ఆసుపత్రులు కిటకిట
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, ముసురుతో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి.
పెరుగుతున్న విష జ్వరాలు, శ్వాసకోశ వ్యాధులు
మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో స్థలం లేక కారిడార్లో మంచాలు వేసి జ్వర పీడితులకు చికిత్స అందిస్తున్న దృశ్యం
- సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో సాధారణ రోజుల్లో 750 మంది వరకు ఓపీ నిమిత్తం వస్తుంటారు. సోమవారం ఆ సంఖ్య 1100కు పైగానే ఉందని వైద్యులు వెల్లడించారు.
- నల్గొండ జీజీహెచ్లో సోమవారం వివిధ విభాగాల్లో ఓపీ సంఖ్య 684 ఉండగా.. గత వారం క్రితం ఇది 500 కంటే తక్కువగానే ఉండటం గమనార్హం.
ఈనాడు, నల్గొండ: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, ముసురుతో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. దీంతో నల్గొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, భువనగిరి, కోదాడ లాంటి పట్టణాలతో పాటు పురపాలికల్లోని ప్రైవేటు, ఏరియా ఆసుపత్రుల్లో రోగుల తాకిడి ఎక్కువైంది. ఎక్కువగా విషజ్వరాలతో పాటు దగ్గు, శ్వాసకోశ వ్యాధులు ప్రబలుతున్నట్లు వైద్యులు గుర్తించారు. డెంగీ, మలేరియాతో సైతం ప్రజలు విలవిలలాడుతున్నారు. దేవరకొండ, మిర్యాలగూడ, తుంగతుర్తి, ఆలేరు లాంటి ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఉన్నాయి. ఏటా వర్షాకాలం ప్రారంభంలో పల్లెలు, పట్టణాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించేవారు. ఈ దఫా పంచాయతీల్లో పాలకవర్గాలు లేకపోవడంతో నిర్వహణ అటకెక్కింది. ప్రత్యేకాధికారుల పాలన ఉన్నా.. పారిశుద్ధ్యం అధ్వానంగా మారడంతో జ్వర పీడితులు పెరిగారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అప్పులు చేసి పల్లెల్లో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నామని, ఆరు నెలలుగా బిల్లులు మాత్రం రావడం లేదని పంచాయతీ కార్యదర్శులు సోమవారం ప్రజావాణిలో వినతిపత్రాలు సమర్పించడం గమనార్హం.
ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ
జ్వరపీడితుల సంఖ్య పెరగడంతో ప్రైవేటు ఆసుపత్రులు అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నాయి. ఈ దందా నల్గొండ, సూర్యాపేట, మిర్యాలగూడలో ఎక్కువగా ఉంది. సంబంధిత అధికారులు మాత్రం తూతూమంత్రంగా తనిఖీలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నల్గొండ మండలం చందనపల్లికి చెందిన మల్లేష్కు జ్వరం రావడంతో ఇటీవల పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. అది డెంగీ అని చెప్పి రూ.35 వేలకు పైగా బిల్లు కట్టించుకున్నారు. తీరా అది డెంగీ కాదు.. విషజ్వరం అని తేలడంతో రెండు రోజులు చికిత్స అందించి పంపించారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నా స్పందించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పడకల కొరత
రోగుల తాకిడి ఎక్కువగా ఉండటంతో పలు ఆసుపత్రుల్లో పడకల కొరత ఏర్పడుతోంది. ఉదాహరణకు దేవరకొండ లాంటి మారుమూల ప్రాంతాల్లో విషజ్వరాలు ఎక్కువగా ఉండటంతో సోమవారం ప్రాంతీయ ఆసుపత్రికి 600 మందికి పైగా ఓపీ సేవల కోసం బారులుతీరారు. సాధారణ రోజుల్లో 450కి మించదు. ఒక్కసారిగా రోగులు రావడంతో ఆసుపత్రిపై భారం పడింది. జిల్లా కేంద్రాలైన నల్గొండ, సూర్యాపేటల్లోని జీజీహెచ్లో రోగులకు చాలినన్నీ పడకలు ఉండగా.. ప్రాంతీయ ఆసుపత్రుల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొన్నిచోట్ల పీహెచ్సీలకు వైద్యులు సకాలంలో రావడం లేదు. దీంతో స్థానికంగానే తగ్గే జ్వరాలు.. వైద్యుల ఆలస్యంతో ఇన్పేషంట్ (ఐపీ)గా మారుతున్న పరిస్థితి తలెత్తుతోంది.
చర్యలు తీసుకుంటున్నాం
గతంలో కన్నా ఓపీ గణనీయంగా పెరిగిన మాట వాస్తవమే. దేవరకొండ, మిర్యాలగూడ లాంటి ప్రాంతాల్లో 100 పడకలకు 150 మంది రోగులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అందుబాటులో ఉన్న పడకలతో చికిత్స అందించాలని అధికారులను ఆదేశించాం. దేవరకొండకు మరో వంద పడకలు అవసరమని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాం. ఎంత మంది రోగులు వచ్చినా చికిత్స అందిస్తాం.
డాక్టర్ మాతృనాయక్, ప్రాంతీయ ఆసుపత్రుల సమన్వయకర్త (డీసీహెచ్ఎస్), నల్గొండ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తొలకరి నిరాశే..!
[ 04-07-2024]
వానాకాలం ప్రారంభమై నెల గడిచినా.. మూడు జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే నమోదు అయింది.దీంతో పంటల సాగులో తీవ్ర జాప్యం నెలకొంటోంది. ఈ ఏడాది నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో కలిపి పంటల సాగు సగటు 15 శాతానికి కూడా మించలేదు. -
దళారీ.. అధికారి.. మధ్యలో రాయబారి
[ 04-07-2024]
రోడ్డు రవాణా సంస్థ కార్యాలయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి ఓ యజమాని (రాయబారి) రంగంలోకి దిగారు. అధికారులకు.. దళారులకు మధ్య సయోధ్య కుదర్చడం కోసం ముమ్మర ప్రయత్నం చేశారు. -
ఉచితానికి పచ్చజెండా..!
[ 04-07-2024]
కరెంటు కోసం ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. గత ఏడాది కాలంగా పెండింగ్లో ఉన్న ఉచిత విద్యుత్తు వ్యవసాయ బోరుబావుల దరఖాస్తులకు పచ్చజెండా ఊపింది. -
గౌరవం ఏదీ..?
[ 04-07-2024]
గౌరవ వేతనాల కోసం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఎదురు చూస్తున్నారు. -
సాంకేతికత మూలకేనా..!
[ 04-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు నిరర్ధకం అయ్యాయి. -
ప్రగతిచక్రంలో.. నియామకాల పర్వం
[ 04-07-2024]
ఆర్టీసీలో కొలువుల జాతర మొదలు కానుంది. సుమారు 12 ఏళ్లుగా ఎటువంటి నియామకాలు లేకపోగా.. ఉద్యోగ విరమణ పొందుతున్న వారితో సిబ్బంది భారీగా తగ్గుతూ వస్తున్నారు. -
చౌటుప్పల్ పట్టణాన.. పైవంతెన
[ 04-07-2024]
చౌటుప్పల్ పట్టణంలో జాతీయ రహదారి- 65పై ఫ్లైఓవర్ నిర్మాణం కానుంది. వంతెన నిర్మాణానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) రూ.114.40 కోట్లు మంజూరు చేసింది. -
తప్పు నుంచి మెప్పు దిశగా..!
[ 04-07-2024]
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న 213 మంది ఖైదీలను సత్ప్రవర్తన పేరుతో ప్రభుత్వం విడుదల చేసింది. -
అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి
[ 04-07-2024]
అనుమానాస్పద స్థితిలో వసతిగృహ విద్యార్థి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలోని ఎస్సీ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో బుధవారం చోటు చేసుకుంది. -
నిరుద్యోగుల నిరీక్షణ!
[ 04-07-2024]
ప్రభుత్వ కొలువులు దక్కని, ఉన్నత చదువులు చదివిన యువతకు ప్రభుత్వం జిల్లా కేంద్రంలో ప్రతినెల ఉద్యోగ మేళాను నిర్వహిస్తోంది. -
మక్త అనంతారం ప్రభుత్వ పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు
[ 04-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్రంలోనే స్వచ్ఛతకు కేరాఫ్గా నిలిచిన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం మక్త అనంతారం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు రాష్ట్రంలో మరో ప్రత్యేక గుర్తింపు దక్కింది. -
యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆరాధనలు
[ 04-07-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో బుధవారం మూలవరులను ఆరాధిస్తూ చేపట్టిన ఆస్థాన, ఆర్జిత పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. గర్భాలయ ద్వారాలను తెరిచిన పూజారులు హారతితో కొలిచారు.
తాజా వార్తలు (Latest News)
-
వరల్డ్ కప్ మెడల్తో పంత్.. ట్రోల్ చేసిన అక్షర్, సిరాజ్
-
ఇంకా పరారీలోనే భోలే బాబా.. ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు
-
ఘనంగా వరలక్ష్మీ శరత్కుమార్ రిసెప్షన్.. తారల సందడి
-
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
-
అన్లిమిటెడ్ క్లెయిం మొత్తంతో ఐసీఐసీఐ ఆరోగ్య బీమా పాలసీ!
-
వాయు కాలుష్యంతో భారత్లో ఏటా 33 వేల మరణాలు: లాన్సెట్