నమ్మించి నట్టేట్లో ముంచి..!
చిట్టీలు, వడ్డీల పేరిట ఓ వ్యక్తి పలువురిని నమ్మించి రూ.కోట్లు వసూలు చేసి ఉడాయించిన ఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
రూ. 23.32 కోట్ల వసూలు చేసి ఉడాయించిన వైనం
హయత్నగర్, న్యూస్టుడే: చిట్టీలు, వడ్డీల పేరిట ఓ వ్యక్తి పలువురిని నమ్మించి రూ.కోట్లు వసూలు చేసి ఉడాయించిన ఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం అమ్మనబోలు గ్రామానికి చెందిన చిట్టెటి మధుసూదన్రెడ్డి కుటుంబంతో కొన్నేళ్లుగా హయత్నగర్ రాజరాజేశ్వరి కాలనీలో ఉంటున్నాడు. ఓ కళాశాలలో అధ్యాపకుడిగా పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో సదరు కళాశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులతో ఏర్పడిన పరిచయాలను ఆసరాగా చేసుకొని చిట్టీలు, వడ్డీ వ్యాపారం ప్రారంభించాడు. స్వగ్రామంలో 100 ఎకరాల మామిడి తోట, హయత్నగర్లో సొంతిళ్లు, ప్లాట్లు ఉన్నాయంటూ నమ్మించాడు. దాదాపుగా 137 మంది నుంచి రూ.23.32 కోట్ల మేరకు డబ్బు తీసుకొని కొద్ది రోజులుగా ముఖం చాటేశాడు. దిక్కుతోచని స్థితిలో పలువురు బాధితులు ఆదివారం రాత్రి హయత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హయత్నగర్ సీఐ రామకృష్ణ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తొలకరి నిరాశే..!
[ 04-07-2024]
వానాకాలం ప్రారంభమై నెల గడిచినా.. మూడు జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే నమోదు అయింది.దీంతో పంటల సాగులో తీవ్ర జాప్యం నెలకొంటోంది. ఈ ఏడాది నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో కలిపి పంటల సాగు సగటు 15 శాతానికి కూడా మించలేదు. -
దళారీ.. అధికారి.. మధ్యలో రాయబారి
[ 04-07-2024]
రోడ్డు రవాణా సంస్థ కార్యాలయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి ఓ యజమాని (రాయబారి) రంగంలోకి దిగారు. అధికారులకు.. దళారులకు మధ్య సయోధ్య కుదర్చడం కోసం ముమ్మర ప్రయత్నం చేశారు. -
ఉచితానికి పచ్చజెండా..!
[ 04-07-2024]
కరెంటు కోసం ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. గత ఏడాది కాలంగా పెండింగ్లో ఉన్న ఉచిత విద్యుత్తు వ్యవసాయ బోరుబావుల దరఖాస్తులకు పచ్చజెండా ఊపింది. -
గౌరవం ఏదీ..?
[ 04-07-2024]
గౌరవ వేతనాల కోసం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఎదురు చూస్తున్నారు. -
సాంకేతికత మూలకేనా..!
[ 04-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు నిరర్ధకం అయ్యాయి. -
ప్రగతిచక్రంలో.. నియామకాల పర్వం
[ 04-07-2024]
ఆర్టీసీలో కొలువుల జాతర మొదలు కానుంది. సుమారు 12 ఏళ్లుగా ఎటువంటి నియామకాలు లేకపోగా.. ఉద్యోగ విరమణ పొందుతున్న వారితో సిబ్బంది భారీగా తగ్గుతూ వస్తున్నారు. -
చౌటుప్పల్ పట్టణాన.. పైవంతెన
[ 04-07-2024]
చౌటుప్పల్ పట్టణంలో జాతీయ రహదారి- 65పై ఫ్లైఓవర్ నిర్మాణం కానుంది. వంతెన నిర్మాణానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) రూ.114.40 కోట్లు మంజూరు చేసింది. -
తప్పు నుంచి మెప్పు దిశగా..!
[ 04-07-2024]
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న 213 మంది ఖైదీలను సత్ప్రవర్తన పేరుతో ప్రభుత్వం విడుదల చేసింది. -
అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి
[ 04-07-2024]
అనుమానాస్పద స్థితిలో వసతిగృహ విద్యార్థి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలోని ఎస్సీ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో బుధవారం చోటు చేసుకుంది. -
నిరుద్యోగుల నిరీక్షణ!
[ 04-07-2024]
ప్రభుత్వ కొలువులు దక్కని, ఉన్నత చదువులు చదివిన యువతకు ప్రభుత్వం జిల్లా కేంద్రంలో ప్రతినెల ఉద్యోగ మేళాను నిర్వహిస్తోంది. -
మక్త అనంతారం ప్రభుత్వ పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు
[ 04-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్రంలోనే స్వచ్ఛతకు కేరాఫ్గా నిలిచిన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం మక్త అనంతారం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు రాష్ట్రంలో మరో ప్రత్యేక గుర్తింపు దక్కింది. -
యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆరాధనలు
[ 04-07-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో బుధవారం మూలవరులను ఆరాధిస్తూ చేపట్టిన ఆస్థాన, ఆర్జిత పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. గర్భాలయ ద్వారాలను తెరిచిన పూజారులు హారతితో కొలిచారు.
తాజా వార్తలు (Latest News)
-
పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా
-
సగర్వంగా స్వదేశానికి.. భారత్ చేరుకున్న రోహిత్ సేన
-
ఉచిత ఇసుక మార్గదర్శకాలు సిద్ధం
-
ఏపీలో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి: మంత్రి కందుల దుర్గేష్
-
వెళ్లిపోవాలనుకునేవారిని ఎంత కాలం ఆపగలం?.. పార్టీ నేతలతో జగన్
-
దిల్లీ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు.. నేడు ప్రధాని మోదీతో భేటీ