్థుల మెరిట్ లిస్టును జూన్ 29న మరోసారి ఇన్ఛార్జి డీఎంహెచ్వో కల్యాణ్ చక్రవర్తి ప్రకటించారు. ఇందులో సైతం గతంలో తప్పులు చోటు చేసుకున్నాయి.గత అభ్యర్థుల పేర్లు అదేస్థానంలో ఉంచడంతో పాటు మరో ఇద్దరు అభ్యర్థులకు ఎక్కువ మార్కులు ఉన్నట్లు చూపారు. జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఒకరిద్దరు ప్రజాప్రతినిధుల అండదండలు ఉన్నవారితో పాటు రూ.2.50 లక్షలు చెల్లించిన వారికి నర్సులు, ఫార్మాసిస్టులు, ఆయూష్ ఫార్మాసిస్టుల కొలువుల్లో అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. గతంలో అనుభవం ఉన్నట్లు ధ్రువపత్రాలు సృష్టించి దరఖాస్తులు చేయించినట్లు సమాచారం. మరో వారం రోజుల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరగనున్న కమిటీ ద్వారా అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయనున్నారు.
క్రిమినల్ కేసులు పెడతాం
డా.కల్యాణ్ చక్రవర్తి, ఇన్ఛార్జి డీంఎంహెచ్వో
అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా ఉంటుంది. స్టాఫ్నర్సులు, ఫార్మాసిస్టులు, ఆయూష్ ఫార్మాసిస్టుల ఎంపికలో తప్పుడు పత్రాలు చూపిన వారిపై క్రిమినల్ కేసులు పెడతాము. కలెక్టర్ ఎంపిక చేసిన కమిటీ ద్వారా మాత్రమే అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ముందు వరసలో ఉన్నవారి నిజ ధ్రువపత్రాలు పూర్తి స్థాయిలో పరిశీలించిన తరువాతే ప్రక్రియ ముందుకు సాగేలా చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎత్తిపోసేలా.. ఎదురుచూపులు..!
[ 05-07-2024]
సాగర్ ఎడమకాల్వ పరిధిలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉన్న ఎత్తిపోతల పథకాల నిర్వహణ రైతులకు భారంగా మారడంతో.. ఎత్తిపోతల పథకాల నిర్వహణను ప్రభుత్వమే చేపడుతుందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఇటీవల ప్రకటించారు. -
కూలిపోతున్న బతుకులు
[ 05-07-2024]
నల్గొండ జిల్లా పరిధిలో విద్యుదాఘాతంతో ప్రాణనష్టం జరుగుతోంది. నిర్ధేశిత ప్రాంతాల్లో విద్యుత్తు ఉద్యోగులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో విధులు సక్రమంగా నిర్వహించడం లేదు. -
సాదాబైనామా.. పరిష్కారమయ్యేనా!
[ 05-07-2024]
సాదాబైనామాల కింద కొనుగోలు చేసిన భూములకు యాజమాన్య హక్కులు కల్పించకపోవడంతో దరఖాస్తుదారులకు గత మూడున్నరేళ్ల నుంచి నిరీక్షణ తప్పడం లేదు. సాదాబైనామాలకు నవంబరు 2020లో దరఖాస్తులను స్వీకరించారు. -
మూసీలోకి వరదొస్తోంది
[ 05-07-2024]
జిల్లాలో నాగార్జునసాగర్ తర్వాత రెండో పెద్దజలాశయంగా ఉన్న మూసీ రిజర్వాయర్ నీటిమట్టం రోజురోజుకు పెరుగుతోంది. -
యాదాద్రిలో వైభవంగా సేవోత్సవాలు
[ 05-07-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న పంచనారసింహులను ఆరాధిస్తూ గురువారం ఆస్థాన, ఆర్జిత పూజలు శాస్త్రోక్తంగా కొనసాగించారు. -
బంగారు బాల్యం.. కారాదు ఛిద్రం
[ 05-07-2024]
బాల్యం విలువైంది. వీరిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. -
యాదాద్రిలో సరికొత్త నిత్యాన్న ప్రసాద భవనం
[ 05-07-2024]
తెలంగాణలో పేరొందిన యాదాద్రి పుణ్యక్షేత్రంలో సరికొత్తగా నిర్మితమవుతోన్న నిత్యాన్నప్రసాద భవనం వచ్చే శ్రావణంలో భక్తులకు సేవలందించేందుకు సిద్ధమవుతోంది. -
వానొస్తే బురద.. ఎండొస్తే దుమ్ము
[ 05-07-2024]
జిల్లాలోని వార సంతలకు ఏటా రూ.లక్షల్లో ఆదాయం సమకూరుతున్నా ఆ స్థాయిలో వసతులు ఒనగూరటం లేదు. వీటికి ఏటా అధికారులు వేలం నిర్వహిస్తున్నారు. -
బొద్దుగా.. వద్దు..!
[ 05-07-2024]
ఇటీవల కాలంలో ధనిక, పేద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరి ఆహార అలవాట్లలో మార్పులు వచ్చాయి. ప్రధానంగా మార్కెట్లో బేకరీ, జంక్ఫుడ్ అమ్మకాలు అధికంగా ఉన్నాయి. -
పట్టా కావాలంటే పైకమివ్వాల్సిందే!
[ 05-07-2024]
సూర్యాపేట నియోజకవర్గానికి సమీపంలోని ఓ మండలంలో రైతు వీరయ్య ఎకరంన్నర భూమి కొనుగోలు చేశాడు. -
అక్కాచెల్లెళ్లు.. సరస్వతీ పుత్రికలు
[ 05-07-2024]
చదువునకు పేదరికం అడ్డురాదని మరోమారు నిరూపించారు ముగ్గురు అక్కాచెల్లెళ్లు. దేవరకొండ పట్టణానికి చెందిన గంజి శ్రీను, విజయ దర్జీ పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. -
విద్యుదాఘాతంతో నల్గొండ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మృతి
[ 05-07-2024]
వ్యవసాయ పనులు చేస్తూ విద్యుదాఘాతానికి గురై కాంగ్రెస్ సీనియర్ నేత, నల్గొండ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నల్లబోతు సైదిరెడ్డి మృతి చెందిన ఘటన గురువారం నల్గొండ జిల్లా కనగల్ మండలం బాలసాయిగూడెంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. బాధితులను పరామర్శించిన రాహుల్ గాంధీ
-
క్షమించండి.. ఓటమికి బాధ్యత వహిస్తున్నా: రిషి సునాక్
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,200
-
చెన్నుపాటి గాంధీపై దాడి కేసులో వైకాపా నేత ఈశ్వరప్రసాద్ అరెస్టు
-
‘భారతీయుడు2’ సెన్సార్ పూర్తి.. రన్టైమ్ ఎంతంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM