మెరుగైన విద్యుత్తు సరఫరాకు సర్వే
పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా వినియోగదారులకు మెరుగైన కరెంటు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
తొలుత మూడు జిల్లా కేంద్రాల్లో నిర్వహణ
క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్న విద్యుత్తు సిబ్బంది
నల్గొండ జిల్లా పరిషత్తు, న్యూస్టుడే: పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా వినియోగదారులకు మెరుగైన కరెంటు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణాల్లో విద్యుత్తు వ్యవస్థ పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకొని బలోపేతం చేసే దిశగా అడుగుల వేస్తోంది. అందుకు ప్రత్యేకంగా శాటిలైట్ సర్వేకు శ్రీకారం చుట్టింది. తొలుత జిల్లా కేంద్రాల్లో 33 కేవీ, 11 కేవీ, ఎల్టీ లైన్ల వారీగా స్తంభాలను(పోల్ టూ పోల్) సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ పరిధిలోని జిల్లా కేంద్రాలైన నల్గొండ, సూర్యాపేట, భువనగిరి పట్టణాల్లో అధికారులు, సిబ్బంది రంగంలోకి దిగి శాటిలైట్ సర్వే చేపట్టారు. ఈ వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో నమోదు చేస్తున్నారు.
యాప్లో నిక్షిప్తం
సబ్స్టేషన్ పేరు, ఫీడరు, కేటగిరి లైను, విద్యుత్తు నియంత్రిక సామర్థ్యం, కరెంటు ప్రత్యేక నంబరు వేయడంతోపాటు, స్తంభాల మధ్య దూరం, వాటి లొకేషన్, స్తంభం సామర్థ్యం, కాసారం, తీగ పరిమాణం, ఇన్సూలేషన్ రకం వంటి వివరాలను ప్రత్యేక పోర్టల్లో నమోదు చేస్తున్నారు. స్తంభం ఫొటోను అప్లోడ్ చేస్తున్నారు.
ప్రత్యేక యాప్లో వివరాలు నమోదు ఇలా..
ప్రయోజనాలు ఇవీ..
విద్యుత్తు సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం ఈ సర్వే చేపడుతోంది. దీని ద్వారా సేకరించిన వివరాలతో భవిష్యత్తులో కరెంటు సమస్యలు ఉత్పన్నం కావు. పట్టణాల్లో విద్యుత్తు ఏర్పాటయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని స్తంభాలు వేశారు, వాటి పటిష్ఠత, లైన్ల పనితీరు, ఏ సబ్స్టేషన్ పరిధిలో ఎన్ని స్తంభాలు, నియంత్రికలెన్ని ఉన్నాయి.. ఇలాంటి వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వీటిని ఆన్లైన్లో హైదరాబాద్ కార్పొరేట్ కార్యాలయం నుంచే ఉన్నతాధికారులు చూసి, ఆయా ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా వ్యవస్థ పనితీరును పర్యవేక్షించే అవకాశం ఉంది. ఏటా లైన్లు, స్తంభాలు, నియంత్రికల నిర్వహణకు ఎన్ని నిధులు వెచ్చించాలో అంచనా వేయొచ్చు. పట్టణాల్లో విజయవంతమైతే గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రత్యేక సర్వే నిర్వహిస్తామని సంస్థ అధికారులు చెబుతున్నారు.
సమస్యలకు సత్వర పరిష్కారం
- చంద్రమోహన్, ఎస్ఈ, నల్గొండ జిల్లా
ప్రభుత్వ ఆదేశాల మేరకు తొలుత జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక సర్వే చేపట్టాం. కచ్చితమైన వివరాలు తెలియడంతో నిధుల కేటాయింపు, సిబ్బంది నియామకాలకు ఇబ్బందులు ఉండవు. సమస్యలు వచ్చినప్పుడు వెంటనే పరిష్కరించడం వల్ల సమయం ఆదా కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తొలకరి నిరాశే..!
[ 04-07-2024]
వానాకాలం ప్రారంభమై నెల గడిచినా.. మూడు జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే నమోదు అయింది.దీంతో పంటల సాగులో తీవ్ర జాప్యం నెలకొంటోంది. ఈ ఏడాది నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో కలిపి పంటల సాగు సగటు 15 శాతానికి కూడా మించలేదు. -
దళారీ.. అధికారి.. మధ్యలో రాయబారి
[ 04-07-2024]
రోడ్డు రవాణా సంస్థ కార్యాలయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి ఓ యజమాని (రాయబారి) రంగంలోకి దిగారు. అధికారులకు.. దళారులకు మధ్య సయోధ్య కుదర్చడం కోసం ముమ్మర ప్రయత్నం చేశారు. -
ఉచితానికి పచ్చజెండా..!
[ 04-07-2024]
కరెంటు కోసం ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. గత ఏడాది కాలంగా పెండింగ్లో ఉన్న ఉచిత విద్యుత్తు వ్యవసాయ బోరుబావుల దరఖాస్తులకు పచ్చజెండా ఊపింది. -
గౌరవం ఏదీ..?
[ 04-07-2024]
గౌరవ వేతనాల కోసం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఎదురు చూస్తున్నారు. -
సాంకేతికత మూలకేనా..!
[ 04-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు నిరర్ధకం అయ్యాయి. -
ప్రగతిచక్రంలో.. నియామకాల పర్వం
[ 04-07-2024]
ఆర్టీసీలో కొలువుల జాతర మొదలు కానుంది. సుమారు 12 ఏళ్లుగా ఎటువంటి నియామకాలు లేకపోగా.. ఉద్యోగ విరమణ పొందుతున్న వారితో సిబ్బంది భారీగా తగ్గుతూ వస్తున్నారు. -
చౌటుప్పల్ పట్టణాన.. పైవంతెన
[ 04-07-2024]
చౌటుప్పల్ పట్టణంలో జాతీయ రహదారి- 65పై ఫ్లైఓవర్ నిర్మాణం కానుంది. వంతెన నిర్మాణానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) రూ.114.40 కోట్లు మంజూరు చేసింది. -
తప్పు నుంచి మెప్పు దిశగా..!
[ 04-07-2024]
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న 213 మంది ఖైదీలను సత్ప్రవర్తన పేరుతో ప్రభుత్వం విడుదల చేసింది. -
అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి
[ 04-07-2024]
అనుమానాస్పద స్థితిలో వసతిగృహ విద్యార్థి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలోని ఎస్సీ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో బుధవారం చోటు చేసుకుంది. -
నిరుద్యోగుల నిరీక్షణ!
[ 04-07-2024]
ప్రభుత్వ కొలువులు దక్కని, ఉన్నత చదువులు చదివిన యువతకు ప్రభుత్వం జిల్లా కేంద్రంలో ప్రతినెల ఉద్యోగ మేళాను నిర్వహిస్తోంది. -
మక్త అనంతారం ప్రభుత్వ పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు
[ 04-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్రంలోనే స్వచ్ఛతకు కేరాఫ్గా నిలిచిన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం మక్త అనంతారం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు రాష్ట్రంలో మరో ప్రత్యేక గుర్తింపు దక్కింది. -
యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆరాధనలు
[ 04-07-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో బుధవారం మూలవరులను ఆరాధిస్తూ చేపట్టిన ఆస్థాన, ఆర్జిత పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. గర్భాలయ ద్వారాలను తెరిచిన పూజారులు హారతితో కొలిచారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్లోకి భారాస గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి?
-
పిల్లర్లే నల్లబల్లలు.. నాడు-నేడు పనులు పూర్తికాక ఇక్కట్లు
-
మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా
-
సగర్వంగా స్వదేశానికి.. భారత్ చేరుకున్న రోహిత్ సేన
-
ఉచిత ఇసుక మార్గదర్శకాలు సిద్ధం
-
ఏపీలో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి: మంత్రి కందుల దుర్గేష్